- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Congress: భారాసకు భారీ షాక్
భారాసకు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా హడావుడి లేకుండా, ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా గుంభనంగా సాగిపోయింది.
కారు దిగి హస్తాన్ని అందుకున్న ఆరుగురు ఎమ్మెల్సీలు
అర్ధరాత్రి దాటాక సీఎం రేవంత్ సమక్షంలో చేరిన భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్
సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్మున్షీల సమక్షంలో హస్తం పార్టీలో చేరిన భారాస ఎమ్మెల్సీలు దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్. చిత్రంలో వేంనరేందర్రెడ్డి, సుదర్శన్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సురేందర్రెడ్డి తదితరులు
ఈనాడు, హైదరాబాద్: భారాసకు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా హడావుడి లేకుండా, ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా గుంభనంగా సాగిపోయింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సీఎం రేవంత్రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీల సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకొన్నారు. భారాస ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ పార్టీ మారారు. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని ఒక హోటల్లో సమావేశమైన వారు రాత్రి 11.30 గంటల సమయంలో జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన ముగించుకుని నివాసానికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు. అక్కడ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. సీఎం దిల్లీ నుంచి వచ్చిన నిమిషాల్లోనే చేరికల కార్యక్రమం పూర్తయింది.
ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేల చేరిక
ఇప్పటికే ఆరుగురు భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్రెడ్డి, సంజయ్కుమార్, కాలె యాదయ్య ఉన్నారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కూడా ఆ పార్టీ గూటికి చేరారు. తమ నేతలు పార్టీని వీడడంతో ఇప్పటికే భారాస ఇబ్బంది పడుతోంది. తాజాగా ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్సీలు భారాసకు దూరం కావడం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరమైన పరిణామం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, ఆయన కుమారుడు శివనర్సింహారెడ్డితో పాటు తన గ్రామానికి చెందిన జి.కె.వెంగళరెడ్డి, గుర్రాల చెన్నారెడ్డి, లోటర్ బాషా తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్.. ఎస్పీ కృష్ణకాంత్కు ఫిర్యాదుచేశారు. -
జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయా: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
‘వైకాపా ఐదేళ్ల పాలనలో తప్పులు జరిగాయి. వాటిని సరిదిద్దుకోకపోవడం వల్లే ఎన్నికల్లో ఓటర్లు మమ్మల్ని తిరస్కరించారు. -
రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కావడం సంతోషకరం
విభజన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు సమావేశం కావడం సంతోషకరమని ఏపీ భాజపా అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్నాయుడు పేర్కొన్నారు. -
తెదేపా దాడులను సహించం: మాజీ సీఎం జగన్
సర్వజన ఆసుపత్రి, వేంపల్లె: వైకాపాకు చెందిన 20 ఏళ్ల అజయ్రెడ్డిని తెదేపా వాళ్లు నిర్దాక్షిణ్యంగా కొట్టారని మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మీరు పారదర్శకత అంటే.. ప్రజలు నవ్వుతారు
పారదర్శకత గురించి వైకాపా అధినేత జగన్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడితే ప్రజలు నవ్వుతారని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, తెదేపా ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి మండిపడ్డారు. -
నేడు ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు ఆదివారం రానున్నారు. -
తెదేపా నాయకులపై పెప్పర్ స్ప్రేతో వైకాపా నేత దాడి
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి నెల గడుస్తున్నా, ఓటమి అక్కసుతో వైకాపా నాయకుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. -
వైకాపా హయాంలో మంజూరైన పనులు కొనసాగిస్తాం..: మంత్రి గొట్టిపాటి
వైకాపా ప్రభుత్వంలో మంజూరైన పనులను తమ సర్కారు కొనసాగిస్తుందని, మార్చడం వంటి చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేకమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. -
వైకాపాలో నియోజకవర్గాల బాధ్యుల మార్పు షురూ
ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన వైకాపాలో ఇప్పుడు నియోజకవర్గాల బాధ్యుల మార్పులు మొదలయ్యాయి. -
ఏ కేసులూ లేని ఎమ్మెల్సీలు
ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన తెదేపా, జనసేన అభ్యర్థులు సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ తమపై ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులూ లేవని వెల్లడించారు. -
30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదు
రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీమంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. -
కాంగ్రెస్లో చేరిన భారాస గద్వాల ఎమ్మెల్యే
భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో చేరారు. శనివారం ఆయన జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసానికి వచ్చారు. సీఎం ఆయనకు కాంగ్రెస్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
ప్రభుత్వ సలహాదారుగా కేకే
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావును నియమిస్తూ రాష్ట్ర సర్కారు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రజా వ్యవహారాల విభాగం(పబ్లిక్ ఎఫైర్స్) సలహాదారుగా ఆయనను క్యాబినెట్ మంత్రి హోదాలో నియమించింది. -
రేపు విజయవాడకు సీఎం రేవంత్రెడ్డి
ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం (ఈ నెల 8న) విజయవాడలో నిర్వహించనున్న దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి సభకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. -
జీహెచ్ఎంసీ సమావేశంలో కార్పొరేటర్ల బాహాబాహీ
కార్పొరేటర్ల తోపులాటలు.. పరస్పరం దాడికి యత్నం.. కుర్చీల నుంచి తోసివేతలు.. ఇలా హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పాలకవర్గ సమావేశంలో సుమారు నాలుగు గంటలపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
నిరుద్యోగులను రెచ్చగొట్టొద్దు: మధుయాస్కీ
నిరుద్యోగులను రెచ్చగొట్టి, వారి జీవితాలను ఆగం చేయవద్దని భారాస నేతలకు పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ స్పష్టంచేశారు. పదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన భారాస నాయకులే... -
అభివృద్ధి కావాలన్న ఎమ్మెల్యేలు... కాంగ్రెస్లో చేరండన్న మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్కు చెందిన పలువురు భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో శనివారం సచివాలయంలో ఆరుగురు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబును కలవడం చర్చనీయాంశమైంది. -
పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు నిర్వహించాలి
కాంగ్రెస్ పార్టీ ‘పాంచ్ న్యాయ్ పత్ర్’ హామీ మేరకు.. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి మారిన వారితో రాజీనామా చేయించి ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
నేడు ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు ఆదివారం రానున్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 65లోని ఆయన నివాసం నుంచి భారీ ర్యాలీ చేపట్టి స్వాగతం పలకాలని తెలంగాణ తెదేపా నిర్ణయించింది. -
గుజరాత్లో భాజపాను ఓడిస్తాం
ఎన్నికల్లో భాజపాను అయోధ్యలో (ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో) ఓడించినట్లే గుజరాత్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీని ఓడిస్తామని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చెప్పారు. -
అస్తిత్వ రాజకీయాలే ప్రతిబంధకాలు
సంస్థాగతంగా పార్టీ పునాదులు బలంగా ఉన్న రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో ఓటమిపై సీపీఎంలో అంతర్మథనం జరుగుతోంది. కుల, మత, జాతుల ప్రాతిపదికన విస్తరిస్తున్న అస్తిత్వ రాజకీయాలు వామపక్ష శక్తులకు తీవ్ర ప్రతిబంధకాలుగా మారాయని ఆ పార్టీ కేంద్ర కమిటీ అభిప్రాయపడింది.
తాజా వార్తలు (Latest News)
-
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..
-
పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం
-
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర
-
సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్ చేయమన్నారు
-
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!