- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Pawan Kalyan: మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలా పాలన అందిస్తాం
వైకాపా అప్పుల ఊబిలోకి నెట్టేసిన ఈ రాష్ట్రానికి అంకితభావం ఉన్న నాయకులు కలిస్తే తప్ప అభివృద్ధి రాదన్నది తన విశ్వాసమని.. చంద్రబాబు అనుభవం, కార్యదక్షత ప్రభుత్వాన్ని నడిపించగలవని నమ్మానని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అన్నారు.
ఆర్థికలోటు తీర్చి.. రాష్ట్రానికి నిధులు తెచ్చే బాధ్యత మాది
పిఠాపురం బహిరంగసభలో ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్
పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ కూడలిలో జరిగిన వారాహి బహిరంగసభలో మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్కల్యాణ్, చిత్రంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వర్మ, భాజపా నాయకుడు కృష్ణంరాజు, జనసేన జాతీయ అధికార ప్రతినిధి అజయ్కుమార్ తదితరులు
ఈనాడు, కాకినాడ- న్యూస్టుడే, పిఠాపురం: వైకాపా అప్పుల ఊబిలోకి నెట్టేసిన ఈ రాష్ట్రానికి అంకితభావం ఉన్న నాయకులు కలిస్తే తప్ప అభివృద్ధి రాదన్నది తన విశ్వాసమని.. చంద్రబాబు అనుభవం, కార్యదక్షత ప్రభుత్వాన్ని నడిపించగలవని నమ్మానని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అన్నారు. ‘కనీసం దశాబ్దంన్నర మీరు మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలా పాలన అందిస్తాం. చంద్రబాబు అపార అనుభవంతో ఒక్క వాలంటీరు అవసరం లేకుండా.. ప్రభుత్వ ఉద్యోగులతోనే ఒకటో తేదీన లక్షల మందికి పింఛన్లు అందించగలిగాం’ అని పేర్కొన్నారు. తనను ఎన్నికల్లో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు బుధవారం సాయంత్రం పిఠాపురంలో వారాహి బహిరంగసభను పవన్కల్యాణ్ నిర్వహించారు. చంద్రబాబు, తాను ఆర్థికంగా లోటులో ఉన్న రాష్ట్రాన్ని ఎలా బయటకు తీసుకురావాలని ఆలోచిస్తున్నామని.. నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు.
మరోసారి ప్రమాణం
‘పవన్కల్యాణ్ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను. అఖండ మెజారిటీతో గెలిపించిన నా పిఠాపురం నియోజకవర్గ ప్రముఖులకు, పెద్దలకు, ప్రజలకు, యువతకు, ఆడపడుచులకు, తల్లులకు ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నాను. మీ అభ్యున్నతికే కష్టపడతాను. లంచాలు తీసుకోను’ అంటూ సభలో మరోసారి పవన్ ప్రమాణం చేశారు. అసెంబ్లీలోకి ఎలా అడుగుపెడతావో చూస్తామని, గేటు కూడా తాకలేవని తనను వైకాపా నాయకులు అన్నారని.. గేటు బద్దలుకొట్టుకొని అసెంబ్లీలోకి పవన్ వస్తారన్న తెదేపా మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యాఖ్యలు నిజమయ్యాయని చెప్పారు. ‘2019 నుంచి 2024 వరకు 5కోట్ల మంది ప్రజలు.. ఐపీఎస్, ఐఏఎస్ యంత్రాంగం సైతం కొద్దిమందికి భయపడ్డారు. 164 అసెంబ్లీ, 21 పార్లమెంటు స్థానాలు ఎంత బలం ఇచ్చాయంటే.. మేము ఏపీ నుంచి వచ్చాం.. తెదేపా-భాజపా-జనసేన ప్రతినిధులమంటే మీకు ఏం కావాలో చెప్పండి అంటున్నారు’ అని చెప్పారు.
ఎమ్మెల్యే తాలూకా అని చెడ్డపేరు తేవొద్దు..
‘మీరు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకానే.. కానీ నాకు చెడ్డపేరు తీసుకురాకండి. రవాణా శాఖ అధికారులు మీ నంబర్ ప్లేట్లు చూసి అడిగినా.. వన్వేలో తప్పుగా వెళ్లి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనొద్దు.. చట్టాలు పాటించండి. మీకు అంత సరదాగా ఉంటే నేను కొన్న స్థలంలో బైక్లు తిప్పుకోండి.. మీరు బాగుండాలనే నేను కోరుకుంటా’ అని పవన్ అన్నారు.
బహిరంగసభకు హాజరైన జన సందోహం, అభిమానులు, జనసైనికులు
పిఠాపురంలో స్థలం కొన్నా.. ఇల్లు కట్టుకుంటా
పవన్ పిఠాపురంలో ఉండడు, హైదరాబాద్లో ఉంటాడని వైకాపా నేతలు విమర్శించారని.. తాను పిఠాపురంలో మూడున్నర ఎకరాలు కొని ఈరోజే రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని తెలిపారు. త్వరలో ఇల్లు, క్యాంపు ఆఫీసు కడతానన్నారు. వినతుల స్వీకరణకు అయిదుగురిని నియమించానని.. వైద్యం, విద్య, అపహరణలు, దాడులు, ఉపాధి తదితర సమస్యలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.
కొత్త విధానం వచ్చేవరకు మందు తాగొద్దు
సమస్యల పరిష్కారానికి క్వార్టర్ సమయం కావాలని పవన్ అనడంతో నవ్వులు విరిశాయి. ‘గత ప్రభుత్వం అమ్మే మద్యం క్వార్టర్ కాదు.. మూడు నెలలు సమయం ఇవ్వండి.. ఆ మందు ఇంకా అమ్ముతున్నారా..?’ అని ప్రశ్నించారు. ‘అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను అడగాలి. కొత్త విధానం తీసుకొచ్చేవరకూ తప్పదు. ఈలోపు ఆ మద్యం తాగకండి. ఆరోగ్యాలు కాపాడుకోండి’ అంటూ హితవు పలికారు.
మూడు నెలల తర్వాత సినిమాలు
యువత ఓజీ.. ఓజీ.. అంటూ పవన్ కొత్త సినిమా టైటిల్ పేరు చెబుతూ నినాదాలు చేశారు. ‘సినిమాలు చేసే సమయం ఉందంటారా...? చూద్దాం. మూడు నెలలు ఇవ్వండి. రోడ్లు వేయలేదని, గుంతలు పూడ్చలేదని, ఏమీ చేయలేదని జనం తిట్టకూడదు కదా.. మా నిర్మాతలను కొంత సమయం కోరాను. మా ప్రజలకు సేవచేస్తానని చెప్పా’ అని పవన్ అన్నారు.
అరాచక ప్రభుత్వాన్ని మట్టిలో కలిపారు
‘రక్తం చిందించకుండా ప్రజాస్వామ్య విధానాల ద్వారా విప్లవం తెచ్చారు.. 151 స్థానాలున్న అరాచక ప్రభుత్వాన్ని మట్టిలో కలిపేసి 11 స్థానాలకు కుదించారంటే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప లక్షణం అర్థమవుతోంది. మాట్లాడడం కంటే పనిచేయడం మాకు ఇష్టం. కొంచెం సమయం ఇవ్వండి. అన్ని సమస్యలకూ పరిష్కారం చూపుతాం. భవిష్యత్తులో మీరు ఎవరివైపూ చూడాల్సిన అవసరం రాదు.’
వైకాపా నాయకుల్లా దౌర్జన్యాలు వద్దు
‘మనం గెలిచాం కదా అని.. గత ప్రభుత్వ నాయకుల్లా దాడులు చేయొద్దు. చొక్కాలు పట్టుకుని బూతులు తిట్టొద్దు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టొద్దు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అధికారులపై జులుం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని మా నాయకులకు చెప్పా.’
పిఠాపురం బహిరంగసభలో ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు నాయకుడు.. జగన్ ప్రతినాయకుడు
రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు దిల్లీ వెళితే.. హింసా రాజకీయాల్ని ప్రోత్సహించే వైకాపా అధ్యక్షుడు జగన్ మాత్రం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు జైలుకు వెళ్లారని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. -
అసెంబ్లీకి ఐదేళ్లలో సున్నం కూడా వేయలేదు
వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతిని నాశనం చేశారని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. అందరం కలసి మంచి రాజధానిని నిర్మించుకోవాలని పేర్కొన్నారు. -
చంద్రబాబుకు హైదరాబాద్లో ఘనస్వాగతం
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హైదరాబాద్లో ఘనస్వాగతం లభించింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శుక్రవారం ఆయన తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. -
చిత్తూరులో వైకాపాకు భారీ షాక్
వైకాపాకు చిత్తూరులో భారీ షాక్ తగిలింది. నగర మేయర్ ఎస్.అముద ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేసి తెదేపాలో చేరారు. -
దర్శి వైకాపా ఎమ్మెల్యే హల్చల్
అధికార అండతో ఇన్నాళ్లూ దౌర్జన్యాలకు పాల్పడిన వైకాపా నాయకులు ఇప్పుడు కూడా అదే మార్గంలో వెళుతున్నారు. -
సొంత బాబాయ్ చనిపోయినా.. జగన్ ఇంతలా స్పందించలేదు
తన బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి చనిపోతే పట్టించుకోని జగన్.. ఈవీఎం పగలగొట్టి, సీఐ హత్యకు యత్నించి జైలుపాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టి హెలికాప్టర్లో వెళ్లడం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. -
భవిష్యత్తులో అమరావతిపై అనిశ్చితి ఏర్పడకుండా చూడాలి: సీపీఎం
రాజధాని అమరావతిపై భవిష్యత్తులో అనిశ్చితి, గందరగోళం ఏర్పడకుండా వ్యవస్థీకృతమైన సమగ్ర ఏర్పాట్లు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. -
ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్యేల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులుగా నామినేషన్ వేసిన సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
లోక్సభ హౌస్ కమిటీలో పురందేశ్వరికి చోటు
ఎంపీల వసతి, ఇతర సదుపాయాలను పర్యవేక్షించే లోక్సభ హౌస్ కమిటీ ఏర్పాటైంది. భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మహేశ్ శర్మ నేతృత్వం వహించనున్న ఈ కమిటీలో 12 మంది సభ్యులను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నామినేట్ చేశారు. -
పిన్నెల్లి వాసుల సమస్యపై కోర్టుకు వెళ్దాం
గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో ఎన్నికలప్పటి నుంచి పరిస్థితి కుదుటపడలేదని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్కు తెలిపారు. -
8న రాజమహేంద్రవరంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం
రాజమహేంద్రవరంలో ఈ నెల 8న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు వెల్లడించారు. -
ఓటమిపై కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు
మాజీ సీఎం, భారాస అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల్లో ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
భారాస అధికారిక సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు. -
కేశవరావు రాజీనామాకు ఆమోదం
రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు చేసిన రాజీనామాను ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ శుక్రవారం ఆమోదించారు. -
తెలంగాణ దాటితే కేసీఆర్ను ఎవరూ గుర్తుపట్టరు
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్లో కూర్చొని ఆ పార్టీ శ్రేణులకు పేదరాసి పెద్దమ్మ కథలు చెప్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. -
ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన స్పీకర్
ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించే విషయమై దాదాపు నెల రోజులుగా పశ్చిమబెంగాల్ రాజ్భవన్, ఆ రాష్ట్ర శాసనసభ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయిందని భావిస్తున్న తరుణంలో మరో వివాదం తలెత్తింది. -
హాథ్రస్పై రాజకీయం చేయను
దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన హాథ్రస్ తొక్కిసలాటపై తాను రాజకీయాలు చేయదలచుకోవడం లేదని, కానీ తప్పు రాష్ట్ర అధికార యంత్రాంగానిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
నెల రోజుల్లో మోదీ ప్రభుత్వ పతనం
కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని, నెల రోజుల్లోపే అది కుప్పకూలడం ఖాయమని ఆర్జేడీ అధ్యక్షుడు లాలా ప్రసాద్ యాదవ్ అన్నారు. -
మండలి హస్తగతమే లక్ష్యం
తెలంగాణ శాసనమండలిలో మెజారిటీ సభ్యులను తమ పార్టీలో చేర్చుకొని ఆధిపత్యం చాటేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. -
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవద్దు
గద్వాల భారాస ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తూ ఆ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం గాంధీభవన్లో ఆందోళనకు దిగారు. -
పవన్కల్యాణ్ వల్లే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం: జగ్గారెడ్డి
జనసేన అధినేత పవన్కల్యాణ్ తెదేపాతో భాజపాకు పొత్తు కుదర్చకపోతే కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చేది కాదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.