Avinash reddy: పులివెందుల కౌన్సిలర్ల అసంతృప్తి.. పార్టీలోనే ఉండాలని ఎంపీ అవినాశ్‌ సూచన

పులివెందులలోని మున్సిపల్‌ కౌన్సిలర్లతో వైకాపా ఎంపీ అవినాశ్‌రెడ్డి సమావేశం నిర్వహించారు.

Updated : 29 Jun 2024 20:51 IST

పులివెందుల: పులివెందులలోని మున్సిపల్‌ కౌన్సిలర్లతో వైకాపా ఎంపీ అవినాశ్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. గత కొంత కాలంగా కౌన్సిలర్లు పార్టీపై అసంతృప్తితో ఉన్నారనే సమాచారంతో ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పులివెందుల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులు చేసినా తమకు బిల్లులు రాలేదని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడా కింద చేసిన రూ.250 కోట్ల నిధులు నిలిచిపోవడం పట్ల ఆందోళనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అవినాశ్‌రెడ్డి సమావేశం నిర్వహించడంతో తమకు డబ్బులు ఎవరు చెల్లిస్తారని ఆయనను కౌన్సిలర్లు నేరుగా ప్రశ్నించారు. ఇటీవల జగన్‌ పులివెందుల పర్యటనలోనూ వారు ఇదే విషయాన్ని లేవనెత్తారు. దీంతో అవినాశ్‌రెడ్డి కౌన్సిలర్లను సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసే వరకు వేచి చూద్దామని సర్ది చెప్పారు. అవసరమైతే కోర్టును ఆశ్రయిద్దామని అన్నారు. జగన్‌ అండగా ఉన్నారని.. పార్టీని అంటిపెట్టుకుని ఉండాలని సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని