- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
BJP: లోక్సభ ఓట్లగణనకు ముందు.. భాజపా నేతల కీలక సమీక్ష
మరికొన్ని గంటల్లో లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా.. విజయంపై ధీమాగా ఉన్న భాజపా నేతలు సోమవారం పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా అధ్యక్షతన కీలక భేటీ నిర్వహించారు.
నడ్డా అధ్యక్షతన సమావేశం
హాజరైన అమిత్ షా, రాజ్నాథ్
దిల్లీ: మరికొన్ని గంటల్లో లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా.. విజయంపై ధీమాగా ఉన్న భాజపా నేతలు సోమవారం పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా అధ్యక్షతన కీలక భేటీ నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనతోపాటు మంగళవారం జరగనున్న ఓట్లగణన సందర్భంగా అన్ని పోలింగ్ బూత్లకు ఏజెంట్లు సకాలంలో చేరుకోవడం వంటి సన్నాహాలను సమీక్షించారు. ఈ ఎన్నికల్లోనూ భాజపా సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించబోతోందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్న నేపథ్యంలో రాజకీయ పరిస్థితులతోపాటు ఆ అంచనాలను తిరస్కరిస్తూ విపక్ష ఇండియా కూటమి నిర్వహించిన వరుస సమావేశాల గురించి నేతలు చర్చించారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను ధ్రువీకరించారు. ఏడు దశల్లో జరిగిన పోలింగు సరళిని సమావేశంలో సమీక్షించినట్లు ఆయన తెలిపారు. ఓట్లలెక్కింపుపై ఎక్కడైనా అనుమానాలు ఉంటే అటువంటి పరిస్థితులపై పార్టీ ఆఫీస్ బేరర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించినట్లు వెల్లడించారు. ఫలితాల అనంతరం జరుపుకొనే సంబరాలు, ప్రభుత్వ ఏర్పాటు గురించి ఎటువంటి చర్చ జరగలేదని.. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కాకుండా ఓటింగు సరళి తెలిశాకే ఆ విషయంపై మాట్లాడుతామని ఒక ప్రశ్నకు సమాధానంగా తావ్డే చెప్పారు. ప్రతిపక్షాల వ్యూహాలను ఎదుర్కోవడంపై సమావేశంలో భాజపా నేతలు చర్చించినట్లు తెలిసినా.. ఆ విషయాన్ని అధికారికంగా ఆయన ధ్రువీకరించలేదు. ఇటు భాజపా, అటు ఇండియా కూటమి నేతలు ఆదివారం ఎన్నికల కమిషనర్లను కలిసి ఫిర్యాదులు సమర్పించిన విషయం తెలిసిందే.
ఇండియా కూటమి ఓటమిని హుందాగా అంగీకరించాలి
-భాజపా
మంగళవారం వెల్లడయ్యే లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అనివార్యమైన ఓటమిని హుందాగా అంగీకరించాలని, ప్రజాస్వామ్య గౌరవాన్ని కించపరచరాదని భాజపా హితవు పలికింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం భాజపా జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థలపై విపక్షాలు లేవనెత్తుతున్న నిరాధార ఆరోపణలు సమాజంలో అశాంతికి దారి తీస్తాయన్నారు.
ప్రధాని మోదీతో నీతీశ్ భేటీ
బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్కుమార్ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల ఓట్లగణనకు ఒకరోజు ముందు జరిగిన ఈ సమావేశానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎన్డీయేలో భాగమైన నీతీశ్ సారథ్యంలోని జేడీయూకు ఈసారి బిహార్లో ఆర్జేడీ నుంచి గట్టి సవాలు ఎదురైంది. రాష్ట్రంలో భాజపా కూడా బలంగా ఉన్నందున 2005 నుంచి మధ్యలో కొద్దికాలం మినహా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నీతీశ్ భవితవ్యం ఫలితాల తర్వాత ఎలా ఉంటుందన్నదానిపై కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు నాయకుడు.. జగన్ ప్రతినాయకుడు
రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు దిల్లీ వెళితే.. హింసా రాజకీయాల్ని ప్రోత్సహించే వైకాపా అధ్యక్షుడు జగన్ మాత్రం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు జైలుకు వెళ్లారని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. -
అసెంబ్లీకి ఐదేళ్లలో సున్నం కూడా వేయలేదు
వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతిని నాశనం చేశారని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. అందరం కలసి మంచి రాజధానిని నిర్మించుకోవాలని పేర్కొన్నారు. -
చంద్రబాబుకు హైదరాబాద్లో ఘనస్వాగతం
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హైదరాబాద్లో ఘనస్వాగతం లభించింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శుక్రవారం ఆయన తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. -
చిత్తూరులో వైకాపాకు భారీ షాక్
వైకాపాకు చిత్తూరులో భారీ షాక్ తగిలింది. నగర మేయర్ ఎస్.అముద ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేసి తెదేపాలో చేరారు. -
దర్శి వైకాపా ఎమ్మెల్యే హల్చల్
అధికార అండతో ఇన్నాళ్లూ దౌర్జన్యాలకు పాల్పడిన వైకాపా నాయకులు ఇప్పుడు కూడా అదే మార్గంలో వెళుతున్నారు. -
సొంత బాబాయ్ చనిపోయినా.. జగన్ ఇంతలా స్పందించలేదు
తన బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి చనిపోతే పట్టించుకోని జగన్.. ఈవీఎం పగలగొట్టి, సీఐ హత్యకు యత్నించి జైలుపాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టి హెలికాప్టర్లో వెళ్లడం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. -
భవిష్యత్తులో అమరావతిపై అనిశ్చితి ఏర్పడకుండా చూడాలి: సీపీఎం
రాజధాని అమరావతిపై భవిష్యత్తులో అనిశ్చితి, గందరగోళం ఏర్పడకుండా వ్యవస్థీకృతమైన సమగ్ర ఏర్పాట్లు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. -
ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్యేల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులుగా నామినేషన్ వేసిన సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
లోక్సభ హౌస్ కమిటీలో పురందేశ్వరికి చోటు
ఎంపీల వసతి, ఇతర సదుపాయాలను పర్యవేక్షించే లోక్సభ హౌస్ కమిటీ ఏర్పాటైంది. భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మహేశ్ శర్మ నేతృత్వం వహించనున్న ఈ కమిటీలో 12 మంది సభ్యులను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నామినేట్ చేశారు. -
పిన్నెల్లి వాసుల సమస్యపై కోర్టుకు వెళ్దాం
గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో ఎన్నికలప్పటి నుంచి పరిస్థితి కుదుటపడలేదని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్కు తెలిపారు. -
8న రాజమహేంద్రవరంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం
రాజమహేంద్రవరంలో ఈ నెల 8న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు వెల్లడించారు. -
ఓటమిపై కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు
మాజీ సీఎం, భారాస అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల్లో ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
భారాస అధికారిక సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు. -
కేశవరావు రాజీనామాకు ఆమోదం
రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు చేసిన రాజీనామాను ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ శుక్రవారం ఆమోదించారు. -
తెలంగాణ దాటితే కేసీఆర్ను ఎవరూ గుర్తుపట్టరు
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్లో కూర్చొని ఆ పార్టీ శ్రేణులకు పేదరాసి పెద్దమ్మ కథలు చెప్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. -
ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన స్పీకర్
ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించే విషయమై దాదాపు నెల రోజులుగా పశ్చిమబెంగాల్ రాజ్భవన్, ఆ రాష్ట్ర శాసనసభ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయిందని భావిస్తున్న తరుణంలో మరో వివాదం తలెత్తింది. -
హాథ్రస్పై రాజకీయం చేయను
దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన హాథ్రస్ తొక్కిసలాటపై తాను రాజకీయాలు చేయదలచుకోవడం లేదని, కానీ తప్పు రాష్ట్ర అధికార యంత్రాంగానిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
నెల రోజుల్లో మోదీ ప్రభుత్వ పతనం
కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని, నెల రోజుల్లోపే అది కుప్పకూలడం ఖాయమని ఆర్జేడీ అధ్యక్షుడు లాలా ప్రసాద్ యాదవ్ అన్నారు. -
మండలి హస్తగతమే లక్ష్యం
తెలంగాణ శాసనమండలిలో మెజారిటీ సభ్యులను తమ పార్టీలో చేర్చుకొని ఆధిపత్యం చాటేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. -
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవద్దు
గద్వాల భారాస ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తూ ఆ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం గాంధీభవన్లో ఆందోళనకు దిగారు. -
పవన్కల్యాణ్ వల్లే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం: జగ్గారెడ్డి
జనసేన అధినేత పవన్కల్యాణ్ తెదేపాతో భాజపాకు పొత్తు కుదర్చకపోతే కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చేది కాదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు
-
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
-
నిఖత్కు సాటిలేరు.. ఒలింపిక్స్ బరిలో ఇందూరు బాక్సర్
-
గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో ముగిసిన సోదాలు.. సీబీఐ అదుపులో 8 మంది అధికారులు
-
బుల్లి వారసులతో ముకేశ్-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?
-
హాథ్రస్ తొక్కిసలాట.. తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా