- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Chandrababu: నేను అందరివాడిని
ప్రతి ఒక్క కుటుంబం గురించి ఆలోచించి అందరికీ న్యాయం చేయడాన్ని బాధ్యతగా తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను అందరివాడినే తప్ప ఏ ఒక్కరివాణ్నీ కాదని స్పష్టం చేశారు.
పేదరికం లేని సమాజమే మా లక్ష్యం
65.31 లక్షల మందికి రూ.4,408 కోట్ల పంపిణీ
సంక్షేమంలో ఇది తొలి అడుగు మాత్రమే
పెనుమాక ప్రజావేదికలో సీఎం చంద్రబాబు
ప్రజా వేదికపై మాట్లాడుతున్న సీఎం చంద్రబాబునాయుడు.. పాల్గొన్న మంత్రులు లోకేశ్, కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు
ఈనాడు, అమరావతి: ప్రతి ఒక్క కుటుంబం గురించి ఆలోచించి అందరికీ న్యాయం చేయడాన్ని బాధ్యతగా తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను అందరివాడినే తప్ప ఏ ఒక్కరివాణ్నీ కాదని స్పష్టం చేశారు. శాశ్వతంగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడానికి పనిచేస్తానని ప్రకటించారు. ఇందుకోసం భగవంతుడు ఇచ్చిన శక్తినంతా ఉపయోగించి, ఊపిరి ఉన్నంత వరకు పోరాడతానని మాట ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీకాలనీలో సోమవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు చంద్రబాబు పింఛను సొమ్ము అందించారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘ప్రజలందరి ఆశీస్సులతో నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేశాను. కొత్త ప్రభుత్వంలో మొదటి నెల ఒకటో తేదీనే తొలి కార్యక్రమంగా.. పెంచిన పింఛను పంపిణీకి శ్రీకారం చుట్టడం నా పూర్వజన్మ సుకృతం. పేదరికం లేని సమాజం కోసం పెనుమాకలో ఈ రోజే సంకల్పం చేస్తున్నాను. మేమంతా కష్టపడి సంపద సృష్టించి, ఆదాయం పెంచుతాం. పెంచిన ఆదాయం మళ్లీ పేదవాళ్లకు అప్పజెప్పి, పేదరికం లేని సమాజం చూడాలన్నది మా ఆశయం. ప్రభుత్వం ఏర్పడిన 26 రోజుల్లో పెంచిన పింఛనుతో పాటు బకాయిలు అందజేశాం. ఇది మా చిత్తశుద్ధి. ఇది మొదటి అడుగు మాత్రమే. సంక్షేమం అంటే ఏదో డబ్బులు ఇచ్చేయడం, ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రజల జీవితాల్లో వెలుగు, వెసులుబాటు తీసుకువచ్చి జీవన ప్రమాణాలు పెంచాలి. పేదలు లేని, ఆర్థిక అసమానతలు కానరాని సమాజాన్ని సృష్టిస్తాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
పాల్గొన్న గ్రామస్థులు, వృద్ధులు, దివ్యాంగులు, పింఛనుదారులు
వైకాపా పాలన తవ్వేకొద్దీ తప్పులు, అప్పులు
‘పోలవరం పూర్తయితే ప్రతి ఎకరాకు నీరు వచ్చి సంపద సృష్టించేవాళ్లం. అమరావతి పూర్తయితే ఒక్కో కుటుంబం ప్రతి రోజూ కనీసం రూ.1000 సంపాదించుకునే అవకాశం వచ్చేది. అలాంటి అవకాశాన్ని గత ఐదేళ్లలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. వైకాపా పాలన తవ్వుతున్నకొద్దీ నాటి తప్పులు, అప్పులే బయటపడుతున్నాయి. ఒక వ్యక్తి సీఎంగా పనికిరాడని ఐదేళ్లు నిరూపించిన ఏకైన వ్యక్తి జగన్.’ అని పేర్కొన్నారు
చేస్తామన్నాం.. చేసి చూపించాం
‘ఎన్నికల సమయంలో వాలంటీర్లు వద్దని ఈసీ ఆదేశిస్తే గత ప్రభుత్వ పెద్దలు పింఛను కోసం వృద్ధులను పంచాయతీ కార్యాలయానికి తిప్పి 33 మంది మరణానికి కారకులయ్యారు. 1,20,097 మంది సచివాలయ సిబ్బంది ఒక్కొక్కరు 40-50 మందికి పింఛన్లు ఇస్తే సరిపోతుందని మేం చెప్పినా పట్టించుకోలేదు. పట్టుదలతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో రాష్ట్రంలో ఒకేరోజు అందరికీ పింఛన్లు ఇచ్చేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ రోజు చేయలేమని చెప్పిన అధికార యంత్రాంగం చేతే చేసి చూపించాం’ అని పేర్కొన్నారు.
పింఛనులో రూ.2,840 పెంచిన ఘనత
‘ఎన్టీఆర్ తొలిసారిగా పింఛను పంపిణీ ప్రారంభించారు. అప్పట్లో నెలకు రూ.35 ఇచ్చేవారు. 1994-95లో దాన్ని రూ.75కు పెంచాను. 2014లో రూ.200 ఉన్న పింఛను రూ.1000కి, తర్వాత రూ.2 వేలకు పెంచిన ఘనత తెదేపాదే. ఇప్పుడు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచాం. ప్రస్తుతం ఇస్తున్న పింఛనులో రూ.2840 నేనే పెంచానని చెప్పడానికి గర్వపడుతున్నా. రాష్ట్రంలో మొత్తం 28 రకాల పింఛన్లు 65.31 లక్షల మందికి ఒక్క రోజులో ఇస్తున్నాం. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేస్తే పెంచిన పింఛను వల్ల వెసులుబాటు వస్తుంది. వృద్ధులకు నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.48 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.72 వేలు అందిస్తాం. ఇది మూడెకరాల మాగాణి లేదా ఏడెకరాల మెట్ట పొలానికి వచ్చే కౌలుకు సమానమైన ఆదాయం’ అని చంద్రబాబు చెప్పారు.‘మమ్మల్ని నమ్మి గెలిపించిన ప్రజలకు సేవకులుగానే ఉంటాం. పెత్తందారులుగా ఉండమని హామీ ఇస్తున్నాం’ అని చెప్పారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో లోకేశ్ ఓడినా పట్టువదలకుండా ఇక్కడే కష్టపడి, మీ అందరి అభిమానంతో ఇప్పుడు 92 వేల మెజారిటీతో గెలిచారన్నారు. కార్యక్రమంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.
పరదాలు లేవు.. హడావుడి లేదు
ముఖ్యమంత్రి వస్తున్నారంటే రెండు రోజుల ముందు నుంచి హడావుడి.. దారి పొడవునా పరదాలు.. కిలోమీటర్ల మేర బారికేడ్లు.. సీఎం ప్రయాణించే మార్గాలు, సభ పరిసరాల్లో చెట్ల నరికివేత.. దుకాణాల మూసివేత.. వందల మంది పోలీసుల పహారా.. ట్రాఫిక్ మళ్లింపు.. ఇది జగన్ పాలనలో నిత్యకృత్యం. ఇందుకు భిన్నంగా సోమవారం పెనుమాకలో సీఎం చంద్రబాబు పర్యటన అత్యంత సాదాసీదాగా కొనసాగింది. ఉదయాన్నే ముఖ్యమంత్రి వీధుల్లో నడుచుకుంటూ అందరినీ పలకరిస్తూ పింఛను లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లారు. స్థానిక మహిళలు ఆయనకు హారతులిచ్చి, స్వాగతం పలికారు. ఎక్కడా పోలీసుల అనవసర హడావుడి లేదు. ముఖ్యమంత్రి స్థాయి ప్రముఖుల సభలకు ఉండే డి-సర్కిల్ను సైతం ఎత్తివేసి, పెనుమాకలో సాదాసీదాగా వేదిక ఏర్పాటు చేశారు. వేదికపై ప్రత్యేక కుర్చీలు లేకుండా స్థానికులతో కలిసి చంద్రబాబు కూర్చున్నారు. ప్రసంగం తర్వాత ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 4న (గురువారం) నెల్లూరుకు వెళ్లనున్నారు. అక్కడి కేంద్ర కారాగారంలో ఉన్న మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవనున్నారు. -
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం దిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి 7.25 గంటలకు దిల్లీ చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. -
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్
కేసీఆర్తో భారాసకు చెందిన జడ్పీ ఛైర్పర్సన్లఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ భారాసకే ప్రజలు పట్టం కడతారని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కొంచెం ఓపిక పట్టాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
బాధితులకు సత్వర న్యాయం పేరుతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రదర్శించిన అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారి తీసింది. -
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
కాకినాడ నగరపాలకసంస్థ పరిధిలో వైకాపా నాయకుడికి చెందిన అక్రమ కట్టడం కూల్చివేతను మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన అనుచరులతో కలసి అడ్డుకున్నారు. -
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి
వైకాపా ప్రభుత్వ అనారోగ్య ఆర్థిక విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని తెదేపా పార్లమెంటరీ పార్టీ ఉపనాయకురాలు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆరోపించారు. -
వైకాపా నాయకులు కబళించిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి
గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు, ఇతరులు అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని, కబళించిన భూముల్ని రెవెన్యూ రికవరీ చట్టం లేదా ఇతర చట్టాల్ని ప్రయోగించి స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ ఆర్థిక మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచించారు. -
పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ: తెదేపా నేత కేఎస్ జవహర్
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేసి సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెదేపా సీనియర్ నేత కేఎస్ జవహర్ కొనియాడారు. -
సంక్షిప్త వార్తలు (5)
పదేళ్లు అధికారంలో ఉండి జాబ్ క్యాలెండర్ ఎందుకివ్వలేదని భారాస నాయకులను కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. నిరుద్యోగులు సమయం వృథా చేసుకోకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. -
రాహుల్ది పిల్లచేష్ట
లోక్సభ విపక్ష నేత రాహుల్గాంధీది పిల్లచేష్ట (బాలక్ బుద్ధి) అని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. వరసగా మూడు లోక్సభ ఎన్నికల్లో వంద సీట్లను దాటకపోవడం కాంగ్రెస్కు ఇదే తొలిసారి అని చెప్పారు. -
రుణమాఫీ పేరుతో రైతులను వంచించిన కేసీఆర్
రుణమాఫీ పేరుతో రైతులను వంచించిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. 2018 ఎన్నికల సమయంలో భారాస మ్యానిఫెస్టోలో మాఫీ హామీ ఇచ్చి 2023 ఎన్నికల ముందుదాకా కేసీఆర్ మొద్దు నిద్ర పోయారని ఆయన మీడియాకు తెలిపారు. -
పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం
కాంగ్రెస్ ప్రభుత్వ ఏడు నెలల పాలనలో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసిందని, వేతనాలు లేక పారిశుద్ధ్య కార్మికులు అల్లాడుతున్నారని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు ధ్వజమెత్తారు. -
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థుల నామినేషన్లు
ఎమ్మెల్యేల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో భాగంగా కూటమి అభ్యర్థులు సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ మంగళవారం నామినేషన్లు సమర్పించారు. -
వైఎస్ జయంతి వేడుకలకు సోనియా, రాహుల్గాంధీ
విజయవాడలో ఈ నెల 8న నిర్వహించే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సోనియాగాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర ఏఐసీసీ పెద్దలు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నాయకులు హాజరవుతున్నట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. -
హనుమకొండ భారాస కార్యాలయానికి నోటీసులు
హనుమకొండ బాలసముద్రంలో ఉన్న భారాస కార్యాలయానికి వరంగల్ మహానగర పాలక సంస్థ నోటీసులు జారీచేసింది. పార్టీ కార్యాలయానికి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారని... -
తెలంగాణ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి
తెలంగాణ చరిత్ర, ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే సమగ్ర సమాచారాన్ని గత ప్రభుత్వం రూపొందించిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రాహుల్లా ప్రవర్తించకండి
లోక్సభలో స్పీకర్ స్థానాన్ని అవమానించేలా ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ మాట్లాడి అమర్యాదకరంగా ప్రవర్తించారని, ఎన్డీయే సభ్యులెవరూ అలా చేయవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. -
యూపీలో మాకు 80 సీట్లు వచ్చినా.. ఈవీఎంలను విశ్వసించం
పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చలో విపక్ష నేతలు మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. -
ఖర్గే స్థానంలో జైరాం ఉంటే బాగుండేది
-
నా వ్యాఖ్యల తొలగింపు అప్రజాస్వామికం
రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం లోక్సభలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను తొలగించడాన్ని నిరసిస్తూ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం లేఖ రాశారు. -
మీ సర్కారుకు ప్రజలు అదే చెప్పారు
లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లు ప్రధాని నరేంద్రమోదీ చెప్పుకోవడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ
-
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్
-
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్
-
మరోసారి కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
-
ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్
-
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం