Revanth Reddy: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం శాయంపేటకు చేరుకున్న ఆయనకు జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్వాగతం పలికారు.

Published : 29 Jun 2024 14:20 IST

వరంగల్‌: సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం శాయంపేటకు చేరుకున్న ఆయనకు జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్వాగతం పలికారు. వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మాణ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. వనమహోత్సవంలో భాగంగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. హనుమకొండలో మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించనున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధిపై సమీక్షించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు