- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Telugu Times Business Excellence Awards 2024: ఘనంగా ‘తెలుగు టైమ్స్బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల’ వేడుక
Telugu Times Business Excellence Awards 2024: ఎన్నారై తెలుగు బిజినెస్ కమ్యూనిటీ సేవలను గుర్తించి, వారిని అవార్డులతో సత్కరించడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడమే ‘తెలుగు టైమ్స్’ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల ముఖ్య ఉద్దేశం
గత 21 ఏళ్లుగా అమెరికాలోని తెలుగువారికి మీడియాపరంగా సేవలందిస్తోంది ‘తెలుగు టైమ్స్’. గతేడాది నుంచి తెలుగు బిజినెస్మెన్లను అవార్డులతో (Telugu Times Business Excellence Awards 2024) సత్కరించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. ఎన్నారై తెలుగు బిజినెస్ కమ్యూనిటీ సేవలను గుర్తించి, వారిని అవార్డులతో సత్కరించడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశమని తెలుగు టైమ్స్ ఎడిటర్, సీఈవో చెన్నూరి వెంకట సుబ్బారావు అన్నారు. జూన్ 16న డల్లాస్ వేదికగా జరిగిన ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో తెలుగువారు హాజరయ్యారు. అమెరికా, ఇండియా జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన కార్యక్రమంలో తెలుగు టైమ్స్ పత్రికను ప్రారంభించడం వెనుక ఉన్న నేపథ్యాన్ని ఎడిటర్, సీఈవో చెన్నూరి వెంకట సుబ్బారావు వివరించారు.
తానా మాజీ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. తెలుగు టైమ్స్, చెన్నూరి వెంకట సుబ్బారావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం వేడుకలకు హాజరైన ప్లానో మేయర్ జాన్ బి.మున్స్ ఇర్వింగ్, ఫ్రిస్కో సిటీ నుంచి వచ్చిన అధికారులను ఆహ్వానించి వారిని పరిచయం చేశారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా వచ్చిన భారత కాన్సుల్ జనరల్, డి.సి.మంజునాథ్ను నీల్ గొనుగొంట్ల వేదికపైకి ఆహ్వానించారు. వ్యాపార రంగంలో తెలుగువాళ్లు చేస్తున్న కృషిని భారత కాన్సుల్ జనరల్ డి.సి. మంజునాథ్ ప్రశంసించారు. విప్రోలో ఎంటర్ప్రైజ్ ఫ్యూచరింగ్కి ప్రెసిడెంట్గా ఉన్న ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ నాగేంద్ర బండారు కీ నోట్ స్పీకర్గా హాజరై మాట్లాడారు. గ్రోత్ ఈక్విటీ హెడ్ రాజా దొడ్డాల గౌరవ అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా పలు అంశాలపై వక్తలు ప్రసంగించారు. ఈ చర్చా కార్యక్రమానికి పర్యవేక్షకుడిగా ఇంటెల్ సాఫ్ట్ టెక్నాలజీస్ సీఈవో సతీష్ మండవ వ్యవహరించారు. యూఎస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ (డీఎఫ్డబ్ల్యూ)కు చెందిన నీలిమ గొనుగుంట్ల, నాట్స్ మాజీ ప్రెసిడెంట్ బాపయ్య నూతి, నాటా మాజీ ప్రెసిడెంట్ శ్రీధర్రెడ్డి కొర్సపాటి తదితరులు పాల్గొన్నారు. నాగేంద్ర బండారు స్పాన్సర్లకు, పార్టనర్లకు జ్ఞాపికలను అందజేశారు. సురేష్ మండవ, సతీష్ బండారు (టాంటెక్స్), శ్రీధర్ బెండపూడి (ఐటీ బ్లూబర్డ్), శేషు కల్రా (సాఫ్ట్ కీస్ ఇంక్), వెంకటేశ్వర చిన్ని (పెలికాన్ వ్యాలీ), కృష్ణ కోరాడ (అప్లాజ్) తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. తెలుగు టైమ్స్ డైరెక్టర్ సీవీబీ కృష్ణ వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు. శ్రావ్య వేములపాటి చెన్నూరి తన యాంకరింగ్తో అందర్నీ ఆకట్టుకున్నారు.
- అవార్డు గ్రహీతల వివరాలివే
- ఐటీ సర్వీసెస్ విభాగం - శ్రీకాంత్ గడ్డం, ప్రెసిడెంట్, ఈఆర్పీఏ (కొలంబస్, ఒహాయో)
- హాస్పిటల్స్ అండ్ హెల్త్కేర్ విభాగం - డా. యోగి చిమట, డల్లాస్ రెనాల్ గ్రూపు (డల్లాస్)
- వెంచర్ క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ - దయాకర్ పుష్కర్, సీఈవో-డల్లాస్ వెంచర్ క్యాపిటల్ (డల్లాస్)
- కమ్యూనిటీ సర్వీసెస్ - బాల ఇందుర్తి, ప్రెసిడెంట్, శంకర నేత్రాలయ (యూఎస్ఏ)
- సినిమా అండ్ ఎంటర్టైన్మెంట్ విభాగం - అనిల్ సుంకర, నిర్మాత, ఏకే ఎంటర్టైన్మెంట్స్, డల్లాస్
- ఐటీ ప్రొడక్ట్ అండ్ డెవలప్మెంట్ విభాగం - కిరణ్ పాశం, ప్రెసిడెంట్-ఫ్లాష్ బిఐ, అట్లాంటా
- లీగల్ సర్వీసెస్ విభాగం - గీత దమ్మన, అటార్నీ దమ్మన లా (డల్లాస్)
- రియల్ ఎస్టేట్ అండ్ ల్యాండ్ డెవలప్మెంట్ - విజయ్ బొర్రా, డీఎఫ్డబ్ల్యూ ల్యాండ్
- హోటల్-రెస్టారెంట్ విభాగం - రమేష్ గాదిరాజు, ఎ2బి స్వీట్స్ అండ్ రెస్టారెంట్స్
- ఐటీ స్టాపింగ్ - మహేశ్వర్ కాసా, ప్రెసిడెంట్, కెకె సాఫ్ట్వేర్ అసోసియేట్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు. -
మౌంటైన్ హౌస్లో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ..
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అద్భుతమైన విజయం సాధించింది. -
న్యూయార్క్లో ఘనంగా కూటమి సంబరాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్లో ఈ ప్రజావిజయాన్ని ప్రవాసులు ఘనంగా నిర్వహించారు. -
అట్లాంటాలో కూటమి విజయదరహాసం.. రామోజీరావుకు ఘన నివాళి
అమెరికాలోని అట్లాంటా మహానగరంలో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు కలిసి ప్రజా విజయం పేరిట విజయగర్జన వేడుకలు నిర్వహించారు. -
అగ్రరాజ్యంలో కొలువుల సంక్షోభం..!
తెలంగాణకు చెందిన వెంకట్ ఆరేళ్ల క్రితం ఓ ప్రముఖ ఐఐటీలో ఇంజినీరింగ్ చేశారు. అనంతరం అమెరికాలో ఎంఎస్ చేసి, అక్కడే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. -
అమెరికాలోని ఫీనిక్స్లో ‘ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్’ ప్రారంభం
అమెరికాలో ప్రవాసాంధ్రుల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రోత్సహించి బలమైన సామాజిక భావనను పెంపొందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA)ను ఏర్పాటు చేశారు. -
కూటమి సునామి వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎన్నారై తెదేపా టంపా టీమ్
ఏపీలో కూటమి సునామి వేడుకలను ‘ఎన్నారై తెదేపా టంపా టీమ్’ ఘనంగా నిర్వహించింది. టంపాలోని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 250 మంది సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఏపీలో కూటమి ప్రభుత్వం.. మిన్నెసోటాలో ఎన్నారైల సంబరాలు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అద్భుత విజయం సాధించడం సహా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కూటమి ఎన్నారై కార్యకర్తలు ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు.
-
డాలస్లో పద్మవిభూషణ్ రామోజీరావుకు ఘన నివాళి
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, అక్షర యోధుడు, పద్మవిభూషణ్ రామోజీరావుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. -
రాయల్ ఆస్కాట్లో అబ్బురపరిచిన రేసు గుర్రాలు
బ్రిటన్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన రాయల్ ఆస్కాట్ రేస్ కోర్స్లో గుర్రపు పందేలు అబ్బుర పరుస్తున్నాయి. -
కొలంబియా నగరంలో కొలువు తీరిన దశావతార వేంకటేశ్వరుడు
అమెరికా సౌత్ కరోలినాలోని కొలంబియా నగరంలో దశావతార వేంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. -
మిన్నియాపోలిస్లో మిన్నంటిన ఎన్డీయే కూటమి విజయోత్సవ సంబరాలు
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అఖండ విజయంతో అమెరికాలోని ఎన్నారైలు సంబరాలు చేసుకొంటున్నారు. -
భారత దేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతార
భారతదేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతారగా ఎప్పటికీ గుర్తుంటారని పలువురు వక్తలు ప్రశంసించారు. -
కూటమి విజయంపై అమెరికాలో సంబరాలు
ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం సాధించడం, సీఎంగా చంద్రబాబు...పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించడంపై అమెరికాలోని ప్రవాసాంధ్రులు వేడుకలు చేసుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జమ్ముకశ్మీర్లో నలుగురు ఉగ్రవాదుల హతం.. అమరులైన ఇద్దరు జవాన్లు
-
హిమాచల్ను ముంచెత్తుతున్న వర్షాలు.. ధర్మశాలలో 214.6మి.మీ వర్షపాతం
-
తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష
-
ఆసియా కప్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
-
ఓటీటీలో ఫహద్ ఫాజిల్ ‘ధూమం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!