- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Atlanta: అట్లాంటాలో కూటమి విజయదరహాసం.. రామోజీరావుకు ఘన నివాళి
అమెరికాలోని అట్లాంటా మహానగరంలో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు కలిసి ప్రజా విజయం పేరిట విజయగర్జన వేడుకలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికాలోని అట్లాంటా మహానగరంలో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు కలిసి ప్రజా విజయం పేరిట విజయగర్జన వేడుకలు నిర్వహించారు. జూన్ 22 శనివారం రోజున జార్జియా రాష్ట్రం అట్లాంటాలోని జేడ్ బాంక్వెట్ హాల్లో ఈ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. దాదాపు 500 కార్లతో భారీ ర్యాలీ చేపట్టారు. మూడు పార్టీల జెండాలు, కండువాలతో నినాదాలు చేశారు.
‘జై చంద్రబాబు’, ‘జై పవన్ కల్యాణ్’, ‘జై భాజపా’, ‘జయహో కూటమి’ అంటూ హోరెత్తించారు. కూటమి పార్టీల పాటలతో కొందరు కార్లపైకి ఎక్కి నినాదాలు చేశారు. తేనీటి విందు అనంతరం మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి డప్పులతో, తీన్మార్ డాన్సులతో వేదిక ప్రాంగణంలోకి ఊరేగింపుగా విచ్చేశారు. వేదిక ప్రాంగణం అంతా బ్యానర్లు, జెండాలు, కండువాలతో పసుపు, ఎరుపు రంగుల మయమైంది. ఆహ్వానితులు సైతం పసుపు, ఎరుపు రంగుల వస్త్రాల్లో రావడం విశేషం.
వ్యాఖ్యాతలు సురేశ్ పెద్ది, సురేష్ కరోతు అందరికీ స్వాగతం పలికారు. ఇండియా నుంచి విచ్చేసిన పెద్దలు, మహిళలతో జ్యోతి ప్రజ్వలన చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నారై తెదేపా అట్లాంటా నాయకులు సతీష్ ముసునూరి స్వాగతోపన్యాసం చేశారు. భారత్ నుంచి ఏపీ శాసనసభ సభ్యులు, తెదేపా, జనసేన లీడర్లు పంపిన వీడియో సందేశాలను ప్రదర్శించారు. వీరందరూ ఎన్నికల సమయంలో ఎన్నారైలు చేసిన కృషిని అభినందించారు. మున్ముందు కూడా రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు.
కూర్చోవడానికి కుర్చీలు కూడా సరిపోనంత జనం రావడం ఒక ఎత్తైతే.. నిల్చొని కూడా కార్యక్రమం ఆసాంతం తిలకించడం మరొక ఎత్తు. పసందైన విందు భోజనం అనంతరం బాణసంచా కాల్చారు. అతిథులు ఎక్కువగా వస్తారన్న అంచనాలతో 2000 మందికి సరిపడా ఏర్పాట్లు చేశారు. అట్లాంటా వాసి, అందరికీ సుపరిచితులు, గుడివాడ గడ్డపై తెలుగుదేశం జెండాని రెపరెపలాడించిన రాము వెనిగండ్ల జూమ్ మీటింగ్ ద్వారా లైవ్లోకి వచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నారైల సేవలను, ముఖ్యంగా అట్లాంటా వారి సేవలను అభినందించడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఏ సహాయం కావాలన్నా తనను సంప్రదించాలని కోరారు. తర్వాత కీ నోట్ స్పీకర్స్ మల్లిక్ మేదరమెట్ల, సురేష్ కరోతు, క్రిష్ణప్రియ తదితరులు ప్రసంగించారు. ఫుడ్ కోఆర్డినేటర్ వేణు దండా ఫుడ్ స్పాన్సర్స్ అందరినీ పేరు పేరునా అభినందించారు. తొలిసారి అట్లాంటాలోని రెస్టారెంట్స్ అన్నీ కలిసికట్టుగా ముందుకు రావడం విశేషమన్నారు. భోజనాల అనంతరం ఎన్నారై తెదేపా అట్లాంటా టీం, జనసేన నాయకులు కూటమి కేక్ కట్ చేసి అందరికీ పంచారు.
రామోజీరావుకు ఘన నివాళి
మీడియా మొఘల్, అక్షరాన్నే ఆయుధంగా మార్చిన యోధుడు, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీ రావుకు ఈ కార్యక్రమంలో ఘన నివాళులు అర్పించారు. ఆయన తెలుగు జాతికి చేసిన సేవలను స్మరించుకుని పలువురు సందేశం ఇచ్చారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు. -
మౌంటైన్ హౌస్లో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ..
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అద్భుతమైన విజయం సాధించింది. -
న్యూయార్క్లో ఘనంగా కూటమి సంబరాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్లో ఈ ప్రజావిజయాన్ని ప్రవాసులు ఘనంగా నిర్వహించారు. -
అగ్రరాజ్యంలో కొలువుల సంక్షోభం..!
తెలంగాణకు చెందిన వెంకట్ ఆరేళ్ల క్రితం ఓ ప్రముఖ ఐఐటీలో ఇంజినీరింగ్ చేశారు. అనంతరం అమెరికాలో ఎంఎస్ చేసి, అక్కడే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. -
అమెరికాలోని ఫీనిక్స్లో ‘ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్’ ప్రారంభం
అమెరికాలో ప్రవాసాంధ్రుల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రోత్సహించి బలమైన సామాజిక భావనను పెంపొందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA)ను ఏర్పాటు చేశారు. -
కూటమి సునామి వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎన్నారై తెదేపా టంపా టీమ్
ఏపీలో కూటమి సునామి వేడుకలను ‘ఎన్నారై తెదేపా టంపా టీమ్’ ఘనంగా నిర్వహించింది. టంపాలోని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 250 మంది సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఏపీలో కూటమి ప్రభుత్వం.. మిన్నెసోటాలో ఎన్నారైల సంబరాలు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అద్భుత విజయం సాధించడం సహా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కూటమి ఎన్నారై కార్యకర్తలు ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు.
-
ఘనంగా ‘తెలుగు టైమ్స్బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల’ వేడుక
Telugu Times Business Excellence Awards 2024: ఎన్నారై తెలుగు బిజినెస్ కమ్యూనిటీ సేవలను గుర్తించి, వారిని అవార్డులతో సత్కరించడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడమే ‘తెలుగు టైమ్స్’ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల ముఖ్య ఉద్దేశం -
డాలస్లో పద్మవిభూషణ్ రామోజీరావుకు ఘన నివాళి
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, అక్షర యోధుడు, పద్మవిభూషణ్ రామోజీరావుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. -
రాయల్ ఆస్కాట్లో అబ్బురపరిచిన రేసు గుర్రాలు
బ్రిటన్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన రాయల్ ఆస్కాట్ రేస్ కోర్స్లో గుర్రపు పందేలు అబ్బుర పరుస్తున్నాయి. -
కొలంబియా నగరంలో కొలువు తీరిన దశావతార వేంకటేశ్వరుడు
అమెరికా సౌత్ కరోలినాలోని కొలంబియా నగరంలో దశావతార వేంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. -
మిన్నియాపోలిస్లో మిన్నంటిన ఎన్డీయే కూటమి విజయోత్సవ సంబరాలు
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అఖండ విజయంతో అమెరికాలోని ఎన్నారైలు సంబరాలు చేసుకొంటున్నారు. -
భారత దేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతార
భారతదేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతారగా ఎప్పటికీ గుర్తుంటారని పలువురు వక్తలు ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జగన్నాథుడి రథయాత్ర.. కిక్కిరిసిన పూరీ వీధులు
-
మైనర్ల చేతిలో అశ్లీల కంటెంట్.. అడ్డుకట్టకు స్పెయిన్ వినూత్న ఆలోచన!
-
‘భారతీయుడు 2’.. నేను అలా అనలేదు: కమల్ హాసన్ క్లారిటీ
-
అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో పేలిన బాయిలర్.. 20 మందికి గాయాలు
-
ప్లేయర్ల ప్రైవసీ కోసం వింబుల్డన్లో తొలిసారి ‘AI’
-
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు: సీఎం రేవంత్రెడ్డి