- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Virataparvam: ఆ పాత్ర పోషించినందుకు గర్వపడుతున్నా
‘‘చూసిన ప్రతిసారీ కొత్త అనుభూతిని పంచే చిత్రం ‘విరాటపర్వం’. చూసిన ప్రేక్షకులు అదే మాట చెబుతున్నారు. ఇందులో వెన్నెల పాత్రని పోషించినందుకు గర్వపడుతున్నా’’
- సాయిపల్లవి
‘‘చూసిన ప్రతిసారీ కొత్త అనుభూతిని పంచే చిత్రం ‘విరాటపర్వం’. చూసిన ప్రేక్షకులు అదే మాట చెబుతున్నారు. ఇందులో వెన్నెల పాత్రని పోషించినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు సాయిపల్లవి. ఆమె కథానాయికగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. రానా దగ్గుబాటి కథానాయకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. సురేష్బాబు సమర్పకులు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి లభిస్తున్న ఆదరణపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ శనివారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించింది చిత్రబృందం. వెన్నెల పాత్రకి స్ఫూర్తి అయిన సరళ సోదరుడు తూము మోహన్రావు ఈ వేడుకకి హాజరయ్యారు. ఈ సందర్భంగా డి.సురేష్బాబు మాట్లాడుతూ ‘‘మా సంస్థలో తొలిసారి యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మేమూ ఓ బయోపిక్ చేశామనే తృప్తినిచ్చింది. సరళ జీవితాన్ని సినిమాగా తెరకెక్కించే అవకాశం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు. దర్శకుడు వేణు కథని చెప్పిన విధానం చాలా బాగుంది. రానాని ఈ సినిమాని ఎందుకు చేస్తున్నావని అడిగితే... ‘ఇలాంటి కథ నేను చేయకపోతే ఎవరు చేస్తార’ని అన్నాడు. ఇలాంటి కళాత్మక చిత్రాలకి ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడుతూనే ఉంటార’’న్నారు. సాయిపల్లవి మాట్లాడుతూ ‘‘సరళ కుటుంబాన్ని చూసిన తర్వాత నా గుండె బరువెక్కింది, కన్నీళ్లొచ్చాయి. గొప్ప మనసున్నవాళ్లు మళ్లీ పుడతారు. వాళ్లు ఏం అనుకున్నారో ఇంకో మార్గంలో సాధించుకుంటారని చెప్పా. సరళ సోదరుడు మోహన్రావు ఇక్కడికొచ్చి సినిమా విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ ‘‘ఇలాంటి అర్థవంతమైన సినిమాలు నోటి మాట ద్వారానే ప్రేక్షకుల్లోకి వెళతాయి. ఇలాంటి వాటిని నిలబెడితే మరిన్ని మంచి చిత్రాలొస్తాయి’’ అన్నారు. తూము మోహన్రావు మాట్లాడుతూ ‘‘మా చెల్లెలు విప్లవాన్ని ప్రేమించింది. విప్లవం వల్లే చనిపోయింది. సినిమాలో రవన్న రచనలకి ప్రభావితమై విప్లవంలోకి వెళ్లినట్టు చూపించారు. మా దృష్టిలో రెండూ ఒక్కటే. మా కుటుంబం అంతా కలిసి ఈ సినిమా చూశాం. 30ఏళ్ల కిందట జరిగిన ఆ సంఘటనని ఓ గొప్ప చిత్రంగా నిర్మించార’’న్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, కళా దర్శకుడు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త రూపు... తారల ముందు చూపు
ప్రతి సినిమాకీ కథ...ఆ కథకు తగ్గట్టుగా పాత్ర... పాత్రకు తగ్గట్టుగా రూపం మారుతూనే ఉంటాయి. అలా ప్రతి విషయంలోనూ కొత్తదనం చూపిస్తూ, తమని తాము తెరపై సరికొత్తగా ఆవిష్కరించుకోవడంపై నేటితరం కథానాయకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. -
ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి!
ఇటీవలే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అల్లరి నరేశ్. ఇప్పుడు ‘బచ్చల మల్లి’గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సుబ్బు మంగదేవి తెరకెక్కిస్తున్నారు. -
ఎన్టీఆర్ పురస్కారం ఓ ప్రత్యేక గౌరవం: మురళీమోహన్
ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని అందుకోవడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు ప్రముఖ నటుడు మురళీమోహన్. ‘అన్నదమ్ముల అనుబంధం’లో కలిసి నటించాక ఆయన కుటుంబంలో నేనూ ఓ భాగమైపోయానన్నారు. -
ఈటీవీలో రెండు సరికొత్త సీరియల్స్
ప్రతి మధ్యాహ్నాన్ని మరింత వినోదభరితంగా మార్చేందుకు మరో రెండు సరికొత్త సీరియల్స్ను తీసుకొచ్చింది మీ ఈటీవీ. మనసుకు హత్తుకునే విధంగా రూపొందిన ‘వసంతకోకిల’ మధ్యాహ్నాం 1.30గం.కు, ‘కాంతార’ మ.2గం.కు సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం కాబోతున్నాయి. -
సెట్లోకి వస్తే కెమెరానే మా లోకం
‘దృశ్యం’, ‘భోళా’, ‘దే దే ప్యార్ దే’ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి హిట్ జోడీ అనిపించుకున్నారు బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్, టబు. -
సుధా కొంగర దర్శకత్వంలో ధనుష్?
‘సర్ఫిరా’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు దర్శకురాలు సుధా కొంగర. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’కు రీమేక్గా రూపొందింది. -
నటికి ఇంతకన్నా ఏం కావాలి?
‘‘అభిమానులు నా పని గురించే మాట్లాడాలనేది నాకు ఎప్పట్నుంచో ఉన్న కోరిక’’ అని అంటోంది అందాల తార త్రిప్తి దిమ్రీ. ‘యానిమల్’తో హిట్ అందుకున్న ఈ భామ..త్వరలో ‘బ్యాడ్ న్యూజ్’ అనే కామెడీ ఎంటర్టైనర్తో రావడానికి ముస్తాబవుతోంది. -
‘మిస్టర్ ఎక్స్’ పూర్తి చేశాడు
తమిళ కథానాయకుడు ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఎక్స్’. మను ఆనంద్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో గౌతమ్ కార్తిక్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన మైథాలాజిక్, సైన్స్ ఫిక్షన్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. -
ఖుషీ స్వెట్టర్ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా
social look: సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
అర్జునుడిగా నేను.. ప్రభాస్ కర్ణుడు.. అలాగే చూడండి: విజయ్ దేవరకొండ
కల్కి మూవీలో తన పాత్ర గురించి నటుడు విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
-
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై ఘాటుగా స్పందించిన లోకేశ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కృష్ణా జలాల్లో కొత్త ద్వీపం.. అందం అదరహో..!
-
ఎంపీ లాడ్స్ ఆన్లైన్లో!
-
ఆస్తి తగాదాలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టేశారు!