- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Kalki 2898 AD: ‘కల్కి’ ఎవరు? ఆ అవతారం ఎప్పుడు వస్తుంది?సినిమాలో ఏం చూపించబోతున్నారు?
నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో అసలు ‘కల్కి’ అవతారం.. దాని విశేషాలు తెలుసుకుందాం.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||
‘దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ.. కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను’ అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పిన మాటలివి. మహా విష్ణువే అవతారం ధరించి ధర్మ స్థాపన చేయడానికి భువిపైకి వస్తాడని మన ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ తొమ్మిది అవతారాల్లో శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చారు. కలియుగంలో స్వామి దర్శనమిచ్చే పదో అవతారమే ‘కల్కి’. ఈ పాయింట్నే తీసుకుని దర్శకుడు నాగ్ అశ్విన్ కాస్త ఫిక్షన్ జోడించి సినిమాటిక్గా ‘కల్కి 2898 ఏడీ’ని తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది. ఈ క్రమంలో అసలు ‘కల్కి’ అవతారం గురించి మన గ్రంథాలు, ధర్మశాస్త్రాల్లో ఏం చెప్పారో చూద్దాం.
మనం కలియుగంలో ఎక్కడ ఉన్నాం?
వేదాలు, మహా భారతం, పురాణాలను అందించిన వ్యాస మహర్షి.. ‘కల్కి’ అవతారం ఎప్పుడు వస్తుంది? దానికి ముందు జరిగే పరిణామాలు ఏంటి? అన్న విషయాలను సవివరంగా చెప్పారు. ‘కల్కి’ అవతారం ఎప్పుడు వస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందుగా యుగాల గురించి తెలుసుకోవాలి. వేదాలననుసరించి యుగాలు నాలుగు. అందులో మొదటిది సత్యయుగం. దీనిని కృతయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది. ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖసంతోషాలతో గడిపారు. అకాల మరణాలుండవు. రెండోది త్రేతాయుగం.. ఈ యుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి రావణ సంహారం చేసి, ధర్మ సంస్థాపన చేశాడు. ఇందులో ధర్మం మూడు పాదాలపై నడిచింది. మూడోది ద్వాపరయుగం.. భగవంతుడు శ్రీ కృష్ణుడుగా అవతరించాడు. ఇందులో ధర్మం రెండు పాదాలపై నడిచింది. నాలుగోది ప్రస్తుతం మనం ఉన్నది కలియుగం. ఇది మొత్తం 4,32,000 సంవత్సరాలు. హిందూ, బౌద్ధ కాలమానాలకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంతం ప్రకారం.. 3102 బీసీ ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైనదని చెబుతారు. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారం చాలించడంతో ఇది మొదలైనట్లు పరిగణిస్తారు. ప్రతి యుగంలోనూ నాలుగు పాదాలుంటాయి. కలియుగంలోనూ అంతే. ప్రస్తుతం మనం ప్రథమ పాదంలో ఉన్నాం. మన నిత్య పూజా విధానంలో వచ్చే సంకల్పంలోనూ ‘కలియుగే ప్రథమ పాదే’ అని స్పష్టంగా చెప్పారు. కలియుగం చివరి పాదంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి, తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తారని వ్యాస మహర్షి చెప్పినట్లు మన గ్రంథాలు చెబుతున్నాయి.
కల్కి అవతారానికి ముందు జరిగేది ఇదే!
దశావతారాల్లో చివరిది కల్కి అవతారం. సంవత్సరాలు గడిచే కొద్దీ స్వాహాకారం, వషట్కారము వినపడవు. అంటే యజ్ఞము, యాగము అన్న క్రతువులు ఉండవు. గోవధ పెరిగిపోయి, మాంసం తినడం నిత్య కృత్యంగా మారుతుంది. వివాహ వ్యవస్థ నెమ్మదిగా కూలిపోవడం మొదలవుతుంది. తల్లిదండ్రులపై గౌరవం తగ్గిపోతుంది. వాళ్లను చూసే బాధ్యతలను పిల్లలు వదిలేస్తారు. భర్తను గౌరవించే భార్య, భార్యలను ప్రేమగా చూసుకునే భర్తలు ఉండరు. పురుషుల ఆయుర్దాయం 18 సంవత్సరాలకే పూర్తయిపోతుంది. కామ, క్రోధ లోభ, మోహ, మద, మత్సర్యాలతో మనుషులు జీవనం సాగిస్తూ ఉంటారు. మానవుడు వినియోగించే ప్రతి వస్తువు కల్తీ అయిపోతుంది. వసంత కాలంలో అకాల వర్షాల వల్ల చెట్లు, పువ్వులు, పండ్లు తగ్గిపోతాయి. ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడాల్సిన పాలకులు నిర్భయంగా దోచుకుంటారు. ప్రజలను భయపెట్టి పాలకులు బతుకుతారు. బ్రాహ్మణులు వేదాధ్యాయనాన్ని వదిలేస్తారు. ధర్మ శాస్త్రాలను, ఆచారాలను వదిలేసి, శరీర సుఖాలకు ప్రజలు అలవాటు పడతారు. పిల్లలు ఆలస్యంగా పుడతారు. దానం చేసే వాడు లేక దొంగతనాలు పెరిగిపోతాయి. తాగే నీళ్ల నుంచి.. పసిపిల్లలు తినే ఆహారం వరకూ ప్రతిదీ అమ్మకానికి పెడతారు. కలియుగం చివరి పాదంలో ధర్మం పూర్తిగా గాడితప్పిన సమయంలో శంబల అనే గ్రామంలో విష్ణుయశుడు అనే బ్రాహ్మణ కుటుంబంలో ‘కల్కి’ జన్మిస్తాడు. అదే శ్రీ మహావిష్ణువు పదో అవతారం. ఆయన అవతరించారన్నందుకు గుర్తు ఏంటంటే, పాపులందరికీ భగంధర వ్యాధి వచ్చి, రక్తం కారుతూ పురుగుల్లా రాలిపోతారు. ఎక్కడ చూసిన వ్యాధులు ప్రబలుతాయి. ప్రజలను హింసించి అధికార గర్వంతో బతుకుతున్న ప్రభువులు, పాలకులను అంతం చేయడానికి శ్వేతాశ్వాన్ని ఎక్కి, కాషాయ పతాకం ధరించి ‘కల్కి’ దుష్ట శిక్షణ చేపట్టి ధర్మ సంస్థాపన చేసి, అవతారం చాలిస్తాడు.
కల్కి కథ ఏంటో చెప్పేసిన నాగ్ అశ్విన్.. ఆ మూడు ప్రపంచాలు ఇవే!
కల్కిలో ఏం చూపించబోతున్నారు?
నాగ్ అశ్విన్ తీస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) పూర్తి ఫిక్షనల్ స్టోరీ. పురాణాల్లో ప్రాంతాలు, పాత్రలను తీసుకుని, దానికి సాంకేతికత జోడించి సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ మూవీ కథ కాశీ, కాంప్లెక్స్, శంబలా అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే సంఘర్షణతో కూడినదని ఇప్పటికే వివరించారు. అయితే, ఇందులో ‘కల్కి’ ఎవరు? కలి ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది. ప్రభాస్ (Prabhas) పాత్ర పేరు భైరవ కాగా, ప్రతినాయకుడిగా పాత్ర పోషిస్తున్న కమల్హాసన్ను (Kamal Haasan) ‘యాస్కిన్’ అని అంటున్నారు. మరోవైపు గర్భిణి అయిన సుమతి (దీపిక)ని కాపాడే బాధ్యత అశ్వత్థామ (అమితాబ్) తీసుకున్నట్లు ప్రచార చిత్రాల్లో చూపించారు. భైరవగా ఉన్న ప్రభాస్ కల్కిగా మారతాడా? సుప్రీం యాస్కిన్గా నటిస్తున్న కమల్ను కలిగా చూపించబోతున్నారా? అన్న విశేషాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హనుమాన్’తో మొదలై.. ‘కల్కి’తో ముగిసి: టాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్టు
2024లో విడుదలైన (జనవరి నుంచి జూన్ వరకు) తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ సినిమా హిట్, ఏది ఫట్ అంటే? -
అప్పుడు భయపడి.. ఇప్పుడు సినీ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకొని!
