- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
AP Exit Polls 2024: కూటమి ఖాయం
ఇటీవలి కాలంలో 95%పైగా కచ్చితత్వంతో విశ్వసనీయ సర్వే సంస్థగా పేరొందిన ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే అధికారమని తేల్చింది!
ఆంధ్రా అసెంబ్లీపై ‘ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్పోల్
ఎన్డీయేకు 98-120 సీట్లు.. వైకాపాకు 55-77
యువత, విద్యావంతులు, పట్టణవాసుల్లో అధికశాతం కూటమి వైపే
ఈనాడు - అమరావతి
ఇటీవలి కాలంలో 95%పైగా కచ్చితత్వంతో విశ్వసనీయ సర్వే సంస్థగా పేరొందిన ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే అధికారమని తేల్చింది! ‘ఇండియా టుడే’ ఆధ్వర్యంలో చేసిన ఈ సర్వే ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి ఖాయమని స్పష్టం చేసింది. శనివారం లోక్సభ ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించిన ఈ సంస్థ... ఆదివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అంచనాలనూ తెలిపింది. లోక్సభ ఎన్నికల్లో కూటమిదే విజయమన్న ఈ సర్వే.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఒరవడి కొనసాగుతున్నట్లు అంకెలు సహా ప్రకటించింది. ఎన్డీయే కూటమి 51% ఓట్లతో 98-120 స్థానాల్లో గెలుస్తుందని, వైకాపా 44% ఓట్లతో 55-77 స్థానాలకు పరిమితమవుతుందని అంచనా వేసింది. కాంగ్రెస్ 2% ఓట్లతో 0-2 సీట్లలో గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపుగా ఇదే సరళిని అంచనా వేసిన సంగతి తెలిసిందే.
గత ఎన్నికలతో పోలిస్తే వైకాపా 85 స్థానాలు కోల్పోతుందని.. ఆ మేరకు స్థానాలు ఎన్డీయేకు వస్తాయని ‘ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా’ సర్వే అంచనా వేసింది. తెదేపా 78-96 స్థానాల్లో జనసేన 16-18 స్థానాల్లో, భాజపా 4-6 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయంది. పథకాలు 22%, ప్రభుత్వ పనితీరు 9%, అభివృద్ధి 18%, పార్టీ అనుకూలత 12% ఈసారి పోలింగ్లో ప్రభావం చూపాయని తెలిపింది.
- ఎన్టీయే కూటమికి పురుషులు 54%, మహిళలు 48%.. వైకాపాకు పురుషులు 41%, మహిళలు 47% మంది మద్దతు పలికారని సర్వే వెల్లడించింది. గత ఎన్నికలతో పోల్చిచూస్తే పురుషుల్లో 10%, మహిళల్లో 2% ఓట్లను వైకాపా కోల్పోయే అవకాశం ఉందంది.
- 18-25 ఏళ్ల యువతలో 57% మంది ఎన్డీయేకు మద్దతివ్వగా.. వైకాపాకు 39% మందే మొగ్గు చూపారు. 26-35 ఏళ్లవారిలో 52% ఎన్డీయేకు, 43% వైకాపాకు మద్దతిస్తున్నారు. 36-50 ఏళ్లవారిలో 49% ఎన్డీయేకు, 46% వైకాపాకు ఓట్లేశారు. 61 ఏళ్ల పైబడిన వారిలో వైకాపాకు 49%, ఎన్డీయేకు 46%మద్దతు పలికారని సర్వే వెల్లడించింది.
- పట్టభద్రుల్లో 56%, వృత్తినైపుణ్యం కలిగిన పట్టభద్రుల్లో 58%, పదోతరగతి ఉత్తీర్ణులైన వారిలో 52% ఎన్డీయే వైపు మొగ్గుచూపారు.
- మాల, మాదిగ వర్గాల్లో 3% చొప్పున.. ఎస్టీ వర్గాల్లో 11% ఎన్డీయే ఓటుబ్యాంకు పెరిగింది. ముస్లింలలో 11% ఓట్లు కూటమికి పడ్డాయి. ఓబీసీ, యాదవుల్లో 8%, కమ్మ సామాజికవర్గంలో 4%, కాపులలో 11% రెడ్డి, ఇతరుల్లో 5% ఓటుబ్యాంకు గతంతో పోలిస్తే కూటమికి పెరిగింది.
జగన్ను దెబ్బతీయనున్న అంశాలివీ..
ఓట్లు, సీట్ల అంచనాలతో పాటు... రాష్ట్ర ప్రజల మనోగతంపైనా ఈ సర్వే దృష్టిసారించింది. గెలుపోటములను నిర్దేశించే అంశాలను విశ్లేషించింది. దాని ప్రకారం జగన్ను తీస్తాయనుకుంటున్న ప్రధాన అంశాలివీ...
