- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Ramoji Rao: డాలస్లో పద్మవిభూషణ్ రామోజీరావుకు ఘన నివాళి
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, అక్షర యోధుడు, పద్మవిభూషణ్ రామోజీరావుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
డాలస్, టెక్సాస్: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, అక్షర యోధుడు, పద్మవిభూషణ్ రామోజీరావుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. డాలస్లో ఏర్పాటుచేసిన సంతాప కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరైన ప్రవాసాంధ్రులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వివిధ రంగాల్లో ఆయన అందించిన విశేష సేవల్ని స్మరించుకున్నారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. ‘‘రామోజీరావు ఒక విశిష్టమైన వ్యక్తి. ఏ రంగంపై ఆయన దృష్టిపెట్టినా అందులో పూర్తిగా నిమగ్నమయ్యేవారు. ప్రతిభకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. వ్యక్తిగతంగా ఆయనతో అనేక అనుభవాలున్నాయి. తెలుగు భాష అంటే ఆయనకు ప్రాణం. సంగీత, సాహిత్య వికాసం కోసం నిరంతరం కృషి చేసిన కృషీవలుడు. చివరకు మరణాన్ని సైతం చిరునవ్వుతో ఆహ్వానించిన ధీరోదాత్తుడు” అని కొనియాడారు.
తానా పూర్వ అధ్యక్షులు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఒక చిన్న గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఎవరూ ఊహించలేనంత ఎత్తుకు ఎదిగిన రామోజీరావు జీవితం కేవలం తెలుగువారికే కాకుండా విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఒక సందర్భంలో రామోజీరావును ప్రత్యేకంగా కలిసి గంటకు పైగా ఆయనతో జరిపిన సంభాషణ తన జీవితంలోనే ఒక మధురమైన అనుభూతి అని గుర్తు చేసుకున్నారు. రామోజీరావు జీవన ప్రస్థానంలో సాగిన కృషి, పట్టుదల, క్రమశిక్షణ, దూరదృష్టి తరతరాలకు ఆదర్శప్రాయమన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తలవంచకుండా ధైర్యంగా ఎదుర్కొన్నారని, ఆశయ సాధనే లక్ష్యంగా ఆయన పని తీరు అన్నిరంగాల వారికీ అనుసరణీయమన్నారు.
రామోజీరావుకు నివాళులర్పించేందుకు ఏర్పాటుచేసిన సభలో తనికెళ్ళ భరణి, కళారత్న కేవీ సత్యనారాయణ, సుప్రసిద్ధ కవి డా.వడ్డేపల్లి కృష్ణ, ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య, రచయిత సాయి లక్కరాజు, ఆధ్యాత్మికవేత్త శ్రీనివాస చక్రవర్తి తట్టా, ప్రముఖ కళాకారుడు చంద్రశేఖర్, తేజస్వి సుధాకర్ ప్రత్యేకంగా విచ్చేశారు. వీరితో పాటు తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, టాంటెక్స్ అధ్యక్షులు సతీష్ బండారు, టాంటెక్స్ పాలకమండలి అధిపతి సురేష్ మండువ, టాంటెక్స్ తెలుగు సాహిత్యవేదిక సమన్వయకర్త దయాకర్ మాడా, వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు - చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, మాధవి లోకిరెడ్డి, దీపికా రెడ్డి, అర్పితా రెడ్డి, కళ్యాణి తాడిమేటి, చైతన్య రెడ్డి గాదె, రఘునాథ రెడ్డి, నరసింహ పోపూరి, వీర లెనిన్ తుళ్ళూరి, శ్రీకాంత్ పోలవరపు, శ్రీనాథ్ వట్టం, ప్రవీణ్ బిల్లా, మురళీ వెన్నం, పరమేష్ దేవినేని, సుబ్బు జొన్నలగడ్డ, అనంత్ మల్లవరపు, శారద సింగిరెడ్డి, లెనిన్ వేముల, డా. ఊరిమిండి నరసింహారెడ్డి, ఎం.వి.ఎల్ ప్రసాద్, డా.పూదూర్ జగదీశ్వరన్, డా. పులిగండ్ల విశ్వనాథం, డా. రమణ జువ్వాడి, చంద్రహాస్ మద్దుకూరి తదితరులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు. -
మౌంటైన్ హౌస్లో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ..
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అద్భుతమైన విజయం సాధించింది. -
న్యూయార్క్లో ఘనంగా కూటమి సంబరాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్లో ఈ ప్రజావిజయాన్ని ప్రవాసులు ఘనంగా నిర్వహించారు. -
అట్లాంటాలో కూటమి విజయదరహాసం.. రామోజీరావుకు ఘన నివాళి
అమెరికాలోని అట్లాంటా మహానగరంలో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు కలిసి ప్రజా విజయం పేరిట విజయగర్జన వేడుకలు నిర్వహించారు. -
అగ్రరాజ్యంలో కొలువుల సంక్షోభం..!
తెలంగాణకు చెందిన వెంకట్ ఆరేళ్ల క్రితం ఓ ప్రముఖ ఐఐటీలో ఇంజినీరింగ్ చేశారు. అనంతరం అమెరికాలో ఎంఎస్ చేసి, అక్కడే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. -
అమెరికాలోని ఫీనిక్స్లో ‘ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్’ ప్రారంభం
అమెరికాలో ప్రవాసాంధ్రుల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రోత్సహించి బలమైన సామాజిక భావనను పెంపొందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA)ను ఏర్పాటు చేశారు. -
కూటమి సునామి వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎన్నారై తెదేపా టంపా టీమ్
ఏపీలో కూటమి సునామి వేడుకలను ‘ఎన్నారై తెదేపా టంపా టీమ్’ ఘనంగా నిర్వహించింది. టంపాలోని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 250 మంది సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఏపీలో కూటమి ప్రభుత్వం.. మిన్నెసోటాలో ఎన్నారైల సంబరాలు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అద్భుత విజయం సాధించడం సహా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కూటమి ఎన్నారై కార్యకర్తలు ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు.
-
ఘనంగా ‘తెలుగు టైమ్స్బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల’ వేడుక
Telugu Times Business Excellence Awards 2024: ఎన్నారై తెలుగు బిజినెస్ కమ్యూనిటీ సేవలను గుర్తించి, వారిని అవార్డులతో సత్కరించడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడమే ‘తెలుగు టైమ్స్’ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల ముఖ్య ఉద్దేశం -
రాయల్ ఆస్కాట్లో అబ్బురపరిచిన రేసు గుర్రాలు
బ్రిటన్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన రాయల్ ఆస్కాట్ రేస్ కోర్స్లో గుర్రపు పందేలు అబ్బుర పరుస్తున్నాయి. -
కొలంబియా నగరంలో కొలువు తీరిన దశావతార వేంకటేశ్వరుడు
అమెరికా సౌత్ కరోలినాలోని కొలంబియా నగరంలో దశావతార వేంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. -
మిన్నియాపోలిస్లో మిన్నంటిన ఎన్డీయే కూటమి విజయోత్సవ సంబరాలు
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అఖండ విజయంతో అమెరికాలోని ఎన్నారైలు సంబరాలు చేసుకొంటున్నారు. -
భారత దేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతార
భారతదేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతారగా ఎప్పటికీ గుర్తుంటారని పలువురు వక్తలు ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జనాల గురించే ‘భారతీయుడు 2’ మాట్లాడుతుంది.. కమల్ హాసన్
-
ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి మళ్లీ పరీక్ష - ఎన్టీఏ
-
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి తుమ్మల
-
వాస్తవాన్ని గుర్తించండి.. రాహుల్కు కేంద్రమంత్రి సింధియా చురక!
-
వరుణుడి ఆటంకం.. భారత్- దక్షిణాఫ్రికా రెండో టీ20 రద్దు
-
6 సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించిన సీఎం రేవంత్రెడ్డి