- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Congress: కాంగ్రెస్లో నూతనోత్సాహం.. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, ఎన్నికల వ్యూహాలను రూపొందించేందుకుగానూ వచ్చే వారం నుంచే కాంగ్రెస్ కార్యాచరణ ప్రారంభించనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన కాంగ్రెస్ (Congress).. ఈ ఏడాది జరగనున్న ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జోష్ కొనసాగించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఝార్ఖండ్, మహారాష్ట్ర, హరియాణా, జమ్మూ-కశ్మీర్లలో హస్తం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, ఎన్నికల వ్యూహాలను రూపొందించేందుకుగాను వచ్చే వారం నుంచే స్థానిక నేతలతో సంప్రదింపులు ప్రారంభించనుంది.
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీల ఆధ్వర్యంలో ఈ నెల 24న ఝార్ఖండ్ నేతలతో భేటీ మొదలు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. 25న మహారాష్ట్ర, 26న హరియాణా, 27న జమ్మూ-కశ్మీర్ నేతలతో అసెంబ్లీ ఎన్నికల వ్యూహ, ప్రతివ్యూహాలపై వారు కసరత్తు జరుపుతారని తెలిపారు. ప్రస్తుతం తమకు అనుకూలంగా ఉన్న రాజకీయ పరిస్థితులను మరింత అధ్యయనం చేస్తూ .. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే అంకితభావంతో ఉన్నామని తెలిపారు.
మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26తో, హరియాణా.. నవంబర్ 3, ఝార్ఖండ్.. వచ్చే ఏడాది జనవరి 5తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు.. జమ్మూ-కశ్మీర్లో సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు.. ఎన్నికల సన్నద్ధతకుగానూ ఈ రాష్ట్రాలకు భాజపా ఇప్పటికే తన ఇన్ఛార్జులను నియమించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయండి: కేంద్రమంత్రిని కోరిన భాజపా ఎంపీలు
వైజాగ్ స్టీల్ప్లాంట్ అంశంపై కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖమంత్రి కుమారస్వామిని దిల్లీలో బుధవారం ఏపీ భాజపా ఎంపీలు కలిశారు. -
తెలంగాణకు రావాల్సిన నిధులు సాధించడమే మా లక్ష్యం: కోమటిరెడ్డి
కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. -
వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు
ఈవీఎం ధ్వంసం, ఎన్నికల అల్లర్ల కేసుల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. -
మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు సరికాదని చెప్పినా భారాస ప్రభుత్వం పట్టించుకోలేదు: కోదండరాం
మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం మంచిది కాదని చెప్పినా భారాస ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. -
ప్రజలకు ముఖం చూపించుకోలేక జగన్ కుయుక్తులు: ఎమ్మెల్యే మాధవీరెడ్డి
ప్రతిపక్ష హోదా కోసం వైకాపా అధ్యక్షుడు జగన్ స్పీకర్కు లేఖ రాయడం సిగ్గుచేటని తెదేపా ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డి ఎద్దేవా చేశారు. -
ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండా మంచి సేవలందిస్తాం: ఏపీ మంత్రి రామ్ప్రసాద్రెడ్డి
వైకాపా హయాంలో రవాణా శాఖ నిర్వీర్యమైందని మంత్రి రామ్ప్రసాద్రెడ్డి విమర్శించారు. కుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడారు. -
అధైర్యపడొద్దు అండగా ఉంటా.. ప్రజాదర్బార్కు తరలివచ్చిన ప్రజలకు లోకేశ్ భరోసా
కష్టాల్లో ఉన్నవారికి అండగా నేనున్నానంటూ సమస్యల పరిష్కారం కోసం ‘ప్రజాదర్బార్’కు తరలివచ్చిన ప్రజలకు మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. -
జగన్ ప్రతిపక్ష నేత కాదు.. వైకాపా ఫ్లోర్ లీడర్ మాత్రమే: మంత్రి పయ్యావుల
వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష నేత కాదని.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఏపీ ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. -
ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి బుజ్జగింపులు.. దిల్లీకి చేరిన జగిత్యాల పంచాయితీ
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి దిల్లీకి రావాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ నుంచి పిలుపు వచ్చింది. -
కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. వినతులు ఇచ్చేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు
సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈక్రమంలో ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ఆయనకు వినతులు ఇచ్చేందుకు ప్రజలు పెద్దఎత్తున చేరుకున్నారు. -
అప్పుడలా.. ఇప్పుడిలా.. ప్రతిపక్ష హోదాపై జగన్ రకరకాల మాటలు
ప్రస్తుత సభలో తన పార్టీకి కేవలం 11 మంది సభ్యులే ఉన్నప్పటికీ.. తానే ప్రతిపక్ష నేతనని జగన్ చెబుతున్నారు. ఆయన విచిత్ర వాదనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఇలాగే చేస్తే.. క్రికెట్ టీం కాస్తా వాలీబాల్ టీం అవుతుంది: మంత్రి గొట్టిపాటి
జగన్ బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇకనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయకపోతే క్రికెట్ టీం కాస్తా వాలీబాల్ టీం అవుతుందని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విరుచుకుపడ్డారు. -
సైనిక్ స్కూల్పై రేవంత్రెడ్డి అబద్ధాలు
సీఎం స్థానంలో ఉండి రేవంత్రెడ్డి సైనిక్ స్కూల్పై అబద్ధాలు మాట్లాడారని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీలను అమలుచేయడంలో విఫలమైందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. -
ఎమర్జెన్సీతో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ అపహాస్యం చేసింది!
‘రాత్రికి రాత్రి ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడటం తగదని’ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. -
తెలుగు ప్రజల దయాదాక్షిణ్యాలతో మోదీకి అధికారం: కూనంనేని
సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుస్తామని చెప్పిన ప్రధాని మోదీ 240 సీట్లకే పరిమితమై.. తెలుగు రాష్ట్రాల ప్రజల దయాదాక్షిణ్యాలతో కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
నయవంచనకు ప్రతిరూపమే కాంగ్రెస్: కేటీఆర్
ఓ వైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూనే మరోవైపు పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. -
మోదీ విధానాలను రేవంత్ అనుసరిస్తున్నారు: జగదీశ్రెడ్డి
భాజపాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ దాడి చేస్తుంటే.. ఇక్కడ రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి మోదీ విధానాలను అనుసరిస్తున్నారని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. -
పరస్పర సవాళ్లతో హుజూరాబాద్లో ఉద్రిక్తత
కాంగ్రెస్, భారాస నేతల పరస్పర సవాళ్లతో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
నాడు ఎమర్జెన్సీ విధించి నేడు రాజ్యాంగంపై నాటకాలా?
దేశంలో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి, పౌరుల ప్రాథమిక హక్కుల్ని కాలరాసి.. రాజ్యాంగాన్ని అణగదొక్కినవారికి రాజ్యాంగంపై ప్రేమ నాటకాలాడే హక్కు లేదని ప్రధాని నరేంద్రమోదీ ఆక్షేపించారు. -
స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావాలి: శరద్ పవార్
లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావాలని ఇండియా కూటమి సభ్యులకు సూచించానని, అదే సమయంలో డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ స్పష్టం చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయండి: కేంద్రమంత్రిని కోరిన భాజపా ఎంపీలు
-
ఎవరు గెలిచినా ఫస్ట్ టైమ్.. మరో సంచలనం చూస్తామా?
-
జపాన్ బాలికపై అమెరికా సైనికుడి అత్యాచారం: మరోసారి ఒకినావా స్థావరంపై విమర్శలు
-
వైద్యుడు సహా కుమార్తెకు జికా వైరస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఐదేళ్లలో కేంద్రం విడుదల చేసిన రూ.1,066 కోట్లు ఏమయ్యాయి?: డిప్యూటీ సీఎం పవన్