Tamannaah: అందుకే మా ఇద్దరి కాంబోని ఆదరించారు: తమన్నా

రాశీ ఖన్నాతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు నటి తమన్నా. కోస్టార్స్ అందరూ అలాఉంటే బాగుంటుందన్నారు.

Published : 05 Jun 2024 13:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అరణ్మనై 4’ (తెలుగులో ‘బాక్‌’)తో ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చారు నటి తమన్నా. సుందర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీఖన్నా (Raashii Khanna) కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో రాశీతో కలిసి పని చేయడంపై తమన్నా స్పందించారు. ఒకరికొకరు సపోర్ట్‌గా ఉన్నట్లు చెప్పారు.

‘ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు ఇద్దరి నటనను ప్రేక్షకులు గమనిస్తారు. పోలికలు పెడుతుంటారు. అలా పోల్చడం కూడా మంచిదే. యాక్టర్స్‌లో బాగా నటించాలనే తపన పెరుగుతుంది. ‘అరణ్మనై 4’లో నేను, రాశీఖన్నా కలిసి నటించాం. ఒక పాటలో కలిసి డ్యాన్స్ చేశాం. దాని గురించి ఇద్దరం చర్చించుకున్నాం. ఒకరికొకరం సపోర్ట్‌ చేసుకున్నాం. అందుకే మా కాంబో హిట్ అయింది. నేను ఇప్పటివరకు ఎంతోమంది కోస్టార్స్‌తో పని చేశాను. కానీ, రాశీతో కలిసి పనిచేయడం చాలా సరదాగా అనిపించింది. కోస్టార్స్‌ అందరూ అలాఉంటే సెట్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది’ అని తమన్నా (Tamannaah) చెప్పారు.

పోటీ ఎప్పుడూ ఉంటుంది.. మరింత కష్టపడి పనిచేస్తా: సమంత

‘అరణ్మనై’ ఫ్రాంచైజీ దాదాపు పదేళ్లక్రితం మొదలైంది. 2014లో విడుదలైన ‘అరణ్మనై’ సూపర్‌హిట్ అందుకోవడంతో దానికి సీక్వెల్‌గా ‘అరణ్మనై 2’ తెరకెక్కించారు సుందర్‌. 2016లో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత 2021లో ‘అరణ్మనై 3’ విడుదలైంది. అదీ విజయాన్ని అందుకోవడంతో పార్ట్‌4ను రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని