- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Pawan Kalyan: తప్పులన్నీ బయటకు తీస్తాం..
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు ఆగిపోతాయని భయపెట్టారని.. కానీ ఎక్కడా అలా జరగలేదని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్కల్యాణ్ పేర్కొన్నారు.
వ్యవస్థను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది
హామీ ప్రకారం పింఛన్ల సొమ్ము పెంచి ఇళ్ల వద్దే ఇస్తున్నాం
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్
కాకినాడ జిల్లా గొల్లప్రోలులో మహిళకు పింఛను అందిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్. చిత్రంలో వర్మ
ఈనాడు, కాకినాడ- న్యూస్టుడే, గొల్లప్రోలు: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు ఆగిపోతాయని భయపెట్టారని.. కానీ ఎక్కడా అలా జరగలేదని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్కల్యాణ్ పేర్కొన్నారు. రెట్టింపు పింఛను ఇళ్లకు వస్తోందన్నారు.మాట ఇచ్చినట్లు సొమ్ము పెంచామని తెలిపారు. పింఛన్లు పంపిణీ చేస్తామని గత ప్రభుత్వం వాలంటీర్లనే ప్రైవేటు సంస్థను పెట్టిందని ధ్వజమెత్తారు. వారు పింఛను ఇచ్చినందుకు రూ.100 నుంచి రూ.300 లంచంగానో.. నజరానాగానో తీసుకునేవారని ఆరోపించారు. ఇప్పుడు ఉద్యోగుల ద్వారా అందుతోందన్నారు. ఎవరైనా లంచం అడిగితే ప్రభుత్వ అధికారులకు, కూటమి నాయకులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. తాము ప్రజల కోసం పనిచేయకపోతే నిలదీయవచ్చన్నారు. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా చూపాలో ఆలోచిస్తున్నామని వివరించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్కల్యాణ్ మాట్లాడారు. ‘‘మాకు ఓటేశారో లేదో అడగం.. ఏ పార్టీ వారైనా, అర్హత ఉంటే లబ్ధి చేకూరుతుంది. అద్భుతాలు చేస్తామని చెప్పట్లే.. ఉన్నది ఉన్నట్లు చెబుతాం. ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీల్లో ఎన్ని వేల టన్నుల పేదల బియ్యం పట్టుకున్నారో మీకు తెలుసు. గత ప్రభుత్వంలో పేదలకు చేరాల్సిన బియ్యాన్ని దాచేశారు. కడపలాంటి చోట బెరైటీస్ గనులను ఖాళీ చేశారు. ఇసుక, మైనింగ్లో ఒక్కో అవినీతి తవ్వితే ఎన్ని బయటపడతాయో తెలీదు. మాది ప్రతీకార ప్రభుత్వం కాదు. తప్పుల్ని మాత్రం బయటకు తీస్తాం. ఇది ప్రజల కష్టాలు వినే ప్రభుత్వం.
గొల్లప్రోలులో పింఛన్ల నమూనా చెక్కుతో పవన్కల్యాణ్. చిత్రంలో ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ తదితరులు
పథకాలపై రీసర్వే జరిగితే మంచిది..
గత ప్రభుత్వం అర్హతలేని వారికి పథకాలు ఇచ్చి, ఉన్నవారికి తీసేసిందనే ఆరోపణలు ఉన్నాయి. సంక్షేమ పథకాలపై రీసర్వే జరిగితే మంచిది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, క్యాబినెట్లో చర్చిస్తాం.
జీతం వద్దని చెప్పా
నా క్యాంపు కార్యాలయం మరమ్మతులు చేస్తామంటే వద్దన్నా. ఫర్నిచర్ కొత్తది వద్దని, నేనే తెచ్చుకుంటానని తెలిపా. సెక్రటేరియట్ సిబ్బంది వచ్చి జీతం ఇవ్వడానికి సంతకాలు పెట్టమంటే మనస్కరించలేదు. జీతం తీసుకుని పనిచేస్తా అనుకున్నా.. అప్పగించిన శాఖలో డబ్బుల్లేవు. ఈ పరిస్థితుల్లో జీతం తీసుకోవడం తప్పని భావించి వద్దని చెప్పా. పంచాయతీరాజ్శాఖ లెక్కలు చూస్తుంటే నిధులు ఎటు వెళ్లిపోయాయో తెలియట్లేదు. ఎన్ని వేల రూ.కోట్లు అప్పులున్నాయో తెలియట్లేదు. ఇష్టారాజ్యంగా నిధుల ఖర్చు చూపారు. శాఖలో అంతా అడ్డగోలుగా ఉంది. రోడ్లు, కాలువల మరమ్మతులకు కనీస ప్రాధాన్యం ఇవ్వలేదు. జల్జీవన్ మిషన్ ద్వారా కేంద్రం నుంచి నిధులకు కొరతలేదు.. అయినా ఎందుకు చేయలేకపోయారో అర్థం కాలేదు. కొల్లేరు ఉన్న కైకలూరు నియోజకవర్గంలో 80 శాతం చేపల చెరువులు ఉన్నా తాగడానికి నీళ్లు లేవు. గోదావరి జిల్లాల్లోనూ అదే పరిస్థితి. పంచాయతీరాజ్ శాఖను నడిపే వ్యక్తిగా చెబుతున్నా.. నా వైపు నుంచి అవినీతి ఉండదని మాటిస్తున్నా. ఎన్నికల్లో 21కి 21 ఎలా కొట్టామో రక్షిత మంచినీరు లేని గ్రామం లేదని అనిపించుకోవాలన్నది నా కోరిక. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు ఉండాలి. అరకులో గర్భిణులను డోలీల్లో తీసుకొచ్చే పరిస్థితి పోవాలి. మన్యం వెళ్లి ప్రతి కుగ్రామం చూడాలని ఉంది. పర్యావరణ శాఖను బలోపేతం చేస్తాం. ఏ కాలుష్యం ఎందుకు వస్తుందో ఆరా తీస్తాం. పారిశ్రామికవేత్తలు ఏం చేస్తున్నారో తెలుసుకుంటాం.
అప్పుడే పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రకటించుకుంటా..
నన్ను పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటా. ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలచుకోలేదు.. తక్కువ చెప్పి, ఎక్కువ చేయాలని అనుకుంటున్నా. ఇప్పుడిక హామీలు నెరవేర్చడమే మన ముందున్న సవాలు. గెలిచిన వెంటనే విజయయాత్ర చేస్తే తృప్తి, ఆనందం ఉండదు. పనిచేసి మీ మన్ననలు పొందాకే ఆనందం వస్తుంది. అప్పుడే నాకు నేను పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రకటించుకుంటా’’ అని పవన్ కల్యాణ్ వివరించారు. కార్యక్రమంలో కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ, తెదేపా మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ తదితరులు పాల్గొన్నారు.
పింఛన్ల పెంపు చంద్రబాబుతోనే సాధ్యం..
‘‘ఇది ఏ ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు. చంద్రబాబు అధినాయకత్వంలో తెలుగుదేశం సారథ్య పార్టీగా, జనసేన వెన్నుదన్నుగా, భాజపా ఆశీస్సులతో కూడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లగలరు. మాట ఇచ్చినట్లు ప్రభుత్వం ఏర్పడిన నెలలోనే పెంచిన పింఛను సొమ్ము ఇంటింటికీ ఇవ్వడం ఆయన అనుభవంతోనే సాధ్యమైంది.’’
ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) కొత్త అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం వాయిదాపడింది. -
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
భారాసకు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్
‘వెళ్లిపోవాలనుకునేవారిని ఎంతకాలం ఆపగలం, అది వారిష్టం.. విలువలు, నైతికత అనేవి వారికి ఉండాలి. వెళ్లేవారు వెళతారు. బలంగా నిలబడగలిగేవారే నాతో ఉంటారు. పార్టీలో నేను, అమ్మ ఇద్దరమే మొదలై ఇంత దూరం వచ్చాం. -
మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలా పాలన అందిస్తాం
వైకాపా అప్పుల ఊబిలోకి నెట్టేసిన ఈ రాష్ట్రానికి అంకితభావం ఉన్న నాయకులు కలిస్తే తప్ప అభివృద్ధి రాదన్నది తన విశ్వాసమని.. చంద్రబాబు అనుభవం, కార్యదక్షత ప్రభుత్వాన్ని నడిపించగలవని నమ్మానని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అన్నారు. -
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన సాయం కోరే ఉద్దేశంతో చంద్రబాబు బుధవారం రాత్రి దిల్లీ చేరుకున్నారు. -
ఎట్టకేలకు వైకాపా నేతల అరెస్టు
గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైకాపా ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ను నిందితులుగా గుర్తించారు. -
కనీసం తాగునీటి పరీక్షలూ జరగలేదు
గత వైకాపా ప్రభుత్వ విధ్వంస పాలన వల్ల ప్రజలు బలవుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. -
చట్ట పరిధిలో దోషుల్ని శిక్షిద్దాం.. క్షేత్రస్థాయికి వెళ్లొద్దు
‘‘దోషుల్ని చట్ట పరిధిలో శిక్షిద్దాం. అంతేతప్ప క్షేత్రస్థాయికి వ్యక్తిగతంగా వెళ్లొద్దు’’ అని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. -
రేపు హైదరాబాద్కు చంద్రబాబునాయుడు
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 5వ తేదీన హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు ఆయన చేరుకుంటారు. -
9.44 లక్షల మంది విద్యార్థులకు రూ.3,480 కోట్లు ఎగ్గొట్టిన జగన్
రాష్ట్రంలో సుమారు 9,44,666 మంది విద్యార్థులకు ఫీజులు కట్టకుండా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే పోలవరం జాప్యం: కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ
జగన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. -
కర్ణాటక ఉపముఖ్యమంత్రితో వైఎస్ షర్మిల చర్చలు
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్తో బెంగళూరులో సమావేశమయ్యారు. నగరంలోని సదాశివనగరలో డీకే శివకుమార్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె వర్తమాన రాజకీయాలపై చర్చించారు. -
గడువులోగా పురపాలక ఎన్నికలు అనుమానమే!
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు గడువులోగా నిర్వహించడం ప్రశ్నార్థకంగా మారింది. పలు చిక్కుముడులు వీడితే తప్ప ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని అధికార యంత్రాంగం సైతం అభిప్రాయపడుతోంది. -
ఏపీలో ఏడు మండలాల విలీనానికి భారాస, భాజపాలే కారణం
రైతుభరోసా అమలుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని, త్వరలో రుణమాఫీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు. -
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు నమోదు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై.. కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 221, 126(2) కింద కరీంనగర్ ఒకటో ఠాణాలో కేసు నమోదైంది. -
2028 ఎన్నికల్లో భారాసదే అధికారం
రాజకీయాల్లో జయాపజయాలు సహజమని, ఓటమి తర్వాత వచ్చేది గెలుపేనని.. 2028 ఎన్నికల్లో భారాస మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
రాజకీయ వ్యవహారాల కమిటీలో కిషన్రెడ్డి
దేశంలో భద్రత, ఆర్థిక, రాజకీయాలతో పాటు పలు వ్యవహారాల పరిశీలనకు మోదీ ప్రభుత్వం 8 క్యాబినెట్ కమిటీలను బుధవారం ఏర్పాటు చేసింది. -
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొన్నినెలలకే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భాజపా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు. -
సంక్షిప్త వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తోందని భాజపా ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
కాంగ్రెస్లో చేరిన కేశవరావు
భారాస తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నాయకుడు కె.కేశవరావు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విరక్తి
అధికారంలోకి వచ్చిన అతి కొద్దికాలంలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర విరక్తి చెందారని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
-
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్
-
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