- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Bollywood: బాలీవుడ్ ప్రేమలు.. గెలిచేనా తారలు?
యాక్షన్, ఫ్యామిలీ డ్రామాలు, కామెడీ ఎంటర్టైన్లు.. ఇలా జానర్ ఏదైనా ప్రేమ కథలంటే సినీప్రియులకు ఇంకాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది. ఎన్ని భిన్నమైన కథలు, పాత్రలు వచ్చినా.. ప్రేమకథల్లో కొత్తదనాన్ని వెతుక్కొని మరీ సినిమాల్ని ఆస్వాదిస్తుంటారు అభిమానులు.
యాక్షన్, ఫ్యామిలీ డ్రామాలు, కామెడీ ఎంటర్టైన్లు.. ఇలా జానర్ ఏదైనా ప్రేమ కథలంటే సినీప్రియులకు ఇంకాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది. ఎన్ని భిన్నమైన కథలు, పాత్రలు వచ్చినా.. ప్రేమకథల్లో కొత్తదనాన్ని వెతుక్కొని మరీ సినిమాల్ని ఆస్వాదిస్తుంటారు అభిమానులు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో విజయవంతమైన కథల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు నటీనటులు. ప్రస్తుతం బాలీవుడ్లో ప్రేమకథల నేపథ్యంలో కొన్ని చిత్రాలు సిద్ధమవుతున్నాయి. మరి ఆ సినిమాల సంగతులేంటి.? అందులో జోడీగా మెరవనున్నది ఎవరు?
22ఏళ్ల తర్వాత కలిసిన బంధం..
ఒక సంఘటన ఇద్దరి ప్రేమికుల జీవితాల్ని మార్చేసింది. మరి 22ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన ఆ జంట ప్రయాణం ఎలా ఉండనుందో తెలియాలంటే ‘ఔరో మే కహా దమ్ థా’ చూడాల్సిందే. బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్, టబు జంటగా నటిస్తున్న చిత్రమిది. ఈ రొమాంటిక్ ప్రేమకథలో వీరిద్దరు కృష్ణ, వసుధ పాత్రల్లో మెరవనున్నారు. నీరజ్ పాండే తెరకెక్కిస్తున్నారు. ‘‘మన బంధాన్ని విడదీసే వ్యక్తి ఇంకా పుట్టలేదు’’ అంటూ ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. వచ్చే నెల 5న ఈ సినిమా విడుదల కానుంది. మరి 22ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన ఈ ప్రేమ జంట వారి బంధాన్ని నిలబెట్టుకుందా లేదా అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు అందాల తార రకుల్ ప్రీత్సింగ్తో కలిసి ‘దే దే ప్యార్ దే 2’ అనే చిత్రంలో మధ్య వయసున్న ప్రేమికుడిగా తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నారు అజయ్.
జోడీ మరోసారి..
‘‘కుంకుమలా నువ్వే చేరగా ప్రియా’’ అంటూ ‘బ్రహ్మస్త్ర’లో ప్రేమికులుగా కనిపించి ప్రశంసలు అందుకుంది బాలీవుడ్ యువజంట రణ్బీర్ కపూర్, అలియా భట్. ఇప్పుడు మరోసారి వారి నటనతో సినీప్రియుల్ని ప్రేమలో పడేడయానికి ముస్తాబవుతున్నారు. ‘లవ్ అండ్ వార్’ అనే సినిమాలో వీరిద్దరు జంటగా నటిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారు. భన్సాలీ దీన్ని పరిశ్రమలో మునుపెన్నడూ చూడని ఓ స్వచ్ఛమైన ప్రేమకథగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా చిత్రీకరణను త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కొత్త జంట హంగామా..
ప్రేమకథా నేపథ్యంలో రాబోతున్న మరో చిత్రం ‘సంకీ’. దక్షిణాదితో పాటు బాలీవుడ్లోనూ ఇప్పటికే తానెంటో నిరూపించుకున్న కథానాయిక పూజా హెగ్డే, అహాన్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రమిది. అద్నాన్ షేక్, యాసిర్ ఝా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టినట్లు తెలిపింది చిత్రబృందం. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఇందులో పూజ, అహాన్ ప్రేమికులుగా కనిపించనున్నారు.
నీ ప్రపంచంలో నా స్థానమెక్కడ..?
‘ధడక్’.. బాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్న ప్రేమకథా చిత్రమిది. అందాల తార జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి తన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆమె, ఇషాన్ ఖట్టర్ ఇందులో మధుకర్, పార్థవి పాత్రల్లో ప్రేమికులుగా కనిపించి సినీప్రియుల్ని మెప్పించారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘ధడక్ 2’ రాబోతుంది.‘‘నువ్వు ఊహించుకుంటున్న ప్రపంచం చాలా ప్రత్యేకం. అందులో నాకు ఎలాంటి స్థానం లేదు’’ అంటూ ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రకటించింది చిత్రబృందం. ఈ రాబోయే సీక్వెల్లో బాలీవుడ్ నాయిక త్రిప్తి దిమ్రీ, సిద్ధాంత్ చతుర్వేది జంటగా కనిపించబోతున్నారు. షాజియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెంకీ సరసన ఐశ్వర్య
కథానాయకుడు వెంకటేశ్, అనిల్ రావిపూడి కలయికలో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ నాయికగా మీనాక్షి చౌదరిని ఇప్పటికే ఎంపిక చేశారు. -
మరోసారి సీమ సింగారమే
కొన్ని పాత్రల్లో కొంతమంది నటుల్ని చూశాక ఆ స్థానంలో మరొకరిని ఊహించుకోలేం. వాళ్ల కోసమే పుట్టాయేమో అనిపిస్తాయి ఆ పాత్రలు. -
నిప్పెట్టిన పటాకే.. డబుల్ దిమాకే
‘‘ఇస్మార్ట్ శంకరే.. ఏక్ దమ్ డేంజరే.. ఔర్ ఏక్ బార్ ఆయారే.. బేజారే’’ అంటూ హుషారుగా స్టెప్పేస్తున్నారు రామ్ పోతినేని. -
పాన్ ఇండియా కథలో
ఇటీవలే ‘హారోం హర’తో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు సుధీర్బాబు. ఇప్పుడాయన ఓ కొత్త కబురు వినిపించారు. వెంకట్ కల్యాణ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. -
నన్ను మరోస్థాయికి తీసుకెళ్లిన క్షణాలవి!
త్వరలో ‘దో పత్తీ’తో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది నాయిక కృతి సనన్. గతేడాది ‘మిమీ’ చిత్రంలోని తన నటనగానూ అంతర్జాతీయ అవార్డు అందుకున్న ఆమె.. ఈ సినిమాతో ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నట్లు తెలిపింది. -
శ్రీలంకలో యాక్షన్ మొదలు
‘కల్కి 2898ఎ.డి’ చిత్రంలో అర్జునుడి పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. -
మళ్లీ అలాంటి అవకాశం రాలేదు
‘‘వైఫల్యాలే మీ గురువులు, స్నేహితులు, మార్గదర్శకులు’’ అంటున్నారు బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా. -
ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రభుదేవా
సినిమాల్లో తన నటనతోనే కాకుండా.. అదిరిపోయే స్టెప్పులతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తుంటారు కథానాయకుడు ప్రభుదేవా. -
ది ఇండియా హౌస్ ప్రారంభం
కథానాయకుడు రామ్చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ఇండియా హౌస్’. -
హోటల్లో వెయిటర్గా నాజర్.. చిరంజీవికి విషయం తెలియడంతో..
ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పూర్తయిన తర్వాత కొద్దిరోజులు అవకాశాలు రాకపోవడంతో హోటల్లో వెయిటర్గా పనిచేశారట సినీ నటుడు నాజర్.. ఆ సమయంలో చోటు చేసుకున్న సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. -
రకుల్ప్రీత్ మోటివేషన్.. నభా ప్రమోషన్.. రుహానీ శర్మ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అందుకే ‘భారతీయుడు 2’ తీశా.. పార్ట్ 3 రిలీజ్ అప్పుడే: శంకర్
‘భారతీయుడు’ విడుదలైన 28 ఏళ్ల తర్వాత ‘భారతీయుడు 2’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. అంత గ్యాప్ ఎందుకొచ్చిందో దర్శకుడు శంకర్ తెలిపారు. -
‘కల్కి 2898 ఏడీ’ సాధించిన టాప్-10 బాక్సాఫీస్ రికార్డులివే!
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘కల్కి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల హవా చూపిస్తోంది. ఇప్పటివరకూ ఈ మూవీ రూ.555 కోట్లు వసూలు చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. కేసు నమోదు
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
-
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
లోక్సభ ప్యానెల్ స్పీకర్గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్