- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
USA: అగ్రరాజ్యంలో కొలువుల సంక్షోభం..!
తెలంగాణకు చెందిన వెంకట్ ఆరేళ్ల క్రితం ఓ ప్రముఖ ఐఐటీలో ఇంజినీరింగ్ చేశారు. అనంతరం అమెరికాలో ఎంఎస్ చేసి, అక్కడే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు.
ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు
ఐటీ రంగంలోనే సమస్య తీవ్రం
అక్కడ ఉండలేక... వెనక్కి రాలేక సతమతం
మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి ఉంటుందంటున్న కన్సల్టెంట్లు
ఉండ్రు నరసింహారావు
ఈనాడు, సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
- తెలంగాణకు చెందిన వెంకట్ ఆరేళ్ల క్రితం ఓ ప్రముఖ ఐఐటీలో ఇంజినీరింగ్ చేశారు. అనంతరం అమెరికాలో ఎంఎస్ చేసి, అక్కడే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆయనకు హెచ్-1బీ వీసా కూడా వచ్చింది. పొదుపు చర్యల్లో భాగంగా ఏడాదిన్నర కిందట సంస్థ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. మరోచోట ఉద్యోగం లభించక.. వెంకట్ ఏడాదిగా న్యూజెర్సీలోని ఓ హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నారు.
- హైదరాబాద్కు చెందిన ఓ విద్యార్థికి ఇంజినీరింగ్ పూర్తవగానే రూ.40 లక్షల ప్యాకేజీతో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. అతను దాన్ని వద్దనుకుని అమెరికా వెళ్లి... ఇటీవలే ఎంఎస్ పూర్తి చేశారు. కొన్ని నెలలుగా ఉద్యోగం లభించక సతమతమవుతున్నారు.
- వరంగల్కు చెందిన అజయ్రెడ్డి ఇంజినీరింగ్ పూర్తిచేసి అయిదేళ్లు తెలంగాణలోనే ఒక ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేశారు. ఏడాదిన్నర కిందట అమెరికా వెళ్లి ఎంఎస్ చదివారు. అనుభవమున్నా ఆయనకు ఇప్పటివరకు ఉద్యోగం రాలేదు. ఎన్ని సంస్థలకు దరఖాస్తు చేసినా తిరస్కరిస్తున్నాయి.
అమెరికాలో గత రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడింది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన వారిలో వేల మంది మాస్టర్ డిగ్రీని చేతపట్టుకొని రోడ్ల వెంట తిరగాల్సి వస్తోంది. ఒకవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యారుణం వారిని భయపెడుతుండగా... మరోవైపు ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నాలుగైదేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు తొలగిస్తున్నాయి. బాధితుల్లో చాలామంది హోటళ్లలో, గ్యాస్స్టేషన్లలో పనిచేస్తూ మరో ఉద్యోగం సంపాదించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు.
అక్కడే చదివి.. ఉద్యోగం పొందేందుకు...
అమెరికాలోని సాఫ్ట్వేర్ కంపెనీల్లో అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయనే నమ్మకంతో మన దేశం నుంచి ప్రతి ఏడాది విద్యార్థులు అక్కడికి వెళుతుంటారు. ఇలా 2022-23 సంవత్సరంలో దాదాపు రెండు లక్షల మంది వెళ్లారు. వీరిలో తెలుగు విద్యార్థులు 45 వేల నుంచి 55 వేల మంది వరకు ఉంటారని కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు తెలిపారు. అమెరికా వెళుతున్న విద్యార్థుల్లో చాలామంది ఎంఎస్లో కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులను చదివేందుకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. రెండేళ్ల కిందటి వరకు అమెరికాలో ఎంఎస్ చేసిన వారిలో దాదాపు 85% మందికి అక్కడే ఉద్యోగాలు లభించాయి.
నిరుద్యోగ సమస్య ఎందుకంటే..
కొవిడ్ ప్రభావం 2020 సంవత్సరంలో మొదలై ఏడాదిన్నరకు పైగా కొనసాగింది. రెండుసార్లు విధించిన లాక్డౌన్ కారణంగా అమెరికాలోని అన్ని రకాల పరిశ్రమలు కుదేలయ్యాయి. వాటిని రక్షించుకోవడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడంతో 2021-22లో కంపెనీలకు భారీగా నిధులు అందాయి. బ్యాంకులూ తక్కువ వడ్డీకే రూ.వేల కోట్ల రుణాలివ్వడంతో అనేక కంపెనీలు పెద్దఎత్తున ఉపయోగించుకున్నాయి. ఫలితంగా ఐటీ కంపెనీలకు అనూహ్యంగా ఆర్డర్లు వచ్చాయి. కంపెనీలు సైతం ఉద్యోగులను అదేస్థాయిలో తీసుకున్నాయి. కొవిడ్ ప్రభావం తగ్గిపోయాక.. అమెరికా ప్రభుత్వం ప్యాకేజీలను నిలిపేసింది. పారిశ్రామికరంగం మాత్రం పెద్దగా పుంజుకోలేదు. లాక్డౌన్ సమయంలో వివిధ సంస్థలు, వ్యక్తులకిచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకపోవడంతో బ్యాంకులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీంతో అవి రుణాలివ్వడం ఆపేశాయి. అప్పటిదాకా 3-4 శాతం వరకున్న వడ్డీ రేటును గరిష్ఠంగా ఎనిమిది శాతానికి పెంచేశాయి. అమెరికా చరిత్రలో వడ్డీ రేట్లు ఎప్పుడూ ఇంత ఎక్కువగా లేవని ఆ దేశస్థులు చెబుతున్నారు. దీని ప్రభావం పారిశ్రామికరంగంపై గట్టిగా పడింది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలకు ఒక్కసారిగా ఆర్డర్లు తగ్గిపోయాయి. చేయాల్సిన పనికంటే మానవ వనరుల సంఖ్య అధికంగా ఉండడంతో ఐటీ కంపెనీలు కొవిడ్ సమయంలో చేర్చుకున్న ఉద్యోగులను 2023 మార్చి నుంచి తొలగించడం మొదలుపెట్టాయి. అధిక జీతాలు పొందుతున్న ఉన్నతోద్యోగులను భారీగా తొలగించాయి. కొన్ని కంపెనీలు జీతాలను తగ్గించేశాయి. గతంలో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఐటీ కంపెనీలు ఇప్పుడు వందల సంఖ్యలోనే నియామకాలు చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ భారత్ నుంచి వెళ్లిన వారిపై తీవ్రంగా చూపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వేల మందికి ఎంఎస్ పూర్తిచేసినా ఉద్యోగాలు లభించడం లేదు.
అక్కడే ఉండటానికి అవస్థలు
అమెరికాలోని నిబంధనల ప్రకారం ఆ దేశంలో ఎంఎస్ పూర్తి చేసిన వెంటనే సంబంధిత యూనివర్సిటీ.. విద్యార్థి పేరిట ఓపీటీ ఐ20 (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్)ని విడుదల చేస్తుంది. ఇది వచ్చిన నెల రోజుల్లో ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ)కి దరఖాస్తు చేయాలి. దీనికి ఆమోదం లభించిన మూడు నెలల్లో ఏదో ఒక ఉద్యోగంలో చేరాలి. లేనిపక్షంలో ఆ దేశాన్ని విడిచి పెట్టాలి. అయితే, విద్యార్థులు వర్సిటీ ఫీజుల కోసం రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు బ్యాంకుల నుంచి విద్యారుణం తీసుకుంటారు. స్వదేశానికి వచ్చాక.. ఇక్కడ ఉద్యోగం దొరక్కపోతే ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంది. అందుకే ఏదోఒక రూపంలో అమెరికాలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఎంఎస్ పూర్తికాకుండా ఉండటానికి ఒకట్రెండు సబ్జెక్టులను అలానే వదిలేస్తున్నారు. మరికొందరు యూనివర్సిటీ ప్రొఫెసర్ల దగ్గరే రీసెర్చ్ సహాయకులుగా చేరుతున్నారు. దీనికి ఎలాంటి జీతం ఉండదు. అయితే, ప్రొఫెసర్ ఇచ్చే పత్రంతో ఏడాదిపాటు అమెరికాలోనే ఉండొచ్చు. ఇంకొందరు కన్సల్టెంట్లను సంప్రదించి ఎక్కడో ఒకచోట పనిచేస్తున్నట్లు ధ్రువపత్రం తెచ్చుకుంటున్నారు. సమస్య ఇంతలా వేధిస్తున్నా.. ఏటా అక్కడికి వెళ్లేవారి సంఖ్య మాత్రం తగ్గకపోవడం గమనార్హం.
ప్రభుత్వ తోడ్పాటు అందిస్తే మార్పునకు అవకాశం
వచ్చే నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. బైడెన్, డొనాల్డ్ ట్రంప్ పోటీ పడే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికరంగానికి తోడ్పాటు ఇస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ట్రంప్ ఇలాంటి తోడ్పాటు ఇచ్చారని, ఎన్నికల్లో ఆయన గెలిస్తే పారిశ్రామిక రంగానికి మరోసారి చేయూతనిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
అనుభవమున్నా అందని ఉద్యోగం
నేను 30 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నా. కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉద్యోగావకాశాలను చూపించా. ప్రస్తుత సంక్షోభం కారణంగా పదేళ్ల సర్వీసు ఉన్న వారికీ ఉద్యోగం దక్కని పరిస్థితి ఏర్పడింది. 14 ఏళ్ల అనుభవమున్న వారు కూడా ఉద్యోగాలు కోల్పోయి అల్లాడుతున్నారు. ఐటీ రంగంలోనే ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇలాంటి సమస్యను గత 28 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు.
అయితరాజు శ్రీకాంత్, కన్సల్టెన్సీ యజమాని
ఏడాదిన్నరలో మార్పు రావచ్చు
అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పరిస్థితిని నెలరోజుల పాటు పరిశీలించి రెండు రోజుల కిందటే హైదరాబాద్ వచ్చా. అక్కడి ఆర్థిక సంక్షోభం ప్రభావం ఐటీ కంపెనీలపైనా పడింది. అవి మొదట్లో వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడు తీసివేతలు చాలావరకు ఆగినా కొత్త ఉద్యోగులను అతి తక్కువ సంఖ్యలోనే తీసుకుంటున్నాయి. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా పడింది. వేల మంది ఓపీటీపైనే ఉన్నారు. ఈ ఏడాది చివరికి.. లేదా వచ్చే ఏడాది మధ్య నాటికి పరిస్థితిలో మార్పు రావచ్చు.
ఆలపాటి శుభకర్, గ్లోబల్ ట్రీ కెరియర్స్ కన్సల్టెన్సీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు. -
మౌంటైన్ హౌస్లో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ..
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అద్భుతమైన విజయం సాధించింది. -
న్యూయార్క్లో ఘనంగా కూటమి సంబరాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్లో ఈ ప్రజావిజయాన్ని ప్రవాసులు ఘనంగా నిర్వహించారు. -
అట్లాంటాలో కూటమి విజయదరహాసం.. రామోజీరావుకు ఘన నివాళి
అమెరికాలోని అట్లాంటా మహానగరంలో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు కలిసి ప్రజా విజయం పేరిట విజయగర్జన వేడుకలు నిర్వహించారు. -
అమెరికాలోని ఫీనిక్స్లో ‘ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్’ ప్రారంభం
అమెరికాలో ప్రవాసాంధ్రుల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రోత్సహించి బలమైన సామాజిక భావనను పెంపొందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA)ను ఏర్పాటు చేశారు. -
కూటమి సునామి వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎన్నారై తెదేపా టంపా టీమ్
ఏపీలో కూటమి సునామి వేడుకలను ‘ఎన్నారై తెదేపా టంపా టీమ్’ ఘనంగా నిర్వహించింది. టంపాలోని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 250 మంది సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఏపీలో కూటమి ప్రభుత్వం.. మిన్నెసోటాలో ఎన్నారైల సంబరాలు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అద్భుత విజయం సాధించడం సహా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కూటమి ఎన్నారై కార్యకర్తలు ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు.
-
ఘనంగా ‘తెలుగు టైమ్స్బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల’ వేడుక
Telugu Times Business Excellence Awards 2024: ఎన్నారై తెలుగు బిజినెస్ కమ్యూనిటీ సేవలను గుర్తించి, వారిని అవార్డులతో సత్కరించడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడమే ‘తెలుగు టైమ్స్’ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల ముఖ్య ఉద్దేశం -
డాలస్లో పద్మవిభూషణ్ రామోజీరావుకు ఘన నివాళి
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, అక్షర యోధుడు, పద్మవిభూషణ్ రామోజీరావుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. -
రాయల్ ఆస్కాట్లో అబ్బురపరిచిన రేసు గుర్రాలు
బ్రిటన్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన రాయల్ ఆస్కాట్ రేస్ కోర్స్లో గుర్రపు పందేలు అబ్బుర పరుస్తున్నాయి. -
కొలంబియా నగరంలో కొలువు తీరిన దశావతార వేంకటేశ్వరుడు
అమెరికా సౌత్ కరోలినాలోని కొలంబియా నగరంలో దశావతార వేంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. -
మిన్నియాపోలిస్లో మిన్నంటిన ఎన్డీయే కూటమి విజయోత్సవ సంబరాలు
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అఖండ విజయంతో అమెరికాలోని ఎన్నారైలు సంబరాలు చేసుకొంటున్నారు. -
భారత దేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతార
భారతదేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతారగా ఎప్పటికీ గుర్తుంటారని పలువురు వక్తలు ప్రశంసించారు. -
కూటమి విజయంపై అమెరికాలో సంబరాలు
ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం సాధించడం, సీఎంగా చంద్రబాబు...పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించడంపై అమెరికాలోని ప్రవాసాంధ్రులు వేడుకలు చేసుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
హిమాచల్ను ముంచెత్తుతున్న వర్షాలు.. ధర్మశాలలో 214.6మి.మీ వర్షపాతం
-
తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష
-
ఆసియా కప్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
-
ఓటీటీలో ఫహద్ ఫాజిల్ ‘ధూమం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!
-
కమిటీల ద్వారా విభజన సమస్యలకు పరిష్కార మార్గాలు: భట్టి విక్రమార్క