- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు నమోదు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై.. కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 221, 126(2) కింద కరీంనగర్ ఒకటో ఠాణాలో కేసు నమోదైంది.
కరీంనగర్ నేరవార్తలు, న్యూస్టుడే: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై.. కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 221, 126(2) కింద కరీంనగర్ ఒకటో ఠాణాలో కేసు నమోదైంది. మంగళవారం కరీంనగర్ జడ్పీ సమావేశంలో తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదంటూ భారాస ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి పోడియం వద్ద కూర్చొని ప్లకార్డులతో నిరసన తెలిపారు. అక్కడి నుంచి కలెక్టర్ పమేలా సత్పతి వెళ్లే క్రమంలో ఆమెను అడ్డగించారు. దీంతో సమావేశానికి ఆటంకం కలిగించడంతోపాటు, కలెక్టర్ వెళ్లకుండా అడ్డుకున్నారంటూ జడ్పీ కార్యాలయ పర్యవేక్షణ అధికారి ఎం.శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ 221, 126(2) కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ ఒకటో ఠాణా సీఐ సరిలాల్ పేర్కొన్నారు.
సీపీకి కౌశిక్రెడ్డి వినతిపత్రం..: తనపై నమోదైన కేసును తొలగించి విచారణ జరిపించాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి కౌశిక్రెడ్డి కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం కౌశిక్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని మండల విద్యాధికారులతో సమావేశం నిర్వహిస్తే హాజరైన అధికారులకు జిల్లా విద్యాధికారి మెమో జారీచేసిన విషయంపై జడ్పీ సమావేశంలో ప్రశ్నించినందుకు పోలీసు కేసు పెట్టించారని.. దీనిపై అసెంబ్లీ స్పీకర్ను కలిసి జడ్పీ సీఈవో, జిల్లా విద్యాధికారులపై సభాహక్కుల తీర్మానం ప్రవేశపెడతామన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తానన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుకు హైదరాబాద్లో ఘనస్వాగతం
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హైదరాబాద్లో ఘనస్వాగతం లభించింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శుక్రవారం ఆయన తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. -
ఓటమిపై కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు
మాజీ సీఎం, భారాస అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల్లో ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
భారాస అధికారిక సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు. -
కేశవరావు రాజీనామాకు ఆమోదం
రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు చేసిన రాజీనామాను ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ శుక్రవారం ఆమోదించారు. -
తెలంగాణ దాటితే కేసీఆర్ను ఎవరూ గుర్తుపట్టరు
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్లో కూర్చొని ఆ పార్టీ శ్రేణులకు పేదరాసి పెద్దమ్మ కథలు చెప్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. -
ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన స్పీకర్
ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించే విషయమై దాదాపు నెల రోజులుగా పశ్చిమబెంగాల్ రాజ్భవన్, ఆ రాష్ట్ర శాసనసభ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయిందని భావిస్తున్న తరుణంలో మరో వివాదం తలెత్తింది. -
హాథ్రస్పై రాజకీయం చేయను
దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన హాథ్రస్ తొక్కిసలాటపై తాను రాజకీయాలు చేయదలచుకోవడం లేదని, కానీ తప్పు రాష్ట్ర అధికార యంత్రాంగానిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
నెల రోజుల్లో మోదీ ప్రభుత్వ పతనం
కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని, నెల రోజుల్లోపే అది కుప్పకూలడం ఖాయమని ఆర్జేడీ అధ్యక్షుడు లాలా ప్రసాద్ యాదవ్ అన్నారు. -
మండలి హస్తగతమే లక్ష్యం
తెలంగాణ శాసనమండలిలో మెజారిటీ సభ్యులను తమ పార్టీలో చేర్చుకొని ఆధిపత్యం చాటేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. -
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవద్దు
గద్వాల భారాస ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తూ ఆ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం గాంధీభవన్లో ఆందోళనకు దిగారు. -
పవన్కల్యాణ్ వల్లే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం: జగ్గారెడ్డి
జనసేన అధినేత పవన్కల్యాణ్ తెదేపాతో భాజపాకు పొత్తు కుదర్చకపోతే కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చేది కాదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ప్రొటోకాల్ ఉల్లంఘన జరుగుతోంది
తమ నియోజకవర్గాల్లో అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని భారాస ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సంక్షిప్త వార్తలు
ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ను కనుమరుగు చేసేందుకు భాజపా కుట్రలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. -
అమర్నాథ్ యాత్ర అనంతరం.. జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు!
అమర్నాథ్ యాత్ర ముగిసిన అనంతరం జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. -
సంక్షిప్త వార్తలు
-
మోదీ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..! లాలూ
కేంద్రంలోని మోదీ సర్కారు బలహీనంగా ఉందని, అది నెల రోజుల్లోపే కూలిపోయే అవకాశం ఉందని ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు.