Pawan Kalyan: కాకినాడ కలెక్టరేట్‌లో డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష

కాకినాడ జిల్లా అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు.

Updated : 02 Jul 2024 12:26 IST

కాకినాడ: కాకినాడ జిల్లా అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోని ప్రధాన సమస్యలపై చర్చించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటిపారుదలశాఖల పరిధిలోని పలు సమస్యలను పవన్‌ అడిగి తెలుసుకున్నారు. 

ఈ సమావేశంలో ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని