- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
మౌంటైన్ హౌస్లో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ..
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అద్భుతమైన విజయం సాధించింది.
మౌంటైన్హౌస్: ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అద్భుతమైన విజయం సాధించింది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాలిఫోర్నియా రాష్ట్ర నగరమైన మౌంటైన్హౌస్లోని ఎన్నారై తెదేపా, జనసేన, భాజపా నాయకులు విజయోత్సవ వేడుకలను జూన్ 23న ఘనంగా నిర్వహించారు.
ఎన్నారై తెలుగుదేశం అధ్యక్షుడు కోమటి జయరాం పర్యవేక్షణలో స్థానిక నేతలు శ్రీకాంత్ దొడ్డపనేని, భక్తా బల్లా, చంద్ర గుంటుపల్లి, వెంకట్ అడుసుమల్లి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 500 మందికి పైగా కూటమి అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. హాన్సెన్ పాఠశాల ప్రాంగణం నుంచి 100కు పైగా కార్లతో భారీ ఊరేగింపుగా సమావేశ స్థలానికి ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, భాజపా పతాకాలతో అలంకరించిన కార్లతో 8 మైళ్ల మేర కోలాహలంగా సాగిన ఈ ర్యాలీ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.
ఎన్నారై తెలుగుదేశం అధ్యక్షుడు కోమటి జయరాం, ప్రముఖ సినీ నటుడు శివాజీ, తెలుగుదేశం ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాల్ ద్వారా ప్రసంగించారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎన్నారైలు తమ మూలాలు మర్చిపోకుండా రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించి చేసిన కృషిని అభినందించారు. సభకు హాజరైన కందుకూరు మాజీ శాసనసభ్యులు దివి శివరాం.. ఎన్టీఆర్ ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్ర పురోగతికి దోహదం చేస్తాయని వివరించారు.
ఈ కార్యక్రమాన్ని శశి దొప్పలపూడి, శ్రీనివాస్ తాడపనేని, శ్రీహర్ష యడ్లపాటి, వెంకట్ జెట్టి, లియోన్ బోయపాటి, శ్రీనివాస్ వీరమాచినేని, సుధీర్ ఉన్నం, శ్రీకర్ రెడ్డి భవనం, కృష్ణమోహన్ మట్టపర్తి, భాస్కర్ వల్లభనేని, సుబ్బా యంత్ర, వీరు ఉప్పల, విజయ్ గుమ్మడి, రవికిరణ్ ఆలేటి, హరి సన్నిధి, సురేష్ ద్రోణవల్లి, నాగేశ్వర రావు వెనిగళ్ల, రాజేష్ పర్వతనేని, రజనీకాంత్ కాకర్ల, సీతారాం కొడాలి, శ్రీనివాస్ వీరమళ్ల, కల్యాణ్ కోట, లక్ష్మణ్ పరుచూరి, స్వరూప్ వాసిరెడ్డి, సతీష్ బోళ్ల, కార్తీక్ లేళ్ల, సందీప్ ఇంటూరి, వెంకట్ కోగంటి (బిర్యాని జంక్షన్), మధు (బిర్యాని జంక్షన్), రాజశేఖర్ (బిర్యాని జంక్షన్), సాయి కంభంపాటి, భాస్కర్ మొలకలపల్లి, ప్రకాష్ మద్దిపాటి, నవీన్ కొడాలి తదితరులు సమన్వయపరిచారు. ఈ కార్యక్రమానికి మురళి గొడవర్తి, శ్రీనివాస్ గొడవర్తి సాంకేతిక సహకారం అందించారు. హరి బడుగు, హారిక బడుగులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. భీమవరం రుచులు, బిర్యాని జంక్షన్, మిస్టర్ బిర్యాని, ఫ్లయింగ్ ఇడ్లీస్, సావిస్ ఇండియన్ గ్రోసరీస్ సంస్థలు ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ పసందైన భోజనం సమకూర్చాయి. కార్యక్రమ నిర్వాహకులు శ్రీకాంత్ దొడ్డపనేని, భక్తా బల్లా, చంద్ర గుంటుపల్లి, వెంకట్ అడుసుమల్లి కార్యక్రమం విజయవంతమవ్వడానికి కృషిచేసిన వాలంటీర్లకు, స్పాన్సరర్లకు ధన్యవాదాలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు. -
న్యూయార్క్లో ఘనంగా కూటమి సంబరాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్లో ఈ ప్రజావిజయాన్ని ప్రవాసులు ఘనంగా నిర్వహించారు. -
అట్లాంటాలో కూటమి విజయదరహాసం.. రామోజీరావుకు ఘన నివాళి
అమెరికాలోని అట్లాంటా మహానగరంలో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు కలిసి ప్రజా విజయం పేరిట విజయగర్జన వేడుకలు నిర్వహించారు. -
అగ్రరాజ్యంలో కొలువుల సంక్షోభం..!
తెలంగాణకు చెందిన వెంకట్ ఆరేళ్ల క్రితం ఓ ప్రముఖ ఐఐటీలో ఇంజినీరింగ్ చేశారు. అనంతరం అమెరికాలో ఎంఎస్ చేసి, అక్కడే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. -
అమెరికాలోని ఫీనిక్స్లో ‘ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్’ ప్రారంభం
అమెరికాలో ప్రవాసాంధ్రుల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రోత్సహించి బలమైన సామాజిక భావనను పెంపొందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA)ను ఏర్పాటు చేశారు. -
కూటమి సునామి వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎన్నారై తెదేపా టంపా టీమ్
ఏపీలో కూటమి సునామి వేడుకలను ‘ఎన్నారై తెదేపా టంపా టీమ్’ ఘనంగా నిర్వహించింది. టంపాలోని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 250 మంది సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఏపీలో కూటమి ప్రభుత్వం.. మిన్నెసోటాలో ఎన్నారైల సంబరాలు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అద్భుత విజయం సాధించడం సహా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కూటమి ఎన్నారై కార్యకర్తలు ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు.
-
ఘనంగా ‘తెలుగు టైమ్స్బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల’ వేడుక
Telugu Times Business Excellence Awards 2024: ఎన్నారై తెలుగు బిజినెస్ కమ్యూనిటీ సేవలను గుర్తించి, వారిని అవార్డులతో సత్కరించడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడమే ‘తెలుగు టైమ్స్’ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల ముఖ్య ఉద్దేశం -
డాలస్లో పద్మవిభూషణ్ రామోజీరావుకు ఘన నివాళి
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, అక్షర యోధుడు, పద్మవిభూషణ్ రామోజీరావుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. -
రాయల్ ఆస్కాట్లో అబ్బురపరిచిన రేసు గుర్రాలు
బ్రిటన్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన రాయల్ ఆస్కాట్ రేస్ కోర్స్లో గుర్రపు పందేలు అబ్బుర పరుస్తున్నాయి. -
కొలంబియా నగరంలో కొలువు తీరిన దశావతార వేంకటేశ్వరుడు
అమెరికా సౌత్ కరోలినాలోని కొలంబియా నగరంలో దశావతార వేంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. -
మిన్నియాపోలిస్లో మిన్నంటిన ఎన్డీయే కూటమి విజయోత్సవ సంబరాలు
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అఖండ విజయంతో అమెరికాలోని ఎన్నారైలు సంబరాలు చేసుకొంటున్నారు. -
భారత దేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతార
భారతదేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతారగా ఎప్పటికీ గుర్తుంటారని పలువురు వక్తలు ప్రశంసించారు.