- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Chandrababu: ప్రజల ఐదేళ్ల కష్టానికి నేటితో విముక్తి
రాష్ట్ర ప్రజల ఐదేళ్ల కష్టానికి నేటితో తెర పడనుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఓటమి భయంతో కౌంటింగ్ మధ్యలోనే వైకాపా ఏజెంట్లు పారిపోతారని ఎద్దేవా చేశారు.
కౌంటింగ్లో వైకాపావారు గొడవలకు దిగొచ్చు
ఎలాంటి సమస్యలొచ్చినా ‘వార్రూమ్’కు సమాచారమివ్వండి
నేను అక్కడి నుంచే పర్యవేక్షిస్తా
అభ్యర్థులు, ఏజెంట్లకు చంద్రబాబు దిశానిర్దేశం
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర ప్రజల ఐదేళ్ల కష్టానికి నేటితో తెర పడనుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఓటమి భయంతో కౌంటింగ్ మధ్యలోనే వైకాపా ఏజెంట్లు పారిపోతారని ఎద్దేవా చేశారు. పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే దాకా కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని.. డిక్లరేషన్ ఫాం తీసుకున్నాకే బయటకు రావాలని పార్టీ అభ్యర్థులకు సూచించారు. అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు సోమవారం రాత్రికే కౌంటింగ్ జరిగే ప్రాంతాలకు చేరుకోవాలని.. మంగళవారం ఉదయం 6:30 గంటల కల్లా కేంద్రాలకు వెళ్లాలని చెప్పారు. ఎవరైనా అనారోగ్యం, వ్యక్తిగత కారణాలతో వెళ్లలేకపోతే నిబంధనల మేరకు కౌంటింగ్కు ముందు వేరొకర్ని నియమించుకోవచ్చని గుర్తుచేశారు. కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్రూమ్ను సోమవారం ఆయన పరిశీలించారు. పలువురు నేతలకు వివిధ బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు టెలికాన్ఫరెన్స్లో ఎన్డీయే ఏజెంట్లతో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు వచ్చినా.. వార్రూమ్కు సమాచారమివ్వాలన్నారు. తానూ అక్కడి నుంచే కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తానని అభ్యర్థులకు చెప్పారు. ‘కౌంటింగ్ కేంద్రంలో వైకాపా వాళ్లు ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగే అవకాశం ఉంది. వీటిపై ఆర్వోకు ఫిర్యాదు చేయండి. స్ట్రాంగ్ రూం నుంచి ఈవీఎంలను తీసుకొచ్చే సమయంలో ప్రధాన సీళ్లు సరిగా ఉన్నాయో.. లేదో చూసుకోవాలి. అనుమానం ఉంటే రీకౌంటింగ్కు డిమాండ్ చేయ్యాలి. ఏ ఫిర్యాదునైనా లిఖితపూర్వకంగా చేసి, ఎక్నాలెడ్జ్మెంట్ను తప్పనిసరిగా తీసుకోండి’ అని చంద్రబాబు సూచించారు.
సుప్రీంకోర్టులోనూ మొట్టికాయలు తప్పలేదు
పోస్టల్ బ్యాలట్ ఓట్లపై రాద్ధాంతం చేయాలనుకున్న వైకాపాకు సుప్రీంకోర్టులోనూ మొట్టికాయలు తప్పలేదని చంద్రబాబు పేర్కొన్నారు. ‘వైకాపా వారు అల్లర్లకు పాల్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. కానీ ఎక్కడా సంయమనం కోల్పోవద్దు. నిబంధనల మేరకు ప్రక్రియ జరిగేలా పట్టుబట్టాలి. 17-సీ ఫాంను దగ్గర పెట్టుకొని పోలైన ఓట్లను.. కౌంటింగ్లో వచ్చిన ఓట్లను సరిచూసుకోవాలి’ అని ఎన్డీయే ఏజెంట్లకు సూచించారు.
ఈ ఎన్నికల్లో తన పర్యటనల్ని సమన్వయం చేసిన బృందాన్ని ఉండవల్లి నివాసంలో చంద్రబాబు అభినందించారు. ప్రచారంలో భాగంగా రోజుకు మూడు నుంచి ఐదు కార్యక్రమాల్లో పాల్గొనేలా పకడ్బందీగా షెడ్యూల్ రూపొందించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేశారని కొనియాడారు.
సైకిల్ సమాజానికి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది
తెదేపా అధినేత చంద్రబాబు
అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు ‘ఎక్స్’లో స్పందించారు. సమాజానికి, వ్యక్తుల ఆరోగ్యానికి సైకిల్ మేలు చేస్తుందన్నారు. అది తొక్కడం మంచి వ్యాయామం అని పేర్కొంటూ.. తాను సైకిల్ తొక్కుతున్న ఫొటోను పోస్టు చేశారు.
శ్రేణులకు చంద్రబాబు అభినందన
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శ్రేణుల సందడి
ఈనాడు డిజిటల్, అమరావతి : తెదేపా అధినేత చంద్రబాబు సోమవారం రాత్రి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పోలింగ్ ముగిశాక తొలిసారిగా ఆయన పార్టీ కార్యాలయానికి రావడంతో నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ‘సీఎం బాబు..సీఎం బాబు’... అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పుష్పగుచ్ఛాలు అందజేశారు. శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను చంద్రబాబు అభినందించారు. సంబరాలు రేపు చేసుకుందామని, శక్తి ఇప్పుడే ఖర్చు చేసుకోవద్దని చమత్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: భానుప్రకాశ్ రెడ్డి
ప్రపంచ హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను గత ప్రభుత్వం అధర్మ క్షేత్రంగా మార్చిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. -
టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస విద్యార్థి నేతల ఆందోళన.. పలువురి అరెస్టు
టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస అనుబంధ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. రహదారిపై బైఠాయించి అనుబంధ విద్యార్థి సంఘం నేతలు నిరసన తెలిపారు. -
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) దిల్లీ పర్యటన కొనసాగుతోంది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన భేటీ అయ్యారు. -
ఆడిన మాట తప్పని రాజస్థాన్ మంత్రి కిరోడిలాల్
భాజపా సీనియర్ నేత, రాజస్థాన్ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి కిరోడి లాల్ మీనా (72) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఆమోదించలేదు. -
కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు
కాకినాడలో వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదైంది. ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుతో పాటు మరో 24 మందిపైనా కాకినాడ రెండో పట్టణ పోలీసుస్టేషన్లో గురువారం కేసు నమోదుచేశారు. -
రేషన్ వాహనాలతో రూ. 1,500 కోట్ల నష్టం: మంత్రి నాదెండ్ల మనోహర్
రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాల నిర్వాహకులేనని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. -
‘ఆమెను రాజమాత అని మీరెందుకు తిట్టారు? అక్కడి నుంచే పార్టీ నాశనం’
‘అంతా మీరే చేశారు’ ఇది ఒక సినిమాలోని పాపులర్ డైలాగు. ఇప్పుడదే డైలాగును వైకాపాలో తాజా మాజీలు ఒకరిపై ఒకరు గట్టిగానే ప్రయోగించుకున్నారు. -
భారాసకు భారీ షాక్
భారాసకు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా హడావుడి లేకుండా, ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా గుంభనంగా సాగిపోయింది. -
పిన్నెల్లి మంచోడు...
‘పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు.. కాబట్టే 2009 నుంచి 2019 వరకు నాలుగుసార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజలు ఆయన్ను దీవించారు. -
ప్రజాతీర్పునకు వక్రభాష్యాలా..?
ఎన్నికల్లో ఘోర పరాజయం పొందినా.. జగన్లో మార్పు రాలేదు. ప్రజాతీర్పును గౌరవించేందుకు ఆయన ఇంకా సిద్ధపడలేదు. ఓటమిని అంగీకరించక, రోజుకో మాట చెబుతూనే ఉన్నారు. -
ఈవీఎం ధ్వంసం, సీఐపై హత్యాయత్నం నేరాలు కావా?
పోలింగ్ రోజు, అనంతరం మాచర్ల నియోజకవర్గంలో భారీ విధ్వంసం సృష్టించి, ఈవీఎంలను ధ్వంసం చేసి, అడ్డుకోబోయిన సీఐపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని అరెస్టు చేయకూడదా అని వైకాపా అధినేత జగన్ను తెదేపా నేతలు ప్రశ్నించారు. -
ముగ్గురాయి గనుల్లో అక్రమాలు.. ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల నష్టం
మంగంపేట ముగ్గురాయి గనుల్లో 2019 నుంచి 2024 వరకు జరిగిన అవకతవకల వల్ల ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ఆరోపించారు. -
ప్రజాతీర్పు శిరోధార్యం
ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయమని, వారి తీర్పే శిరోధార్యమని, వారు ఎటువంటి పాత్రను అప్పగిస్తే దానిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. -
రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో రాహుల్ విఫలం: కేటీఆర్
రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడే రాహుల్ గాంధీ దాని స్ఫూర్తిని కాపాడడంలో విఫలమయ్యారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా
భారాసను వీడి కాంగ్రెస్లో చేరిన కె.కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయన రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను కలిసి రాజీనామా లేఖ సమర్పించారు. -
సంక్షిప్త వార్తలు (5)
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబునాయుడు ఈ నెల 6న భేటీ కావడం హర్షణీయమని మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి అన్నారు. -
ఫోన్ట్యాపింగ్తో సంబంధం లేదు: ఎమ్మెల్సీ నవీన్కుమార్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని భారాస ఎమ్మెల్సీ కె.నవీన్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించేందుకు ఎవరు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. -
10న తెలంగాణకు కాంగ్రెస్ కురియన్ కమిటీ
లోక్సభ ఎన్నికల్లో ఆశించిన మేరకు లక్ష్యాలు సాధించకపోవడానికి కారణాలపై అధ్యయనం చేయడానికి ఏఐసీసీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఈ నెల 10న తెలంగాణకు రానుంది. -
అన్నీ గవర్నర్ చేతుల్లో ఉండవు
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో స్పీకర్ బిమన్ బెనర్జీ శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
దిల్లీ, హరియాణాల్లో ఆప్తో పొత్తు లేనట్లే
త్వరలో శాసనసభ ఎన్నికలు జరగబోయే దిల్లీ, హరియాణాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో కలిసి పోటీచేసే అవకాశం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయితే మహారాష్ట్రలో శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)లతో; -
మళ్లీ సీఎంగా హేమంత్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణం చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నిద్ర సరిపోవట్లేదు.. రాత్రి 8 తర్వాత రాలేను: బైడెన్
-
శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: భానుప్రకాశ్ రెడ్డి
-
ఎయిర్పోర్టులో గ్యాస్ లీక్.. 39 మందికి అస్వస్థత
-
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
-
నేనిప్పుడే మొదలుపెట్టా.. రిటైర్మెంట్పై బుమ్రా స్పందన ఇదే..
-
‘అదానీ’పై హిండెన్బర్గ్ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!