రాష్ట్రంపై అప్పుల భారం.. కనిపించని అభివృద్ధి
జగన్ సారథ్యంలోని వైకాపా అయిదేళ్ల పాలనలో ఆర్థిక అవరోధాలే ప్రధాన అడ్డంకిగా మారాయి. అడ్డగోలుగా అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర రుణాలను రూ.13 లక్షలకుపైగా కోట్లకు తీసుకెళ్లారు. వీటిల్లో అధికశాతం నవరత్నాల అమలు కోసమే వినియోగించారు. మౌలిక వసతులను మెరుగుపర్చడంలో సర్కారు ఘోరంగా విఫలమైంది. విద్యుత్తు సరఫరాలో ఎడాపెడా కోతలు, తాగునీటి కొరత, అధిక విద్యుత్తు ఛార్జీలు, నిత్యావసరాల ధరల పెరుగుదల ప్రతికూలంగా మారాయి. నిరుద్యోగిత పెరిగి ఆశావహుల్లో అసహనం మూటగట్టుకుంది.
గందరగోళంగా అభ్యర్థుల ఎంపిక: ఆర్థిక అంశాలు, పథకాల అమలులో వైఫల్యం తదితరాలన్నీ ఒకెత్తయితే.. అసెంబ్లీ, లోక్సభకు అభ్యర్థుల ఎంపిక అంతకుమించి దెబ్బతీసింది. ప్రజల్లో వ్యతిరేకత పేరిట నియోజకవర్గ అభ్యర్థులను ఇష్టానుసారం మార్చేశారు. పలువురు సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు మరోసారి పోటీచేసే అవకాశం కల్పించలేదు. ఈ మార్పులు పార్టీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తల్లో గందరగోళానికి కారణమయ్యాయి. వారిలో గూడుకట్టుకున్న ఆ అసంతృప్తే ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలకు సహకరించేలా పురిగొల్పింది.
చంద్రబాబుపై సానుభూతి: అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతికి పాల్పడినట్లు అభియోగాలు మోపి, మాజీ సీఎం చంద్రబాబునాయుడును అరెస్టు చేసి జైలుకు పంపించడం ప్రజల్లో ఆయన పట్ల సానుభూతిని తీసుకొచ్చింది. బాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాలతో శ్రేణులు ఉత్తేజితమయ్యాయి. అరెస్టు అక్రమ మంటూ వివిధ వర్గాల నుంచి చంద్రబాబుకు విశేష మద్దతు లభించింది. ఈ క్రమంలో గతంలో ఆయన చేపట్టిన అభివృద్ధిపై చర్చ జరిగేలా చేశాయి. ‘యువగళం’ పేరిట నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర కూడా పార్టీకి కలిసొచ్చింది.
పవన్ కరిష్మా.. అధికార భాజపా అండ..: ఎగ్జిట్ పోల్ ప్రకారం రాష్ట్రంలో తెదేపా అతిపెద్ద పార్టీగా అవతరించిందంటే దానికి ప్రధాన కారణం కూటమిగా ఏర్పడటం. పవన్ కల్యాణ్ క్రేజ్తోపాటు యూత్లో ఆయనకున్న ఫాలోయింగ్.. ఎన్డీయే నేతల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించింది. వైకాపా ఎత్తుగడలను చిత్తు చేస్తూ.. సభలకు జనాలను విశేషంగా రప్పించడంలో కలిసొచ్చింది. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు సంఘీభావం తెలిపిన పవన్.. బయటకు వచ్చిన వెంటనే కూటమిగా ముందుకెళ్లనున్నట్లు ప్రకటించడం చారిత్రక నిర్ణయం. సామాజిక సమీకరణాలను ఇది మార్చింది. భాజపా అధికార బలం కూడా పోలింగ్ పరంగా సానుకూల వాతావరణం కల్పించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్పై విశ్వాసం లేకే కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
భారాస అధ్యక్షుడు కేసీఆర్పై విశ్వాసం లేకపోవడంతోనే ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. -
కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఆయన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. -
శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: భానుప్రకాశ్ రెడ్డి
ప్రపంచ హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను గత ప్రభుత్వం అధర్మ క్షేత్రంగా మార్చిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. -
టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస విద్యార్థి నేతల ఆందోళన.. పలువురి అరెస్టు
టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస అనుబంధ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. రహదారిపై బైఠాయించి అనుబంధ విద్యార్థి సంఘం నేతలు నిరసన తెలిపారు. -
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) దిల్లీ పర్యటన కొనసాగుతోంది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన భేటీ అయ్యారు. -
ఆడిన మాట తప్పని రాజస్థాన్ మంత్రి కిరోడిలాల్
భాజపా సీనియర్ నేత, రాజస్థాన్ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి కిరోడి లాల్ మీనా (72) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఆమోదించలేదు. -
కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు
కాకినాడలో వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదైంది. ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుతో పాటు మరో 24 మందిపైనా కాకినాడ రెండో పట్టణ పోలీసుస్టేషన్లో గురువారం కేసు నమోదుచేశారు. -
రేషన్ వాహనాలతో రూ. 1,500 కోట్ల నష్టం: మంత్రి నాదెండ్ల మనోహర్
రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాల నిర్వాహకులేనని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. -
‘ఆమెను రాజమాత అని మీరెందుకు తిట్టారు? అక్కడి నుంచే పార్టీ నాశనం’
‘అంతా మీరే చేశారు’ ఇది ఒక సినిమాలోని పాపులర్ డైలాగు. ఇప్పుడదే డైలాగును వైకాపాలో తాజా మాజీలు ఒకరిపై ఒకరు గట్టిగానే ప్రయోగించుకున్నారు. -
భారాసకు భారీ షాక్
భారాసకు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా హడావుడి లేకుండా, ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా గుంభనంగా సాగిపోయింది. -
పిన్నెల్లి మంచోడు...
‘పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు.. కాబట్టే 2009 నుంచి 2019 వరకు నాలుగుసార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజలు ఆయన్ను దీవించారు. -
ప్రజాతీర్పునకు వక్రభాష్యాలా..?
ఎన్నికల్లో ఘోర పరాజయం పొందినా.. జగన్లో మార్పు రాలేదు. ప్రజాతీర్పును గౌరవించేందుకు ఆయన ఇంకా సిద్ధపడలేదు. ఓటమిని అంగీకరించక, రోజుకో మాట చెబుతూనే ఉన్నారు. -
ఈవీఎం ధ్వంసం, సీఐపై హత్యాయత్నం నేరాలు కావా?
పోలింగ్ రోజు, అనంతరం మాచర్ల నియోజకవర్గంలో భారీ విధ్వంసం సృష్టించి, ఈవీఎంలను ధ్వంసం చేసి, అడ్డుకోబోయిన సీఐపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని అరెస్టు చేయకూడదా అని వైకాపా అధినేత జగన్ను తెదేపా నేతలు ప్రశ్నించారు. -
ముగ్గురాయి గనుల్లో అక్రమాలు.. ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల నష్టం
మంగంపేట ముగ్గురాయి గనుల్లో 2019 నుంచి 2024 వరకు జరిగిన అవకతవకల వల్ల ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ఆరోపించారు. -
ప్రజాతీర్పు శిరోధార్యం
ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయమని, వారి తీర్పే శిరోధార్యమని, వారు ఎటువంటి పాత్రను అప్పగిస్తే దానిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. -
రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో రాహుల్ విఫలం: కేటీఆర్
రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడే రాహుల్ గాంధీ దాని స్ఫూర్తిని కాపాడడంలో విఫలమయ్యారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా
భారాసను వీడి కాంగ్రెస్లో చేరిన కె.కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయన రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను కలిసి రాజీనామా లేఖ సమర్పించారు. -
సంక్షిప్త వార్తలు (5)
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబునాయుడు ఈ నెల 6న భేటీ కావడం హర్షణీయమని మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి అన్నారు. -
ఫోన్ట్యాపింగ్తో సంబంధం లేదు: ఎమ్మెల్సీ నవీన్కుమార్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని భారాస ఎమ్మెల్సీ కె.నవీన్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించేందుకు ఎవరు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. -
10న తెలంగాణకు కాంగ్రెస్ కురియన్ కమిటీ
లోక్సభ ఎన్నికల్లో ఆశించిన మేరకు లక్ష్యాలు సాధించకపోవడానికి కారణాలపై అధ్యయనం చేయడానికి ఏఐసీసీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఈ నెల 10న తెలంగాణకు రానుంది. -
అన్నీ గవర్నర్ చేతుల్లో ఉండవు
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో స్పీకర్ బిమన్ బెనర్జీ శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అందుకే బిహార్లో వరుసగా బ్రిడ్జ్లు కూలుతున్నాయట! నివ్వెరపరుస్తున్న కేంద్రమంత్రి సమాధానం
-
‘బింబిసార’కు ప్రీక్వెల్గా పార్ట్2.. డైరెక్టర్ ఎవరంటే!
-
ట్రయంఫ్ స్పీడ్, స్క్రాంబ్లర్ మోటార్ సైకిళ్లపై డిస్కౌంట్
-
‘ఉస్తాద్ భగత్ సింగ్’పై రూమర్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీశ్ శంకర్
-
కేసీఆర్పై విశ్వాసం లేకే కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM