- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Sandeep kishan: నెల్లూరు ప్రభ పాత్రని ఆస్వాదించా
కుటుంబం అంతా కలిసి చూసే సినిమాల్లో నటించడం అన్నా...వాటిని చూడటం అన్నా ఎంతో ఇష్టం అంటున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా నటిస్తూనే..నిర్మాణంలోనూ రాణించే ప్రయత్నం చేస్తున్నారు....
కుటుంబం అంతా కలిసి చూసే సినిమాల్లో నటించడం అన్నా...వాటిని చూడటం అన్నా ఎంతో ఇష్టం అంటున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా నటిస్తూనే..నిర్మాణంలోనూ రాణించే ప్రయత్నం చేస్తున్నారు. కె.ఎస్.శినీష్తో కలిసి సందీప్ నిర్మించిన చిత్రం ‘వివాహ భోజనంబు’. హాస్య నటుడు సత్య కథానాయకుడిగా నటించారు. అర్జావీ రాజ్ కథానాయిక. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న ఓటీటీ వేదిక సోని లివ్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్కిషన్ బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘కుటుంబ కథా చిత్రాలంటే ఎంతో ఇష్టం. దర్శకుడు రామ్ అబ్బరాజు కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. అయితే ఇదొక ఇమేజ్ ఉన్న హాస్యనటుడు చేయాల్సిన చిత్రం. అందుకే సత్యని ఎంచుకున్నాం. మనసులో మాత్రం ఈ కథలో నేనే నటించుంటే బాగుండేదేమో అనిపించింది. అందుకే కనీసం ఓ చిన్న పాత్రైనా చేయాలని నెల్లూరు ప్రభ పాత్రని పోషించా. సత్య ప్రధాన పాత్రని చాలా బాగా చేశాడు. తన నటన ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’’.
‘‘పెళ్లికి సంబంధించిన కథ ఇది. పెళ్లిచూపులు తరహా పేర్లు స్ఫురణకి వచ్చాయి కానీ.. ‘వివాహ భోజనంబు’ కుదిరింది. పెళ్లంటే వివాహ సందడి, చక్కగా భోజనం చేయడమే కదా. అందుకే ఆ పేరు పెట్టాం. దర్శకుడు రామ్ అబ్బరాజు తను చూసిన కొన్ని నిజ జీవిత సంఘటనల్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాని చూస్తున్నప్పుడు ఎంతో ఆస్వాదించా. నేను చేసిన నెల్లూరు ప్రభ పాత్ర కోసం నెల్లూరు యాసలో మాట్లాడటాన్ని ఆస్వాదించా. లాక్డౌన్ సమయంలో ప్రయాణికుల్ని నిబంధనలకి విరుద్ధంగా తీసుకెళ్లే పాత్రలో కనిపిస్తా’’.
‘‘ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలని మార్చిలోనే నిర్ణయం తీసుకున్నాం. సోని లివ్తో అప్పట్లోనే ఒప్పందం కుదిరింది. కాపీరైట్ పరిమితుల్ని దృష్టిలో ఉంచుకుని సోని లివ్లో విడుదల చేస్తున్నాం. ఉత్తరాదిలో ఈ వేదికకి మంచి ఆదరణ ఉంది. మా చిత్రంతో తెలుగులోకి అడుగు పెడుతుండడం ఆనందంగా ఉంది. పూర్తిగా కుటుంబ కథతో రూపొందిన సినిమా కాబట్టి ఇది ఇంటిల్లిపాదీ కలిసి ఓటీటీలో చూస్తూ ఆస్వాదించొచ్చు. నేను కథానాయకుడిగా నటిస్తున్న ‘గల్లీ రౌడీ’ త్వరలోనే థియేటర్లలో విడుదల అవుతుంది. ఆ తర్వాత ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్లో సినిమా చేస్తున్నా. మరికొన్ని చిత్రాలు చేయాల్సి ఉంది. ‘ఫ్యామిలీ మేన్ 3’లోనూ ఓ పాత్ర చేస్తున్నా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’లాంటి సినిమాలు చాలా అరుదు.. ఆడియన్స్కు థ్యాంక్స్ చెప్పిన నాగ్ అశ్విన్
‘కల్కి’ని ఆదరించినందుకు అమెరికన్ ఆడియన్స్కు నాగ్ అశ్విన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయని చెప్పారు. -
కొత్త రూపు... తారల ముందు చూపు
ప్రతి సినిమాకీ కథ...ఆ కథకు తగ్గట్టుగా పాత్ర... పాత్రకు తగ్గట్టుగా రూపం మారుతూనే ఉంటాయి. అలా ప్రతి విషయంలోనూ కొత్తదనం చూపిస్తూ, తమని తాము తెరపై సరికొత్తగా ఆవిష్కరించుకోవడంపై నేటితరం కథానాయకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. -
ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి!
ఇటీవలే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అల్లరి నరేశ్. ఇప్పుడు ‘బచ్చల మల్లి’గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సుబ్బు మంగదేవి తెరకెక్కిస్తున్నారు. -
ఎన్టీఆర్ పురస్కారం ఓ ప్రత్యేక గౌరవం: మురళీమోహన్
ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని అందుకోవడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు ప్రముఖ నటుడు మురళీమోహన్. ‘అన్నదమ్ముల అనుబంధం’లో కలిసి నటించాక ఆయన కుటుంబంలో నేనూ ఓ భాగమైపోయానన్నారు. -
ఈటీవీలో రెండు సరికొత్త సీరియల్స్
ప్రతి మధ్యాహ్నాన్ని మరింత వినోదభరితంగా మార్చేందుకు మరో రెండు సరికొత్త సీరియల్స్ను తీసుకొచ్చింది మీ ఈటీవీ. మనసుకు హత్తుకునే విధంగా రూపొందిన ‘వసంతకోకిల’ మధ్యాహ్నాం 1.30గం.కు, ‘కాంతార’ మ.2గం.కు సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం కాబోతున్నాయి. -
సెట్లోకి వస్తే కెమెరానే మా లోకం
‘దృశ్యం’, ‘భోళా’, ‘దే దే ప్యార్ దే’ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి హిట్ జోడీ అనిపించుకున్నారు బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్, టబు. -
సుధా కొంగర దర్శకత్వంలో ధనుష్?
‘సర్ఫిరా’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు దర్శకురాలు సుధా కొంగర. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’కు రీమేక్గా రూపొందింది. -
నటికి ఇంతకన్నా ఏం కావాలి?
‘‘అభిమానులు నా పని గురించే మాట్లాడాలనేది నాకు ఎప్పట్నుంచో ఉన్న కోరిక’’ అని అంటోంది అందాల తార త్రిప్తి దిమ్రీ. ‘యానిమల్’తో హిట్ అందుకున్న ఈ భామ..త్వరలో ‘బ్యాడ్ న్యూజ్’ అనే కామెడీ ఎంటర్టైనర్తో రావడానికి ముస్తాబవుతోంది. -
‘మిస్టర్ ఎక్స్’ పూర్తి చేశాడు
తమిళ కథానాయకుడు ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఎక్స్’. మను ఆనంద్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో గౌతమ్ కార్తిక్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన మైథాలాజిక్, సైన్స్ ఫిక్షన్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. -
ఖుషీ స్వెట్టర్ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా
social look: సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
అర్జునుడిగా నేను.. ప్రభాస్ కర్ణుడు.. అలాగే చూడండి: విజయ్ దేవరకొండ
కల్కి మూవీలో తన పాత్ర గురించి నటుడు విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
-
పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితం కాదు: జేపీ నడ్డా
-
ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం
-
రోహిత్ తర్వాత ఎవరు..?
-
ఐటీ రిటర్నులు ఫైల్ చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసా?
-
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టీమ్.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు