Chandrababu: దిల్లీకి సీఎం చంద్రబాబు.. బడ్జెట్‌ ప్రతిపాదనలపై ప్రధానితో చర్చించే అవకాశం

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సాయంత్రం దిల్లీకి వెళ్లనున్నారు.

Published : 02 Jul 2024 18:59 IST

అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సాయంత్రం దిల్లీకి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి చేపట్టే దిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తదితరులతో చర్చలు జరపనున్నట్టు సమాచారం. విభజన హామీల అమలుపైనా చర్చించే అవకాశముంది. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, తదితర అంశాలపై కేంద్రంలోని ఎన్డీయే నేతలతో చంద్రబాబు చర్చించనున్నట్టు తెలుస్తోంది. గత ఐదేళ్లలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని