- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Dashavatara Venkateswara swamy: కొలంబియా నగరంలో కొలువు తీరిన దశావతార వేంకటేశ్వరుడు
అమెరికా సౌత్ కరోలినాలోని కొలంబియా నగరంలో దశావతార వేంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
అమెరికా: సౌత్ కరోలినా రాష్ట్రంలోని కొలంబియా నగరంలో దశావతార వేంకటేశ్వర స్వామి కొలువుదీరారు. ఈనెల 14 నుంచి 16 తేదీల మధ్య స్థానిక వెంకటేశ్వర ఆలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి రెండు రోజుల్లో అంకురార్పణ, సంకల్పం, జలాధివాసం, భూమిపూజ, విష్ణు సహస్రనామ హోమం, శ్రీ దశావతార హోమం, పుష్పాధివాసం నిర్వహించారు. మూడో రోజు ఆరు అడుగుల స్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. అదేరోజు స్వామి వారి కళ్యాణం, రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తులకు కనులవిందుగా నిలిచింది. విద్వాన్ శ్రీ శ్రీధర శ్రీనివాస భట్టాచార్య, శ్రీ మధుగిరి రాఘవ శ్రీనివాస నారాయణ భట్టార్ల ఆధ్వర్యంలో పదకొండు మంది ఋత్వికుల సమక్షంలో శాస్త్రోక్తంగా, నిర్విఘ్నంగా చేపట్టారు.
ఈ కార్యక్రమం కోసం సుమారు 70 మంది వలంటీర్లు నెలరోజుల పాటు నిర్విరామంగా కృషి చేశారు. ప్రతిరోజూ అనేక వందలమంది భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన వి.మురళి నేతృత్వంలో ముగ్గురు విద్వాంసులతో కూడిన నాదస్వర బృందం కార్యక్రమం ఆసాంతం చక్కని సంగీతంతో అలరించారు. అట్లాంటా నుంచి వచ్చిన రామకృష్ణ దంపతులు సాంప్రదాయక, రుచికర భోజనాలు వండిపెట్టారు. చివరి రోజున ఋత్వికులను, వలంటీర్లను నిర్వాహకులు సత్కరించారు. బాలబాలికల కోసం నిర్వహించిన దశావతార క్విజ్లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించారు.
ఈ సందర్భంగా, ధర్మకర్తల మండలి అధ్యక్షులు సత్య శ్రీనివాస దాస కడాలి మాట్లాడారు. మత్స్య, కూర్మ, వరాహ ,వామన, నరసింహ, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీ కృష్ణ, కల్కి, శ్రీ వెంకటేశ్వర రూప అంశలతో కూడిన శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి విగ్రహం అమెరికాలో మొదటిది, ప్రపంచంలోనే రెండవదని అన్నారు. ఈ విగ్రహం ఎంత వైవిధ్యమో, అంతే విధంగా దాదాపు రెండు వేలమందికి విగ్రహ ప్రతిష్ఠాపన ఆహ్వానం, స్వామి వారి అక్షింతలను వాలంటీర్ల సహాయంతో ఇళ్లకు వెళ్లి ఇచ్చి ఆహ్వానించామన్నారు. శ్రీ దశావతార వెంకటేశ్వర దేవస్థానం ఇక నుంచి ఒక పుణ్య తీర్థంగా రూపొంది, అమెరికా నలుమూలల నుంచి భక్తులను ఆకర్షిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర ఆలయ ధర్మకర్తలు డాక్టర్.లక్ష్మణ్ రావు ఒద్దిరాజు, డా. అమర్నాథ్, ఆనంద్ పాడిరెడ్డి, శరత్ గొర్రెపాటి తదితరులు ఈ కార్యక్రమన్ని విజయవంతం చేసిన భక్తులకు, వలంటీర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం బాలాలయంగా ఉన్న ఈ దేవస్థానం, ప్రపంచమంతటా ఉన్న స్వామివారి భక్తుల సహాయ సహకారాలతో త్వరలో పూర్తి స్థాయి ఆలయంగా మారటానికి కావలసిన హంగులన్నీ సమకూర్చుకోవాలని, సరికొత్త ప్రాంగణంలో శోభాయమానంగా రూపొందాలని స్థానిక భారతీయులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు. -
మౌంటైన్ హౌస్లో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ..
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అద్భుతమైన విజయం సాధించింది. -
న్యూయార్క్లో ఘనంగా కూటమి సంబరాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్లో ఈ ప్రజావిజయాన్ని ప్రవాసులు ఘనంగా నిర్వహించారు. -
అట్లాంటాలో కూటమి విజయదరహాసం.. రామోజీరావుకు ఘన నివాళి
అమెరికాలోని అట్లాంటా మహానగరంలో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు కలిసి ప్రజా విజయం పేరిట విజయగర్జన వేడుకలు నిర్వహించారు. -
అగ్రరాజ్యంలో కొలువుల సంక్షోభం..!
తెలంగాణకు చెందిన వెంకట్ ఆరేళ్ల క్రితం ఓ ప్రముఖ ఐఐటీలో ఇంజినీరింగ్ చేశారు. అనంతరం అమెరికాలో ఎంఎస్ చేసి, అక్కడే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. -
అమెరికాలోని ఫీనిక్స్లో ‘ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్’ ప్రారంభం
అమెరికాలో ప్రవాసాంధ్రుల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రోత్సహించి బలమైన సామాజిక భావనను పెంపొందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA)ను ఏర్పాటు చేశారు. -
కూటమి సునామి వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎన్నారై తెదేపా టంపా టీమ్
ఏపీలో కూటమి సునామి వేడుకలను ‘ఎన్నారై తెదేపా టంపా టీమ్’ ఘనంగా నిర్వహించింది. టంపాలోని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 250 మంది సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఏపీలో కూటమి ప్రభుత్వం.. మిన్నెసోటాలో ఎన్నారైల సంబరాలు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అద్భుత విజయం సాధించడం సహా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కూటమి ఎన్నారై కార్యకర్తలు ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు.
-
ఘనంగా ‘తెలుగు టైమ్స్బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల’ వేడుక
Telugu Times Business Excellence Awards 2024: ఎన్నారై తెలుగు బిజినెస్ కమ్యూనిటీ సేవలను గుర్తించి, వారిని అవార్డులతో సత్కరించడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడమే ‘తెలుగు టైమ్స్’ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల ముఖ్య ఉద్దేశం -
డాలస్లో పద్మవిభూషణ్ రామోజీరావుకు ఘన నివాళి
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, అక్షర యోధుడు, పద్మవిభూషణ్ రామోజీరావుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. -
రాయల్ ఆస్కాట్లో అబ్బురపరిచిన రేసు గుర్రాలు
బ్రిటన్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన రాయల్ ఆస్కాట్ రేస్ కోర్స్లో గుర్రపు పందేలు అబ్బుర పరుస్తున్నాయి. -
మిన్నియాపోలిస్లో మిన్నంటిన ఎన్డీయే కూటమి విజయోత్సవ సంబరాలు
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అఖండ విజయంతో అమెరికాలోని ఎన్నారైలు సంబరాలు చేసుకొంటున్నారు. -
భారత దేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతార
భారతదేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతారగా ఎప్పటికీ గుర్తుంటారని పలువురు వక్తలు ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి మళ్లీ పరీక్ష - ఎన్టీఏ
-
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి తుమ్మల
-
వాస్తవాన్ని గుర్తించండి.. రాహుల్కు కేంద్రమంత్రి సింధియా చురక!
-
వరుణుడి ఆటంకం.. భారత్- దక్షిణాఫ్రికా రెండో టీ20 రద్దు
-
6 సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించిన సీఎం రేవంత్రెడ్డి
-
ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసు సీబీఐకి అప్పగించాలి: మాయావతి