‘కల్కి 2898 ఏడీ’ గురువారం విడుదల కాబోతున్న సందర్భంగా హీరో ప్రభాస్ కెరీర్పై ప్రత్యేక కథనం.. -
రూ. 4 వేల జీతం నుంచి రూ. 600 కోట్ల ‘కల్కి’ వరకు.. నాగ్ అశ్విన్ జర్నీ ఇదీ
‘సాధారణంగా కనిపించే చాలామంది వ్యక్తుల్లో అసాధారణ ప్రతిభ ఉంటుంది’.. దర్శకుడు నాగ్ అశ్విన్ను ఉద్దేశిస్తూ నటుడు కమల్ హాసన్ చెప్పిన మాటలివి. -
ఎన్టీఆర్ పెట్టిన పేరు.. భారీ చిత్రాలకు మారుపేరు ‘వైజయంతీ మూవీస్’
Vyjayanthi Movies: భారీ అంచనాల మధ్య ప్రభాస్, నాగ్ అశ్విన్ల ‘కల్కి 2898 ఏడీ’ విడుదలవుతున్న నేపథ్యంలో ఆ సినిమాను నిర్మించిన ‘వైజయంతీ మూవీస్’ గురించి ఆసక్తికర విషయాలు.. -
ఆ తెలుగు చిత్రంలో నటించారు కానీ: దీపికా పదుకొణె గురించి మీకివి తెలుసా?
దీపికా పదుకొణె ఓ ప్రధాన పాత్ర పోషించిన ‘కల్కి 2898 ఏడీ’ గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె గురించి ప్రత్యేక కథనం.. -
‘కల్కి’లో ప్రభాస్, కమల్హాసన్ పాత్రలకు పురాణాల రిఫరెన్స్ అదేనా?
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో పాత్రలు, వాటిని ఎక్కడినుంచి తీసుకున్నారో తెలుసా? -
‘కల్కి 2898 ఏడీ’లో మలయాళ నటి.. ఎవరీ అన్నా బెన్?
‘కల్కి 2898 ఏడీ’లో కీలక పాత్ర పోషించిన అన్నా బెన్ గురించి పలు ఆసక్తికర విషయాలు.. -
కథను.. కళను నమ్మిన సంస్థే ‘ఉషా కిరణ్’.. సినీ రంగంలో రామోజీ ప్రస్థానమిది
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు నేడు తుదిశ్వాస విడిచారు. జర్నలిజం రంగంలోనే కాకుండా సినీ రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు. ఆయన నిర్మించిన ఉషా కిరణ్ మూవీస్ ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం. -
భారీ టైర్లు.. ఆరు టన్నుల బరువు.. ‘కల్కి’లో ‘బుజ్జి’ కారు విశేషాలు తెలుసా?
kalki 2898 ad: కల్కిలో బుజ్జిగా కీలక పాత్ర పోషిస్తున్న కారు గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. -
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు.. -
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!
వేర్వేరు సంవత్సరాల్లో మే 9న విడుదలై మంచి విజయాలు అందుకున్న సినిమాలపై ప్రత్యేక కథనం. అవేంటో చూసేయండి.. -
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
సంచలనానికి 50 ఏళ్లు.. ‘అల్లూరి సీతారామరాజు’ తెర వెనక ఎన్ని విశేషాలో..!
‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా గురించి ప్రత్యేక కథనం. -
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
సీనియర్ హీరోయిన్ల జోరు ‘తగ్గేదే లే’.. ఎవరెన్ని సినిమాలతో బిజీగా ఉన్నారంటే?
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లపై ప్రత్యేక కథనం. త్రిష, నయనతార, తమన్నా.. ఇలా ఎవరెవరు ఎన్ని సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే? -
పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ మూవీస్.. ఇప్పుడు ‘ఆడుజీవితం’.. ఇంతకుముందు?
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఉత్తమ చిత్రాలు ఏంటంటే..? -
ఆ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిని నేనే అని తెలిసి షాకయ్యా.. అల్లు అర్జున్
నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
-
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
-
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి