- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
TDP: ప్రజా సమస్యలపై తెదేపా టోల్ఫ్రీ నంబరు 73062 99999
ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
వివరాలు చెబితే.. చంద్రబాబును కలిసే ఏర్పాటు
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఇబ్బందులు ఉన్న వారు 73062 99999 నంబర్కు ఫోన్ చేసి సమస్య తెలియజేస్తే.. వివరాలు నమోదు చేసుకుని ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. టోల్ ఫ్రీ నంబర్కు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఫోన్ చేయొచ్చని, ప్రతి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ ఉంటుందని చెప్పారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘సీఎంను కలిసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. వినతులు ఇచ్చే వారితో పాటు చంద్రబాబుతో ఫొటోలు దిగేందుకు యువత వేల సంఖ్యలో వస్తున్నారు. వీరిని నియంత్రించడం కష్టమవడంతో పాటు గ్రీవెన్స్ను మరింత సమర్థంగా నిర్వహించాలనే ఉద్దేశంతో టోల్ ఫ్రీ నంబర్ తీసుకొచ్చాం’’ అని శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై గత ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా పెట్టిన తప్పుడు కేసుల్ని మూడు నెలల్లో, ఎఫ్ఐఆర్ నమోదై కోర్టుల పరిధిలో ఉన్న వాటిని ఏడాది లోపు తొలగించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఒక్కో పింఛన్దారుకు రూ.32 వేల నష్టం
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా చంద్రబాబు ఒకే విడతలో రూ.వెయ్యి చొప్పున పింఛన్ నగదును పెంచారని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వం రూ.వెయ్యి పెంచడానికి ఐదేళ్లు తీసుకుంది. దాంతో ఒక్కో పింఛన్దారు సగటున రూ. 32 వేల చొప్పున నష్టపోయారు’’ అని తెలిపారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎన్డీయే నేతలు పాల్గొనాలని కోరారు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకోండి
దాతలకు పల్లా శ్రీనివాసరావు పిలుపు
స్పైనల్ మస్కులర్ ఆట్రోఫి (ఎస్ఎంఏ) అనే అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోన్న హితైషి అనే తొమ్మిది నెలల చిన్నారికి దాతలు తమ వంతు సాయం చేసి ఆదుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కోరారు. చిన్నారి చికిత్సకు సుమారు రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని, అందుకు క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ తరఫున కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరానికి చెందిన ప్రీతమ్, గాయత్రి దంపతుల కుమార్తె హితైషి ఎస్ఎంఏ వ్యాధితో బాధపడుతోంది. కూర్చోవడం, తినడం, శ్వాసతీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ చిన్నారి తల్లిదండ్రులతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావు ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. www.impactguru.com ద్వారా సాయం అందించాలని దాతలను ఆయన కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త చట్టం కింద భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కరీంనగర్ ఒకటో ఠాణాలో కేసు నమోదైంది. మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం కింద కేసు నమోదు చేశారు. -
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 4న (గురువారం) నెల్లూరుకు వెళ్లనున్నారు. అక్కడి కేంద్ర కారాగారంలో ఉన్న మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవనున్నారు. -
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం దిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి 7.25 గంటలకు దిల్లీ చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. -
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్
కేసీఆర్తో భారాసకు చెందిన జడ్పీ ఛైర్పర్సన్లఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ భారాసకే ప్రజలు పట్టం కడతారని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కొంచెం ఓపిక పట్టాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
బాధితులకు సత్వర న్యాయం పేరుతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రదర్శించిన అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారి తీసింది. -
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
కాకినాడ నగరపాలకసంస్థ పరిధిలో వైకాపా నాయకుడికి చెందిన అక్రమ కట్టడం కూల్చివేతను మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన అనుచరులతో కలసి అడ్డుకున్నారు. -
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి
వైకాపా ప్రభుత్వ అనారోగ్య ఆర్థిక విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని తెదేపా పార్లమెంటరీ పార్టీ ఉపనాయకురాలు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆరోపించారు. -
వైకాపా నాయకులు కబళించిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి
గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు, ఇతరులు అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని, కబళించిన భూముల్ని రెవెన్యూ రికవరీ చట్టం లేదా ఇతర చట్టాల్ని ప్రయోగించి స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ ఆర్థిక మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచించారు. -
పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ: తెదేపా నేత కేఎస్ జవహర్
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేసి సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెదేపా సీనియర్ నేత కేఎస్ జవహర్ కొనియాడారు. -
సంక్షిప్త వార్తలు (5)
పదేళ్లు అధికారంలో ఉండి జాబ్ క్యాలెండర్ ఎందుకివ్వలేదని భారాస నాయకులను కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. నిరుద్యోగులు సమయం వృథా చేసుకోకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. -
రాహుల్ది పిల్లచేష్ట
లోక్సభ విపక్ష నేత రాహుల్గాంధీది పిల్లచేష్ట (బాలక్ బుద్ధి) అని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. వరసగా మూడు లోక్సభ ఎన్నికల్లో వంద సీట్లను దాటకపోవడం కాంగ్రెస్కు ఇదే తొలిసారి అని చెప్పారు. -
రుణమాఫీ పేరుతో రైతులను వంచించిన కేసీఆర్
రుణమాఫీ పేరుతో రైతులను వంచించిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. 2018 ఎన్నికల సమయంలో భారాస మ్యానిఫెస్టోలో మాఫీ హామీ ఇచ్చి 2023 ఎన్నికల ముందుదాకా కేసీఆర్ మొద్దు నిద్ర పోయారని ఆయన మీడియాకు తెలిపారు. -
పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం
కాంగ్రెస్ ప్రభుత్వ ఏడు నెలల పాలనలో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసిందని, వేతనాలు లేక పారిశుద్ధ్య కార్మికులు అల్లాడుతున్నారని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు ధ్వజమెత్తారు. -
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థుల నామినేషన్లు
ఎమ్మెల్యేల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో భాగంగా కూటమి అభ్యర్థులు సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ మంగళవారం నామినేషన్లు సమర్పించారు. -
వైఎస్ జయంతి వేడుకలకు సోనియా, రాహుల్గాంధీ
విజయవాడలో ఈ నెల 8న నిర్వహించే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సోనియాగాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర ఏఐసీసీ పెద్దలు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నాయకులు హాజరవుతున్నట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. -
హనుమకొండ భారాస కార్యాలయానికి నోటీసులు
హనుమకొండ బాలసముద్రంలో ఉన్న భారాస కార్యాలయానికి వరంగల్ మహానగర పాలక సంస్థ నోటీసులు జారీచేసింది. పార్టీ కార్యాలయానికి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారని... -
తెలంగాణ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి
తెలంగాణ చరిత్ర, ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే సమగ్ర సమాచారాన్ని గత ప్రభుత్వం రూపొందించిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రాహుల్లా ప్రవర్తించకండి
లోక్సభలో స్పీకర్ స్థానాన్ని అవమానించేలా ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ మాట్లాడి అమర్యాదకరంగా ప్రవర్తించారని, ఎన్డీయే సభ్యులెవరూ అలా చేయవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. -
యూపీలో మాకు 80 సీట్లు వచ్చినా.. ఈవీఎంలను విశ్వసించం
పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చలో విపక్ష నేతలు మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. -
ఖర్గే స్థానంలో జైరాం ఉంటే బాగుండేది
-
నా వ్యాఖ్యల తొలగింపు అప్రజాస్వామికం
రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం లోక్సభలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను తొలగించడాన్ని నిరసిస్తూ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం లేఖ రాశారు.