- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Nimmala Ramanaidu: పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
దేశాన్ని కరవు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
కొయ్యలగూడెం గ్రామీణం: దేశాన్ని కరవు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబేనని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారమన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటిని మంత్రి విడుదల చేశారు. 4, 5, 6 పంపుల ద్వారా 1,050క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. అక్కడ యంత్రాలు, మోటార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రి పరిశీలించారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వృథా నీటిని అరికట్టవచ్చన్నారు. ‘‘ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రాకు బదిలీ చేయించడం చంద్రబాబు ముందుచూపునకు నిదర్శనం. పట్టిసీమ ద్వారా ఏటా 80 టీఎంసీల నీటి వినియోగం జరుగుతోంది. గతంలో పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడు అదే బంగారమైంది. కృష్ణా డెల్టాకు తాగు, సాగునీరు అందుతుందంటే అది పట్టిసీమ పుణ్యమే. తాగునీటి వ్యవస్థను జగన్ విధ్వంసం చేశారు. పట్టిసీమ నీటిని విడుదల చేయకపోతే లక్షలాది మంది దాహార్తిని ఎలా తీరుస్తారు?ఒక్క చుక్క నీటినీ వృథా చేయొద్దని సీఎం చెప్పారు.
తాడిపూడి నుంచి 1.50లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నాం. ఏలేరు రిజర్వాయర్లో నీరుంటే స్టీల్ప్లాంట్, విశాఖకు తాగునీరు అందుతుంది. ఏలేరులో నీటి నిల్వకు ప్రయత్నం చేస్తున్నాం. ఒకే రోజు నాలుగు పథకాల ద్వారా నీటిని విడుదల చేయడం చరిత్ర. అధికారులతో సమన్వయం చేసుకుని నీటి నిర్వహణ సమర్థంగా చేపడుతున్నాం. పోలవరం ఫలాలు పట్టిసీమ ద్వారా కొంతమేర కృష్ణా డెల్టాకు అందుతున్నాయి’’ అని రామానాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఐటీడీఏ పీవో సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీడీఆర్ బాండ్లలో అక్రమాలపై విచారణ.. నివేదికలు వచ్చాకే చర్యలు: మంత్రి నారాయణ
తణుకు టీడీఆర్ బాండ్లలో అనేక అక్రమాలు జరిగాయని, వాటిని కొనుగోలు చేసిన వారంతా ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారని మంత్రి నారాయణ అన్నారు. -
విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాలి: సీఎం రేవంత్
తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కోరామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. -
దిల్లీ, హరియాణాల్లో వారితో పొత్తు లేనట్లే...! కాంగ్రెస్
ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి పొత్తుల విషయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్.. కాసేపట్లో ప్రమాణస్వీకారం
ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారానికి రంగం సిద్ధమైంది. -
పిన్నెల్లిని పరామర్శించడానికి జగన్ చేసిన ఖర్చు రూ.25 లక్షలు: హోంమంత్రి అనిత
ఈవీఏం పగులగొట్టి జైలుకెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ రూ.25 లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. -
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కె.కేశవరావు
రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు (కేకే) రాజీనామా చేశారు. -
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి భేటీ
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు. -
తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం మంచిదే: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు సమావేశం కావడం మంచిదేనని భాజపా సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. -
జైలుకు వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసిన జగన్
ఈవీఎం ధ్వంసం సహా మరికొన్ని కేసుల్లో అరెస్టయి జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైకాపా అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. -
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి భేటీ
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాతో ఆయన భేటీ అయ్యారు. -
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. -
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
భారాసకు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) కొత్త అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం వాయిదాపడింది. -
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్
‘వెళ్లిపోవాలనుకునేవారిని ఎంతకాలం ఆపగలం, అది వారిష్టం.. విలువలు, నైతికత అనేవి వారికి ఉండాలి. వెళ్లేవారు వెళతారు. బలంగా నిలబడగలిగేవారే నాతో ఉంటారు. పార్టీలో నేను, అమ్మ ఇద్దరమే మొదలై ఇంత దూరం వచ్చాం. -
మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలా పాలన అందిస్తాం
వైకాపా అప్పుల ఊబిలోకి నెట్టేసిన ఈ రాష్ట్రానికి అంకితభావం ఉన్న నాయకులు కలిస్తే తప్ప అభివృద్ధి రాదన్నది తన విశ్వాసమని.. చంద్రబాబు అనుభవం, కార్యదక్షత ప్రభుత్వాన్ని నడిపించగలవని నమ్మానని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అన్నారు. -
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన సాయం కోరే ఉద్దేశంతో చంద్రబాబు బుధవారం రాత్రి దిల్లీ చేరుకున్నారు. -
ఎట్టకేలకు వైకాపా నేతల అరెస్టు
గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైకాపా ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ను నిందితులుగా గుర్తించారు. -
కనీసం తాగునీటి పరీక్షలూ జరగలేదు
గత వైకాపా ప్రభుత్వ విధ్వంస పాలన వల్ల ప్రజలు బలవుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. -
చట్ట పరిధిలో దోషుల్ని శిక్షిద్దాం.. క్షేత్రస్థాయికి వెళ్లొద్దు
‘‘దోషుల్ని చట్ట పరిధిలో శిక్షిద్దాం. అంతేతప్ప క్షేత్రస్థాయికి వ్యక్తిగతంగా వెళ్లొద్దు’’ అని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. -
రేపు హైదరాబాద్కు చంద్రబాబునాయుడు
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 5వ తేదీన హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు ఆయన చేరుకుంటారు. -
9.44 లక్షల మంది విద్యార్థులకు రూ.3,480 కోట్లు ఎగ్గొట్టిన జగన్
రాష్ట్రంలో సుమారు 9,44,666 మంది విద్యార్థులకు ఫీజులు కట్టకుండా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మాయిలను ఆ ఒక్క ప్రశ్న అడగొద్దు’: శ్రుతి హాసన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఆచూకీ లేని ‘భోలే బాబా’.. బాధితుల్లో ఆక్రోశం!
-
విడాకుల రూమర్స్ వేళ.. పాండ్యా సతీమణి పోస్టు వైరల్
-
టీడీఆర్ బాండ్లలో అక్రమాలపై విచారణ.. నివేదికలు వచ్చాకే చర్యలు: మంత్రి నారాయణ
-
ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్లివే.. ‘మీర్జాపూర్ 3’ వచ్చేస్తోంది!