- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
NRI: ఏపీలో కూటమి విజయం.. కాలిఫోర్నియాలో మిన్నంటిన సంబరాలు
ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించడంపై ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేశారు. కాలిఫోర్నియాలో ఘనంగా సంబరాలు చేసుకున్నారు.
వాషింగ్టన్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ఘనవిజయం సాధించి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంపై విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని బే ఏరియాకు చెందిన అభిమానులు, ఆయా పార్టీల కార్యకర్తలు కాలిఫోర్నియాలో ఆదివారం సంబరాలు చేసుకున్నారు. ఫ్రీమోంట్ నగరంలోని సెంట్రల్ పార్క్ ఈ సంబరాలకు వేదికైంది.
ఎన్నారై తెదేపా అధ్యక్షులు కోమటి జయరాం పర్యవేక్షణలో పార్టీ నేత కోగంటి వెంకట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. 900కు పైగా ప్రవాసాంధ్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఏపీ బంగారు భవిష్యత్తును చంద్రబాబు తీర్చిదిద్దగలరని ఆకాంక్షించారు. మహిళలు, చిన్నారులు సైతం ఈ సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత హాప్కిన్స్ స్కూల్ నుంచి 250కి పైగా కార్లతో ర్యాలీగా సమావేశ స్థలానికి చేరుకున్నారు. కూటమి అభిమానులు 4 గంటలకు పైగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు అనుభవం, పవన్ కల్యాణ్ నిబద్ధత, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం ఏపీ భవిష్యత్తుకు ఎంతో అవసరమని నినదించారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, భాజపా శాసనసభ్యులు సుజనా చౌదరి, జనసేన శాసనసభ్యురాలు లోకం మాధవి ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాల్ ద్వారా ప్రసంగించారు. ‘‘ఏపీలో విధ్వంసకరమైన ప్రజావ్యతిరేక పాలనను అంతమొందించడంలో తెదేపా ఎన్నారై విభాగం కీలకపాత్ర పోషించడం హర్షణీయం. ఈ విజయం అందరిది. రాష్ట్రాభివృద్ధి, యువత భవిష్యత్తు, ప్రజా సంక్షేమమే చంద్రబాబుకి ముఖ్యం. రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న పోరాటంలో ఎన్నారైలు కీలక పాత్ర పోషించాలి’’ అని కోమటి జయరాం పిలుపునిచ్చారు. ‘‘ఇది ఒక చారిత్రాత్మక విజయం. ఈ విజయాన్ని ఇచ్చిన తెదేపా, జనసేన, భాజపా నాయకులకు, కార్యకర్తలకు యావత్ రాష్ట్ర ప్రజానీకం, ఎన్నారైలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా’’ అని పెమ్మసాని చంద్రశేఖర్, సుజనా చౌదరి పేర్కొన్నారు.
‘‘అవినీతి పాలనను అంతమొందించడానికి నారా లోకేష్ చేసిన యువగళం యాత్ర యువతకి స్ఫూర్తిదాయకం. ఘన విజయం సాధించేందుకు నేతలు శ్రమించారు’’ అని వెంకట్ కోగంటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్ తాడపనేని, గాంధీ పాపినేని, జగదీశ్ గింజుపల్లి, విజయ్ గుమ్మడి, వీరు ఉప్పల, విజయ ఆసూరి, రమేష్ కొండా, బాబు ప్రత్తిపాటి సమన్వయపరచగా, హరి బొప్పూడి, నరహరి, అశోక్ మైనేని, విష్ణు బూరుగుపల్లి, రాజా కొల్లి, తిరు కాకరాల, అనిల్ అరిగే, నవీన్ కొండపల్లి , ప్రసాద్ మంగిన, సీతారాం కొడాలి తదితరులు సమర్ధవంతంగా నిర్వహించారు.
చంద్ర గుంటుపల్లి, వెంకట్ జెట్టి, అడుసుమల్లి వెంకట్, శ్రీనివాస్ వీరమాచినేని, రవికిరణ్ ఆలేటి, హరి సన్నిధి, మోహన్ మల్లంపాటి, దివ్య, సునిత రాయపునేని, శిరీష నెక్కలపూడి, శైలజ వెల్లంకి, శ్రావ్య పిన్నమనేని, సిరియాలు, ప్రభ మల్లారపు, ప్రత్యూష, రూప, రుద్రాణి, లోకేష్, ముచ్చెర్ల గోపి, మురళి గొడవర్తి, రాందాస్, అనంత్, మురళి, నవీన్ కొడాలి, కృష్ణ కోగంటి, రాం భైరపునేని, శివ, హర్ష యడ్లపాటి, కృష్ణమోహన్ మట్టపర్తి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు. -
మౌంటైన్ హౌస్లో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ..
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అద్భుతమైన విజయం సాధించింది. -
న్యూయార్క్లో ఘనంగా కూటమి సంబరాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్లో ఈ ప్రజావిజయాన్ని ప్రవాసులు ఘనంగా నిర్వహించారు. -
అట్లాంటాలో కూటమి విజయదరహాసం.. రామోజీరావుకు ఘన నివాళి
అమెరికాలోని అట్లాంటా మహానగరంలో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు కలిసి ప్రజా విజయం పేరిట విజయగర్జన వేడుకలు నిర్వహించారు. -
అగ్రరాజ్యంలో కొలువుల సంక్షోభం..!
తెలంగాణకు చెందిన వెంకట్ ఆరేళ్ల క్రితం ఓ ప్రముఖ ఐఐటీలో ఇంజినీరింగ్ చేశారు. అనంతరం అమెరికాలో ఎంఎస్ చేసి, అక్కడే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. -
అమెరికాలోని ఫీనిక్స్లో ‘ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్’ ప్రారంభం
అమెరికాలో ప్రవాసాంధ్రుల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రోత్సహించి బలమైన సామాజిక భావనను పెంపొందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA)ను ఏర్పాటు చేశారు. -
కూటమి సునామి వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎన్నారై తెదేపా టంపా టీమ్
ఏపీలో కూటమి సునామి వేడుకలను ‘ఎన్నారై తెదేపా టంపా టీమ్’ ఘనంగా నిర్వహించింది. టంపాలోని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 250 మంది సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఏపీలో కూటమి ప్రభుత్వం.. మిన్నెసోటాలో ఎన్నారైల సంబరాలు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అద్భుత విజయం సాధించడం సహా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కూటమి ఎన్నారై కార్యకర్తలు ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు.
-
ఘనంగా ‘తెలుగు టైమ్స్బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల’ వేడుక
Telugu Times Business Excellence Awards 2024: ఎన్నారై తెలుగు బిజినెస్ కమ్యూనిటీ సేవలను గుర్తించి, వారిని అవార్డులతో సత్కరించడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడమే ‘తెలుగు టైమ్స్’ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల ముఖ్య ఉద్దేశం -
డాలస్లో పద్మవిభూషణ్ రామోజీరావుకు ఘన నివాళి
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, అక్షర యోధుడు, పద్మవిభూషణ్ రామోజీరావుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. -
రాయల్ ఆస్కాట్లో అబ్బురపరిచిన రేసు గుర్రాలు
బ్రిటన్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన రాయల్ ఆస్కాట్ రేస్ కోర్స్లో గుర్రపు పందేలు అబ్బుర పరుస్తున్నాయి. -
కొలంబియా నగరంలో కొలువు తీరిన దశావతార వేంకటేశ్వరుడు
అమెరికా సౌత్ కరోలినాలోని కొలంబియా నగరంలో దశావతార వేంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. -
మిన్నియాపోలిస్లో మిన్నంటిన ఎన్డీయే కూటమి విజయోత్సవ సంబరాలు
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అఖండ విజయంతో అమెరికాలోని ఎన్నారైలు సంబరాలు చేసుకొంటున్నారు. -
భారత దేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతార
భారతదేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతారగా ఎప్పటికీ గుర్తుంటారని పలువురు వక్తలు ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మీరు భలే ఉంటారు...! ఓ పోలీసు అధికారి విపరీత ప్రవర్తన
-
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై మృతి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
-
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!