- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Chiranjeevi: పోరు బాటలో విశ్వంభర
‘విశ్వంభర’ చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నారు చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాని వశిష్ఠ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
‘విశ్వంభర’ చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నారు చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాని వశిష్ఠ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. త్రిష కథానాయిక. ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ను ప్రారంభించుకుంది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ సెట్లో ప్రస్తుతం చిరుతో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఆ సెట్లోనే ఈ వారం నుంచి ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నారని సమాచారం. దీనికి రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వం వహించనున్నట్లు తెలిసింది. కాగా.. తాజాగా ఈ చిత్ర సెట్లో దర్శకుడు వి.వి.వినాయక్ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను చిత్ర బృందం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. సోషియో ఫాంటసీ అంశాలతో నిండిన ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ను వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త రూపు... తారల ముందు చూపు
ప్రతి సినిమాకీ కథ...ఆ కథకు తగ్గట్టుగా పాత్ర... పాత్రకు తగ్గట్టుగా రూపం మారుతూనే ఉంటాయి. అలా ప్రతి విషయంలోనూ కొత్తదనం చూపిస్తూ, తమని తాము తెరపై సరికొత్తగా ఆవిష్కరించుకోవడంపై నేటితరం కథానాయకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. -
ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి!
ఇటీవలే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అల్లరి నరేశ్. ఇప్పుడు ‘బచ్చల మల్లి’గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సుబ్బు మంగదేవి తెరకెక్కిస్తున్నారు. -
ఎన్టీఆర్ పురస్కారం ఓ ప్రత్యేక గౌరవం: మురళీమోహన్
ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని అందుకోవడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు ప్రముఖ నటుడు మురళీమోహన్. ‘అన్నదమ్ముల అనుబంధం’లో కలిసి నటించాక ఆయన కుటుంబంలో నేనూ ఓ భాగమైపోయానన్నారు. -
ఈటీవీలో రెండు సరికొత్త సీరియల్స్
ప్రతి మధ్యాహ్నాన్ని మరింత వినోదభరితంగా మార్చేందుకు మరో రెండు సరికొత్త సీరియల్స్ను తీసుకొచ్చింది మీ ఈటీవీ. మనసుకు హత్తుకునే విధంగా రూపొందిన ‘వసంతకోకిల’ మధ్యాహ్నాం 1.30గం.కు, ‘కాంతార’ మ.2గం.కు సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం కాబోతున్నాయి. -
సెట్లోకి వస్తే కెమెరానే మా లోకం
‘దృశ్యం’, ‘భోళా’, ‘దే దే ప్యార్ దే’ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి హిట్ జోడీ అనిపించుకున్నారు బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్, టబు. -
సుధా కొంగర దర్శకత్వంలో ధనుష్?
‘సర్ఫిరా’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు దర్శకురాలు సుధా కొంగర. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’కు రీమేక్గా రూపొందింది. -
నటికి ఇంతకన్నా ఏం కావాలి?
‘‘అభిమానులు నా పని గురించే మాట్లాడాలనేది నాకు ఎప్పట్నుంచో ఉన్న కోరిక’’ అని అంటోంది అందాల తార త్రిప్తి దిమ్రీ. ‘యానిమల్’తో హిట్ అందుకున్న ఈ భామ..త్వరలో ‘బ్యాడ్ న్యూజ్’ అనే కామెడీ ఎంటర్టైనర్తో రావడానికి ముస్తాబవుతోంది. -
‘మిస్టర్ ఎక్స్’ పూర్తి చేశాడు
తమిళ కథానాయకుడు ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఎక్స్’. మను ఆనంద్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో గౌతమ్ కార్తిక్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన మైథాలాజిక్, సైన్స్ ఫిక్షన్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. -
ఖుషీ స్వెట్టర్ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా
social look: సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
అర్జునుడిగా నేను.. ప్రభాస్ కర్ణుడు.. అలాగే చూడండి: విజయ్ దేవరకొండ
కల్కి మూవీలో తన పాత్ర గురించి నటుడు విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీ లాడ్స్ ఆన్లైన్లో!
-
ఆస్తి తగాదాలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టేశారు!
-
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!