Rashmika: మరోసారి సీమ సింగారమే

కొన్ని పాత్రల్లో కొంతమంది నటుల్ని చూశాక ఆ స్థానంలో మరొకరిని ఊహించుకోలేం. వాళ్ల కోసమే పుట్టాయేమో అనిపిస్తాయి ఆ పాత్రలు.

Published : 02 Jul 2024 02:02 IST

కొన్ని పాత్రల్లో కొంతమంది నటుల్ని చూశాక ఆ స్థానంలో మరొకరిని ఊహించుకోలేం. వాళ్ల కోసమే పుట్టాయేమో అనిపిస్తాయి ఆ పాత్రలు.  పుష్ప పాత్రలో అల్లు అర్జున్‌ని, శ్రీవల్లి పాత్రలో రష్మికని చూస్తే అదే అభిప్రాయం కలుగుతుంది. సీమ యాస, ఆ ఆహార్యం ఎంతో సహజత్వాన్ని తీసుకొచ్చాయి. రెండో భాగంలోనూ మళ్లీ ఆ పాత్రలతో సందడి చేయనున్న ఈ ఇద్దరి కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రష్మిక ‘పుష్ప2’ తర్వాత మరోసారి సీమ సింగారంతోనే తెరపై సందడి చేయనుంది. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా... రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా రష్మిక దాదాపు ఖాయమైనట్టే. ఇది పూర్తిగా రాయలసీమలోని కర్నూలు నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. సీమ కథ, అందులోనూ పీరియాడిక్‌ నేపథ్యం కావడంతో... హీరో హీరోయిన్ల పాత్రలు కూడా కథ సాగే ఆ కాలం, ఆ  ప్రాంతాన్ని ప్రతిబింబించేలా ఉంటాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. శ్రీవల్లి పాత్ర నుంచి బయటికి రాగానే రష్మిక మరోసారి సీమ పాత్రలో ఒదిగిపోతుందన్నమాట. ఆమె ప్రస్తుతం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ‘కుబేర’, ‘సికందర్‌’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని