- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
PM Modi: రాహుల్ది పిల్లచేష్ట
లోక్సభ విపక్ష నేత రాహుల్గాంధీది పిల్లచేష్ట (బాలక్ బుద్ధి) అని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. వరసగా మూడు లోక్సభ ఎన్నికల్లో వంద సీట్లను దాటకపోవడం కాంగ్రెస్కు ఇదే తొలిసారి అని చెప్పారు.
సానుభూతి కోసం కొత్త నాటకాలు
అంబేడ్కర్నే ఓడించిన చరిత్ర కాంగ్రెస్ది
రాజ్యాంగం గురించి ఆ పార్టీవారా మాట్లాడేది?
హిందువులు హింసావాదులని అనడం సంస్కారమా?
లోక్సభలో తూర్పారబట్టిన ప్రధాని మోదీ
ఈనాడు, దిల్లీ: లోక్సభ విపక్ష నేత రాహుల్గాంధీది పిల్లచేష్ట (బాలక్ బుద్ధి) అని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. వరసగా మూడు లోక్సభ ఎన్నికల్లో వంద సీట్లను దాటకపోవడం కాంగ్రెస్కు ఇదే తొలిసారి అని చెప్పారు. కేవలం సానుభూతి పొందడం కోసం సభలో కాంగ్రెస్ కొత్త నాటకాలు ఆడుతోందని విరుచుకుపడ్డారు. పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండ్రోజులు కొనసాగిన చర్చకు మంగళవారం సాయంత్రం లోక్సభలో ఆయన సమాధానమిచ్చారు. విపక్షాల నిరసనల మధ్య ఆయన ప్రసంగం 135 నిమిషాలు కొనసాగింది. ‘‘దేశంలో ఆర్థిక అరాచకత్వం సృష్టించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఓటమిని అంగీకరించకుండా అహంకారంతో ప్రవర్తిస్తోంది. వంద సీట్లు కూడా తెచ్చుకోకపోయినా వారే మామీద గెలిచేసినట్లు చూపించుకోవాలని అనుకుంటోంది. ఓబీసీలను దొంగలుగా సంబోధించినందుకు వారికి శిక్ష పడింది. దేశ అత్యున్నత న్యాయస్థానంపై బాధ్యతారాహిత్య వ్యాఖ్యలకు వారు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. కనీస మద్దతు ధరలు, అగ్నిపథ్లపై పార్లమెంటును తప్పుదోవ పట్టించాలని చూశారు. సందర్భానికి తగ్గట్లు స్వరం మార్చే అలాంటి నేత (రాహుల్ గాంధీని ఉద్దేశించి) ఇలాంటి అరాచకమైన మార్గాన్ని ఎంచుకోవడం.. దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయడమే’’ అని మోదీ చెప్పారు.
స్పీకర్ అన్నింటినీ చిరునవ్వుతో భరిస్తారు
‘‘స్పీకర్ జీ! మీరు అన్నింటినీ చిరునవ్వుతో భరిస్తున్నారు. కానీ సోమవారం ఇక్కడ జరిగిన దానిపై ఏదోఒకటి చేయకపోతే పార్లమెంటుకు మంచిదికాదు. ఇలాంటి ప్రయత్నాలను పిల్లచేష్టలుగా వదిలేయకూడదు. దానివెనుక లోతైన కుట్ర ఉంది. ప్రజల తీర్పును విపక్షాలు నిజాయతీగా అర్థంచేసుకోవాలి. కల్పిత విజయాలతో సంబరాలు చేసుకోకూడదు. ఎన్ని అబద్ధాలు చెప్పినా ఓటమి చవిచూడాల్సివచ్చినందుకు కొందరు పడుతున్న బాధను నేను అర్థం చేసుకోగలను. వారు ఓటమిని అంగీకరించి ఆత్మవిమర్శ చేసుకునే బదులు శీర్షాసనం వేయడంలో తలమునకలై ఉన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలపట్ల నెహ్రూ ప్రభుత్వ చిన్నచూపును సహించలేక రాజీనామా చేసి, మంత్రివర్గం నుంచి బయటికి వచ్చిన అంబేడ్కర్ను పట్టుబట్టి ఓడించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రాజ్యాంగం, రిజర్వేషన్ల రక్షణ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతున్న హిందూ మతంపై హింసావాదులుగా ముద్ర వేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
కాంగ్రెస్వి కుటిల ప్రయత్నాలు
ఈ ఎన్నికల్లో తాము భాజపాను ఓడించామనే భావనను ప్రజల మనసుల్లో నాటే కుటిల ప్రయత్నాలను కాంగ్రెస్ మొదలుపెట్టింది. ఇలా ఎందుకు చేస్తోందనడానికి ఓ ఉదాహరణ చెబుతాను. ఒక పిల్లవాడు సైకిల్ తొక్కడం మొదలుపెట్టిన తర్వాత కిందపడిపోయాడు. ఏడుస్తున్న పిల్లాడిని సముదాయించడానికి ఓ పెద్దమనిషి- ‘నువ్వు సైకిల్ బాగా తొక్కావు, కానీ చీమ అడ్డువచ్చి పడిపోయావు’ అని సాంత్వన చేకూర్చేలా మాట్లాడినట్లుగానే కాంగ్రెస్ నాయకులు ప్రచారం మొదలుపెట్టారు.
విద్వేషాలతో ప్రయోజనం పొందే ప్రయత్నం
కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య విద్వేషాలు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేసింది. దక్షిణాదికి వెళ్లి ఉత్తర భారతీయులకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఉత్తరాదికి వెళ్లి పశ్చిమభాగం వారిపై విషం చిమ్మింది. ఒక పిల్లాడు స్కూల్నుంచి వచ్చి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఏమైందోనని అమ్మ భయపడింది. స్కూల్లో తనను కొట్టారని చెప్పాడు. స్కూల్లో ఆ పిల్లాడే మిగతా పిల్లలను దూషించడం, పక్కనున్నవారి పుస్తకాలు చింపేయడం, టీచర్ను దొంగ అని తిట్టడం, పక్కవారి టిఫిన్ చోరీచేసి తినడం వంటివి చెప్పలేదు. ఈ సభలో ఇలాగే నిన్న బాలబుద్ధి విలాపం చూశాం. నన్ను వీళ్లుకొట్టారు... వాళ్లు కొట్టారన్న ఏడుపులే వినిపించాయి. దేశానికి వాస్తవం తెలుసు. బాలబుద్ధి మాటతీరు, వ్యవహారశైలి బాగాలేదు. సభలో ఉన్నట్టుండి ఎవరివద్దకో వెళ్లి కౌగిలించుకుంటారు... లేదంటే సభలో కూర్చొని కన్ను కొడతారు. అబద్ధాలు చెప్పడాన్ని కాంగ్రెస్ రాజకీయ ఆయుధంగా మార్చుకొంది. కాంగ్రెస్ నోటికి అబద్ధాల రక్తం అంటుకుంది. 60 ఏళ్లు అధికార పీఠంలో కూర్చున్న పార్టీకి అనుభవజ్ఞులైన నాయకులున్నా అరాచక, అబద్ధాల రహదారిపై వెళ్లాలనుకోవడం అత్యంత ఆందోళనకరం.
రాజ్యాంగం, రిజర్వేషన్లపై నిరంతరం అబద్ధాలు
అత్యవసర పరిస్థితి విధించి ఇప్పటికి 50 ఏళ్లయింది. కేవలం అధికారం నిలబెట్టుకోవడం కోసం నియంతృత్వ మనస్తత్వంతో దాన్ని దేశంపై రుద్దింది కాంగ్రెసే. రాజ్యాంగానికి విరుద్ధంగా చేయాల్సిన పనులన్నీ ఆ పార్టీ చేసింది. మొదటి నుంచీ దళితులు, బీసీలకు ఘోర అన్యాయం చేసింది. ఆ వ్యతిరేకత కారణంగా నెహ్రూ క్యాబినెట్ నుంచి అంబేడ్కర్ రాజీనామా చేసి వారి నిజస్వరూపం బయటపెట్టారు. నెహ్రూ పట్టుబట్టి ఎన్నికల్లో ఆయన్ని ఓడించారు. ఎమర్జెన్సీ తర్వాత జగ్జీవన్రామ్ ప్రధాని కావాల్సి ఉన్నా అలా ఎట్టిపరిస్థితుల్లోనూ జరగకూడదని ఇందిరాగాంధీ నిర్ణయించారు. ఒకవేళ ఆయన ప్రధానమంత్రి అయితే జీవితాంతం తప్పుకోరని ఇందిరాగాంధీ చెప్పినట్లు ఓ పుస్తకంలో ఉంది. బిహార్ నేత సీతారాం కేసరిని అవమానించిన పాపం కూడా కాంగ్రెస్కే దక్కుతుంది. ప్రారంభం నుంచి రిజర్వేషన్లకు తీవ్ర వ్యతిరేకంగా ఆ పార్టీ పనిచేసింది.
రాహుల్ ప్రసంగాన్ని వందేళ్ల తర్వాతా క్షమించరు
సోమవారం సభలో జరిగిన దాన్ని ఈ దేశ ప్రజలు వందేళ్ల తర్వాతా క్షమించబోరు. 131 ఏళ్లకుముందు స్వామి వివేకానంద షికాగోలో హిందూమతం గొప్పతనం గురించి ప్రపంచ దిగ్గజాల ముందు ఘనంగా చెప్పారు. హిందువులు సహనశీలురు కాబట్టే ఈ దేశంలో ప్రజాస్వామ్యం, వైవిధ్యం పరిఢవిల్లుతోంది. కానీ ఈరోజు హిందువులపై తప్పుడు ఆరోపణలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందువులు హింసావాదులు అనడం సంస్కారమా? ఇలాంటి ఆరోపణలు చేస్తారా? హిందూమతం, దేశ సంస్కృతి, వారసత్వాన్ని నీచంగా చూపి అవమానించడం, హిందువులను ఎగతాళి చేయడం ఫ్యాషన్గా మారిపోయింది. రాజకీయ స్వార్థం కోసం ఇవన్నీ చేస్తున్నారు.. యువత భవిష్యత్తుతో ఆడుకొనేవారిని వదిలిపెట్టం. నీట్ విషయంలో దేశవ్యాప్తంగా అరెస్టులు జరుగుతున్నాయి. పరీక్ష వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నాం’’ అని ప్రధాని చెప్పారు.
100కి 99కాదు, 543కి 99
99 మార్కులు వచ్చినట్లు ఒక బాలుడు అహంకారంతో తిరుగుతూ నాకు ఎన్నిమార్కులు వచ్చాయో చూడమని దేశానికంతా చెబుతున్నాడు. 99ని చూసినవారు మెచ్చుకుంటున్న సమయంలో టీచర్ వచ్చి అతనికి వచ్చింది 100కి 99కాదు, 543కి 99అని చెప్పింది. కానీ అది ఆ బాలబుద్ధికి అర్థంకాలేదు. పరాజయం పొందడంలో అతను ఇప్పటికే ప్రపంచరికార్డు సృష్టించారు. మూడోసారి ఓడిపోయినా నైతిక విజయమంటూ భుజాలు చరుచుకుంటున్నారు. 13 రాష్ట్రాల్లో జీరో సీట్లు వచ్చినా తానే హీరో అంటున్నారు.మిత్రపక్షాల ఓటు రాకపోతే కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ఇన్ని సీట్లు గెలవడం కూడా కష్టమే.
రాహుల్ను ఉద్దేశించి మోదీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేషన్ వాహనాలతో రూ. 1,500 కోట్ల నష్టం
రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాల నిర్వాహకులేనని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. -
‘అంతా మీరే చేశారు’.. కాదు మీ వల్లే జిల్లాలో పార్టీ నాశనమైంది
‘అంతా మీరే చేశారు’ ఇది ఒక సినిమాలోని పాపులర్ డైలాగు. ఇప్పుడదే డైలాగును వైకాపాలో తాజా మాజీలు ఒకరిపై ఒకరు గట్టిగానే ప్రయోగించుకున్నారు. -
భారాసకు భారీ షాక్
భారాసకు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా హడావుడి లేకుండా, ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా గుంభనంగా సాగిపోయింది. -
పిన్నెల్లి మంచోడు...
‘పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు.. కాబట్టే 2009 నుంచి 2019 వరకు నాలుగుసార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజలు ఆయన్ను దీవించారు. -
ప్రజాతీర్పునకు వక్రభాష్యాలా..?
ఎన్నికల్లో ఘోర పరాజయం పొందినా.. జగన్లో మార్పు రాలేదు. ప్రజాతీర్పును గౌరవించేందుకు ఆయన ఇంకా సిద్ధపడలేదు. ఓటమిని అంగీకరించక, రోజుకో మాట చెబుతూనే ఉన్నారు. -
ఈవీఎం ధ్వంసం, సీఐపై హత్యాయత్నం నేరాలు కావా?
పోలింగ్ రోజు, అనంతరం మాచర్ల నియోజకవర్గంలో భారీ విధ్వంసం సృష్టించి, ఈవీఎంలను ధ్వంసం చేసి, అడ్డుకోబోయిన సీఐపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని అరెస్టు చేయకూడదా అని వైకాపా అధినేత జగన్ను తెదేపా నేతలు ప్రశ్నించారు. -
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి సహా 26 మందిపై కేసు
కాకినాడలో వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదైంది. ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుతో పాటు మరో 24 మందిపైనా కాకినాడ రెండో పట్టణ పోలీసుస్టేషన్లో గురువారం కేసు నమోదుచేశారు. -
ముగ్గురాయి గనుల్లో అక్రమాలు.. ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల నష్టం
మంగంపేట ముగ్గురాయి గనుల్లో 2019 నుంచి 2024 వరకు జరిగిన అవకతవకల వల్ల ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ఆరోపించారు. -
ప్రజాతీర్పు శిరోధార్యం
ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయమని, వారి తీర్పే శిరోధార్యమని, వారు ఎటువంటి పాత్రను అప్పగిస్తే దానిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. -
రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో రాహుల్ విఫలం: కేటీఆర్
రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడే రాహుల్ గాంధీ దాని స్ఫూర్తిని కాపాడడంలో విఫలమయ్యారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా
భారాసను వీడి కాంగ్రెస్లో చేరిన కె.కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయన రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను కలిసి రాజీనామా లేఖ సమర్పించారు. -
సంక్షిప్త వార్తలు (5)
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబునాయుడు ఈ నెల 6న భేటీ కావడం హర్షణీయమని మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి అన్నారు. -
ఫోన్ట్యాపింగ్తో సంబంధం లేదు: ఎమ్మెల్సీ నవీన్కుమార్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని భారాస ఎమ్మెల్సీ కె.నవీన్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించేందుకు ఎవరు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. -
10న తెలంగాణకు కాంగ్రెస్ కురియన్ కమిటీ
లోక్సభ ఎన్నికల్లో ఆశించిన మేరకు లక్ష్యాలు సాధించకపోవడానికి కారణాలపై అధ్యయనం చేయడానికి ఏఐసీసీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఈ నెల 10న తెలంగాణకు రానుంది. -
ఆడిన మాట తప్పని రాజస్థాన్ మంత్రి కిరోడిలాల్
భాజపా సీనియర్ నేత, రాజస్థాన్ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి కిరోడి లాల్ మీనా (72) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఆమోదించలేదు. -
అన్నీ గవర్నర్ చేతుల్లో ఉండవు
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో స్పీకర్ బిమన్ బెనర్జీ శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
దిల్లీ, హరియాణాల్లో ఆప్తో పొత్తు లేనట్లే
త్వరలో శాసనసభ ఎన్నికలు జరగబోయే దిల్లీ, హరియాణాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో కలిసి పోటీచేసే అవకాశం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయితే మహారాష్ట్రలో శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)లతో; -
మళ్లీ సీఎంగా హేమంత్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. -
పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతన్న సంక్షేమంపై లేదు
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విభజన సమస్యలు పరిష్కరించుకోవాలి
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. -
పోలవరం ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని సీపీఎం స్వాగతించింది. ఈనెల 6వ తేదీన హైదరాబాద్లో జరిగే ఈ భేటీలో రాష్ట్ర విభజన సందర్భంగా అపరిష్కృత సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీఎం రేవంత్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు.