- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Lok Sabha: మోదీవే అసత్య ప్రకటనలు.. చర్యలు తీసుకోండి: కాంగ్రెస్
ప్రధాని మోదీ, ఎంపీ అనురాగ్ ఠాకూర్ అసత్య ప్రకటనలు చేస్తూ సభను తప్పుదోవ పట్టించారని, వారిపై చర్యలు తీసుకోవాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ లేఖ రాసింది.
దిల్లీ: రాజ్యాంగానికి అతిపెద్ద వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీయేనని, ఇప్పుడు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు కల్లబొల్లిమాటలు చెబుతోందని ప్రధాని మోదీ (PM Modi) విమర్శించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ లేఖాస్త్రం సంధించింది. మోదీ, భాజపా ఎంపీ అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur)సత్యదూరమైన ప్రకటనలు చేస్తూ సభను తప్పుదోవ పట్టించారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాగూర్ (Manickam Tagore) లేఖ రాశారు. రాజ్యాంగంలోని 115(1) నిబంధన ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధనల ప్రకారం ఎవరైనా ఎంపీ సభలో అసత్య ప్రకటనలు చేస్తే.. సభాముఖంగా వాటిని తూర్పారబెట్టాలని ఎవరైనా సభ్యులు భావించినప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తక ముందే సభాపతికి లేఖ రాయాల్సి ఉంటుంది. చర్చ జరిపిన తర్వాత ఆ ప్రకటనలు తప్పని నిరూపిస్తే.. రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగిస్తారు.
మంగళవారం ప్రధాని మోదీ లోక్సభలో మాట్లాడుతూ.. మహిళలకు నెలకు రూ.8,500 ఇస్తామని కాంగ్రెస్ తప్పుడు వాగ్దానం చేసిందని అన్నారు. ఈ అంశాన్ని ఠాకూర్ లేఖలో ప్రస్తావించారు. విజయం సాధించి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పామని, అది తప్పుడు వాగ్దానం ఎలా అవుతుందని ప్రశ్నించారు?ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసిన రాష్ట్రాల్లో 16 చోట్ల ఓట్ షేర్ పడిపోయిందని మోదీ అన్నారని, అయితే, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓట్ షేర్ అనూహ్యంగా పెరిగిందని, మోదీవి తప్పుడు ప్రకటనలు కాదా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో ఆర్మీ జవాన్లకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కేంద్రం సమకూర్చలేదని ప్రధాని మోదీ అనడం ఏమాత్రం సరికాదని, అప్పట్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కొరత ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ, అసలు జాకెట్లే లేవని చెప్పడం సమంజసం కాదన్నారు. ముంబయి దాడుల సమయంలో స్థానిక పోలీసులకు కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సమకూర్చామని చెప్పారు. ఇండియన్ ఆర్మీకి ఫైటర్ జెట్లను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని మోదీ చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని, యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు జాగ్వార్, మిగ్ 29, ఎస్యూ-30, మిరాజ్-2000 లాంటి ఫైటర్ జెట్లతో న్యూక్లియర్ బాంబులు, అగ్ని, పృథ్వీ, అకాశ్, నాగ్, త్రిశూల్ ఆ తర్వాత బ్రహ్మోస్ లాంటి అద్భుత క్షిపణులు అందుబాటులో ఉన్నాయన్నారు.
భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 25 కోట్ల మందిని అభివృద్ధి పథంవైపు నడిపంచామన్న ఠాకూర్ వ్యాఖ్యల్లోనూ నిజం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా మోదీ పని చేస్తున్నారని పాలక పక్షం గొప్పలు చెప్పుకుంటోందని, వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారాలకు వెళ్లిన మోదీ.. ఏ రకమైన సెలవులు తీసుకొని వెళ్లారో సభకు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇలా అధికార భాజపా అసత్య ప్రకటనలు రికార్డులో ఉంచుతూ.. నిజం మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ వ్యాఖ్యలను ఎలాంటి చర్చ లేకుండానే రికార్డుల నుంచి తొలగించడం సరికాదని ఠాకూర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు బుధవారం రాజ్యసభలో మోదీ సమాధానమిస్తూ.. రాజ్యాంగాన్ని కాపాడడమనే అంశంపై ఎన్నికల్లో పోరాడినట్లు విపక్షం చెప్పడాన్ని తప్పుబట్టిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం.. 10 అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం సాయంత్రం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ముఖాముఖి భేటీ అయ్యారు. -
రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్బాబును కలిసిన భారాస ఎమ్మెల్యేలు
రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్బాబును శనివారం పలువురు భారాస ఎమ్మెల్యేలు కలిశారు. -
అయోధ్య ఫలితం.. గుజరాత్లోనూ రిపీట్: రాహుల్
భాజపాను అయోధ్యలో ఓడించినట్లే గుజరాత్లోనూ ఓడిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలపై మోదీ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. -
భారాసకు షాక్.. కాంగ్రెస్లోకి మరో ఎమ్మెల్యే
భారాసకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో చేరారు. -
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావు
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావు నియమితులయ్యారు. -
మార్కెట్కు అనుగుణంగా నైపుణ్య శిక్షణ: ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గత ఐదేళ్లలో నైపుణ్య శిక్షణపరంగా రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. -
రెండు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలి: ఎంపీ లక్ష్మణ్
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని ఎంపీ లక్ష్మణ్ కోరారు. -
వ్యవస్థను ప్రక్షాళన చేసి ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ సాధిస్తాం: మంత్రి సత్యకుమార్
ప్రాణం నిలబెట్టే ఆసుపత్రులు నిజమైన దేవాలయాలు అని మంత్రి సత్యకుమార్ అన్నారు. -
కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు
ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు నమోదైంది. ఆయనతో పాటు వైకాపా నేత కొడాలి నాని, కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి కలెక్టర్ మాధవీలతారెడ్డిపై కేసు నమోదు చేశారు. -
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ పోడియంను భారాస కార్పొరేటర్లు చుట్టుముట్టారు. -
చంద్రబాబు నాయకుడు.. జగన్ ప్రతినాయకుడు
రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు దిల్లీ వెళితే.. హింసా రాజకీయాల్ని ప్రోత్సహించే వైకాపా అధ్యక్షుడు జగన్ మాత్రం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు జైలుకు వెళ్లారని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. -
అసెంబ్లీకి ఐదేళ్లలో సున్నం కూడా వేయలేదు
వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతిని నాశనం చేశారని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. అందరం కలసి మంచి రాజధానిని నిర్మించుకోవాలని పేర్కొన్నారు. -
చంద్రబాబుకు హైదరాబాద్లో ఘనస్వాగతం
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హైదరాబాద్లో ఘనస్వాగతం లభించింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శుక్రవారం ఆయన తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. -
చిత్తూరులో వైకాపాకు భారీ షాక్
వైకాపాకు చిత్తూరులో భారీ షాక్ తగిలింది. నగర మేయర్ ఎస్.అముద ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేసి తెదేపాలో చేరారు. -
దర్శి వైకాపా ఎమ్మెల్యే హల్చల్
అధికార అండతో ఇన్నాళ్లూ దౌర్జన్యాలకు పాల్పడిన వైకాపా నాయకులు ఇప్పుడు కూడా అదే మార్గంలో వెళుతున్నారు. -
సొంత బాబాయ్ చనిపోయినా.. జగన్ ఇంతలా స్పందించలేదు
తన బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి చనిపోతే పట్టించుకోని జగన్.. ఈవీఎం పగలగొట్టి, సీఐ హత్యకు యత్నించి జైలుపాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టి హెలికాప్టర్లో వెళ్లడం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. -
భవిష్యత్తులో అమరావతిపై అనిశ్చితి ఏర్పడకుండా చూడాలి: సీపీఎం
రాజధాని అమరావతిపై భవిష్యత్తులో అనిశ్చితి, గందరగోళం ఏర్పడకుండా వ్యవస్థీకృతమైన సమగ్ర ఏర్పాట్లు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. -
ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్యేల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులుగా నామినేషన్ వేసిన సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
లోక్సభ హౌస్ కమిటీలో పురందేశ్వరికి చోటు
ఎంపీల వసతి, ఇతర సదుపాయాలను పర్యవేక్షించే లోక్సభ హౌస్ కమిటీ ఏర్పాటైంది. భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మహేశ్ శర్మ నేతృత్వం వహించనున్న ఈ కమిటీలో 12 మంది సభ్యులను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నామినేట్ చేశారు. -
పిన్నెల్లి వాసుల సమస్యపై కోర్టుకు వెళ్దాం
గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో ఎన్నికలప్పటి నుంచి పరిస్థితి కుదుటపడలేదని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్కు తెలిపారు. -
8న రాజమహేంద్రవరంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం
రాజమహేంద్రవరంలో ఈ నెల 8న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పునర్వినియోగం కాని వస్తువులను ప్రోత్సహించొద్దు: డిప్యూటీ సీఎం పవన్
-
5-10 ఏళ్లలో ₹2.5 లక్షల కోట్లకు.. డీమార్ట్నీ అధిగమిస్తాం: జెప్టో సీఈఓ
-
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
-
బ్లూ లైన్లో యుద్ధ మేఘాలు.. ఐరాస తీవ్ర ఆందోళన
-
కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. 15 మందికి గాయాలు!
-
14 ఏళ్లుగా ప్రధాని.. పదవి నుంచి దిగి సైకిల్పై ఇంటికి..