AP Police: ఎన్టీఆర్‌ భవన్‌పై దాడి ఘటన.. విచారణ చేపట్టిన పోలీసులు

తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌పై దాడి వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు.

Updated : 01 Jul 2024 14:10 IST

 

అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌పై దాడి వ్యవహారం ఘటనలో పోలీసులు విచారణ చేపట్టారు. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండగా 2021 అక్టోబర్‌ 19న ఆ పార్టీకి చెందిన మూకలు దాడికి పాల్పడ్డాయి. వైకాపా నేతలు దేవినేని అవినాష్‌, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు దాడి చేశారు. రెండున్నరేళ్ల తర్వాత పోలీసులు పార్టీ కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తిస్తున్నారు. దాడి చేసిన వారితో పాటు చేయించిన వారిపైనా పోలీసులు దృష్టి సారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని