Chiranjeevi: పోరు బాటలో విశ్వంభర

‘విశ్వంభర’ చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నారు చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాని వశిష్ఠ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Published : 25 Jun 2024 01:50 IST

విశ్వంభర’ చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నారు చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాని వశిష్ఠ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. త్రిష కథానాయిక. ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ సెట్‌లో ప్రస్తుతం చిరుతో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఆ సెట్‌లోనే ఈ వారం నుంచి ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కించనున్నారని సమాచారం. దీనికి రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్స్‌ నేతృత్వం వహించనున్నట్లు తెలిసింది. కాగా.. తాజాగా ఈ చిత్ర సెట్లో దర్శకుడు వి.వి.వినాయక్‌ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను చిత్ర బృందం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. సోషియో ఫాంటసీ అంశాలతో నిండిన ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ను వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని