- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Congress Party: వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై దిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తుండగా వచ్చే వారంలో తుది నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది.
ఈనాడు, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై దిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తుండగా వచ్చే వారంలో తుది నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాల సమాచారం. గురువారం రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వద్ద జరిగిన సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ల ఎంపిక, కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం, ఇతర పార్టీల నుంచి వచ్చే ఎమ్మెల్యేలను చేర్చుకోవడం... ఇలా అన్ని అంశాల గురించి కూలంకషంగా చర్చించినట్లు తెలిసింది. శుక్రవారం రాహుల్గాంధీని కలిసేందుకు నేతలు సమయం కోరినా, పార్లమెంటు సమావేశాల దృష్ట్యా సోమవారం వరకు వీలు కాకపోవచ్చని సమాచారం అందినట్లు తెలిసింది.
సుదీర్ఘ చర్చ... కుదరని ఏకాభిప్రాయం!
కేసీ వేణుగోపాల్ వద్ద జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ, సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పాల్గొన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి గురించి సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఎవరికి ఇవ్వాలనేదానిపై ఎక్కువగా చర్చ జరిగినట్లు సమాచారం. బీసీల్లో మహేశ్కుమార్గౌడ్, మధుయాస్కీ, సురేశ్ షెట్కార్, ఎస్టీల్లో బలరాం నాయక్, ఎస్సీల్లో సంపత్కుమార్తోపాటు కొత్తగా విప్ లక్ష్మణ్కుమార్ పేరు కూడా తెరపైకి వచ్చినట్లు సమాచారం. కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా ఒకరే ఉన్నందున, తెలంగాణలోనూ ఇదే తరహాలో ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే కేసీ వేణుగోపాల్ వద్ద జరిగిన సమావేశంలో భట్టి అంశాన్ని ఎవరూ మాట్లాడలేదని సమాచారం. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ అయినందున ఎంపీ బలరాంనాయక్కు పీసీసీ అధ్యక్షపదవి ఇవ్వాలనే అభిప్రాయం బలంగా ముందుకు వచ్చినట్లు తెలిసింది. బలరాంనాయక్కు పీసీసీ అధ్యక్షపదవి రాకపోతే డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ పేరును డిప్యూటీ స్పీకర్గా పరిశీలించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎస్సీల్లో మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ ఆశిస్తున్నా, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిద్దరూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వారే అవుతారు. ఈ కారణంగా విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ పేరు ముందుకొచ్చినట్లు సమాచారం. సమావేశంలో పాల్గొన్న నాయకులతో పాటు ఇతర ముఖ్యనాయకుల అభిప్రాయాలను కూడా అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. దీంతో పీసీసీపై తుది నిర్ణయం కొన్ని రోజులు వాయిదాపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుని విషయంలో ముఖ్యనాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది.
నాలుగో పేరుపైనే చర్చంతా!
మంత్రివర్గ విస్తరణలో ముగ్గురి పేర్లు దాదాపు ఖరారైనట్లేనని, నాలుగో పేరుపైనే చర్చ ఎక్కువగా ఉందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరేటప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకొంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయనతోపాటు జి.వివేక్కు కూడా హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వారిద్దరితో పాటు ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకొంటామని ముఖ్యమంత్రి బహిరంగంగానే ప్రకటించారు. ఈ ముగ్గురికి మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నాలుగోపేరుపైనే చర్చంతా నడుస్తోంది. నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి చోటు దక్కవచ్చని తెలుస్తోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తదితరులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ
గతంలో పరదాల సీఎంను మనం చూశామని.. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు -
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై లోకేశ్ ఘాటు స్పందన
జాతీయ పార్టీ నాయకుడైన మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. -
మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం: మాజీ మంత్రి బొత్స
ఇప్పటికీ తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అదే తమ పార్టీ విధానమన్నారు. -
ప్రజా సమస్యలపై తెదేపా టోల్ఫ్రీ నంబరు 73062 99999
ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. -
పుంగనూరులో ఉద్రిక్తత
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు పర్యటన నేపథ్యంలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
హస్తం గూటికి ఎమ్మెల్సీ సారయ్య!
వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన భారాస ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హస్తం గూటికి చేరడం దాదాపు ఖాయమైంది. ఆయనతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలిసింది. -
ఎ.కొండూరు ఎంపీపీ భర్తపై కేసు.. కేశినేని చిన్ని కారుపై రాళ్ల దాడి
విజయవాడ ప్రస్తుత తెదేపా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కారుపై పోలింగ్ రోజున రాళ్లతో దాడి చేశారన్న ఫిర్యాదుపై ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కంభంపాడుకు చెందిన ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త, వైకాపా మండల యువత అధ్యక్షుడు చెన్నారావు సహా పలువురిపై ఆదివారం కేసు నమోదైంది. ఆ వివరాలిలా ఉన్నాయి. -
విపక్ష నేత పదవి బలమైన ఆయుధం: రాహుల్
విపక్ష నేత పదవి అనేది భారతీయుల్లో ప్రతి ఒక్కరికీ బలమైన ప్రజాస్వామ్య ఆయుధమని, ఆ హోదాలో పార్లమెంటులో దేశ ప్రజల వాణిని తాను వినిపిస్తానని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చెప్పారు. -
సమాజ్వాదీ పార్టీకే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వండి
లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని సమాజ్వాదీ పార్టీ ఎంపీకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తృణమూల్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. -
కాంగ్రెస్, ఉద్ధవ్లతో కలిసే ఎన్నికలకు: శరద్పవార్
త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ), కాంగ్రెస్తో కలిసే బరిలోకి దిగుతామని ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్పవార్ స్పష్టం చేశారు. -
భారాస బాటలోనే కాంగ్రెస్
పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, నిధుల కేటాయింపు, సింగరేణి ప్రైవేటీకరణలాంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారాస బాటలోనే నడుస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. -
విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు కుట్రలు
రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. -
పల్లె దవాఖానా ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ జెండాలు
కుమురంభీం జిల్లాలో మంత్రి సీతక్క ఆదివారం విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రెబ్బెన మండలం నవేగాంలో నిర్మించిన పల్లె దవాఖానా ప్రారంభోత్సవ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి నిరసన వ్యక్తం చేశారు. -
కొత్త చట్టాలతో బాధితులకు అన్యాయం
మార్పు అంటే మంచి జరగాలని, కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉన్నాయని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. -
నిరుద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరపాలి
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, వారితో చర్చలు జరిపి న్యాయం చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. -
రాహుల్జీ.. ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించండి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తి కావచ్చినా.. ఇప్పటి వరకూ ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించలేదని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. -
దీదీ.. ఈ ఘోరం మీకు కనిపించలేదా?ఇదేనా మీ పాలన?
పశ్చిమబెంగాల్లో జరిగిన ఓ ఘటనపై ప్రతిపక్ష భాజపా, సీపీఎం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పాలన ఇలాగే ఉంటుందంటూ ఓ వీడియోను పోస్టు చేశాయి. -
కేరళ ఎయిమ్స్ తెచ్చిన చిచ్చు.. థరూర్, చంద్రశేఖర్ మధ్య మాటల యుద్ధం
కేరళలో ఎయిమ్స్ ఏర్పాటుపై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ అసెంబ్లీలో చేసిన ప్రకటన నేపథ్యంలో తిరువనంతపురం ఎంపీ శశథరూర్, తాజా ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ మధ్య ‘ఎక్స్’ వేదికగా మాటల యుద్ధం చోటు చేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా
-
కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురు
-
దిగొచ్చిన వాణిజ్య సిలిండర్ ధర.. రూ.32 తగ్గింపు
-
మొరాయించిన శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్.. నిలిచిన ఆన్లైన్ టికెట్ల జారీ
-
రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్
-
వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్