Varalakshmi: మోదీని పెళ్లికి ఆహ్వానించిన వరలక్ష్మీ శరత్ కుమార్‌.. థ్యాంక్స్‌ చెబుతూ పోస్ట్‌

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తన పెళ్లికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఆ ఫొటోలను ఎక్స్‌లో షేర్‌ చేశారు.

Published : 29 Jun 2024 13:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రధాని మోదీని పెళ్లికి ఆహ్వానించారు నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. గత కొన్ని రోజులుగా వరలక్ష్మి టాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రముఖులను తన పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులను ఆమె స్వయంగా వెళ్లి పిలిచారు. తాజాగా కుటుంబసమేతంగా వెళ్లి ప్రధానిని ఆహ్వానించారు. ఈ ఫొటోలను వరలక్ష్మి (Varalaxmi Sarathkumar) ఎక్స్‌లో షేర్‌ చేస్తూ మోదీకి థ్యాంక్స్ చెప్పారు. ప్రధానిని కలవడం ఆనందంగా ఉందన్నారు. ఆయన (PM Modi) బిజీ షెడ్యూల్‌లో కూడా తమతో మంచి సమయం గడిపినట్లు తెలిపారు. చాలా గౌరవంగా ఉందన్నారు. ఈ సందర్భంగా శరత్‌కుమార్‌కు కూడా ఆమె ధన్యవాదాలు చెప్పారు. 

రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, అర్జున్‌: ‘సినిమాటిక్‌ యూనివర్స్‌’పై శంకర్‌ ఏమన్నారంటే?

సీనియర్‌ నటుడు శరత్‌కుమార్‌ కుమార్తెగా వెండితెరకు పరిచయమైనా తన వైవిధ్యమైన నటన, విలన్ పాత్రలతో వరలక్ష్మి ఆకట్టుకుంటున్నారు. ప్రముఖ గ్యాలరిస్ట్‌ నికోలయ్‌ సచ్‌దేవ్‌తో త్వరలోనే పెళ్లి పీట లెక్కబోతున్నారు. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న వీళ్లిద్దరూ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి సింపుల్‌గా చేసుకుంటున్నా రిసెప్షన్‌ మాత్రం చెన్నైలో గ్రాండ్‌గా చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని