Aham Reboot ott: ఓటీటీలో నేరుగా విడుదలవుతున్న సుమంత్‌ ‘అహం రీబూట్‌’

సుమంత్‌ కథానాయకుడిగా సాగర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘అహం రీబూట్‌’ ఓటీటీలో విడుదల కానుంది.

Published : 28 Jun 2024 15:54 IST

హైదరాబాద్‌: సుమంత్‌ హీరోగా ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి రూపొందించిన చిత్రం ‘అహం రీబూట్‌’ (Aham Reboot ott) రఘువీర్‌ గోరిపర్తి, సృజన్‌ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీని థియేటర్‌లో విడుదల చేయాలని భావించినా అనివార్య కారణాల వల్ల నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో జూన్‌ 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈవిషయాన్ని తెలియజేస్తూ ఆహా ట్రైలర్‌ విడుదల చేసింది.

స్టూడియోలో ఉన్న ఆర్జే నిలయ్‌(సుమంత్‌)కు ఓ అమ్మాయి నుంచి సాయం కావాలంటూ ఫోన్‌ వస్తుంది. తాను కిడ్నాప్‌ అయ్యానని చెబుతుంది. మరి ఆ యువతిని ఎవరు కిడ్నాప్‌ చేశారు? ఎందుకు చేశారు? ఎలా బయటపడింది? అందుకు ఆర్జే నిలయ్‌ ఏం చేశాడు? ఈ విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ‘అహం రీబూట్‌’ తెరకెక్కుతోంది. ‘అనుకోని సంఘటనలు మనిషిలోని కొత్త కోణాల్ని, శక్తుల్ని బయటకు తెస్తాయి. అలాంటి అంశాలతో రూపొందిన చిత్రమిది. సుమంత్‌ నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’ అని దర్శకుడు సాగర్‌ చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని