- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Rajamouli: ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
‘బాహుబలి’ తీసేముందు గేయ రచయిత సీతారామశాస్త్రి సలహా తీసుకున్నట్లు రాజమౌళి చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చారు గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి. ఆయన్ని స్మరించుకుంటూ ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్కు దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) అతిథిగా వచ్చి సీతారామశాస్త్రి గొప్పతనాన్ని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
‘ప్రపంచమంతా ఉన్నట్లే మా కుటుంబంలోనూ శాస్త్రిగారికి వీరాభిమానులున్నారు. ఆయన పాటలను విశ్లేషించుకుంటాం. ఆయన రాసే పాటలలాగే గంభీరంగా ఉంటారేమో అని భావించాను. కానీ, ఎప్పుడు కలిసినా సరదాగా జోకులు వేస్తూ ఉండేవారు. రాత్రిపూట మాత్రమే పాటలు రాస్తారని తర్వాత తెలిసింది. ఆయన నన్ను నంది అని పిలిచేవారు. ఇండస్ట్రీలో నన్ను అలా పిలిచేది శాస్త్రిగారు ఒక్కరే. మా సొంతం బ్యానర్పై ‘అర్ధాంగి’ అనే సినిమా తీశాం. అది ప్రేక్షకాదరణ పొందలేదు. మా నాన్న సంపాదించిన డబ్బంతా ఆ సినిమాకోసం ఉపయోగించారు. కానీ, అది చాలా పెద్ద ఫెయిల్యూర్ అయింది. దాంతో నాన్న తీవ్ర నిరాశపడ్డారు. అప్పుడు శాస్త్రిగారి (Sirivennela Sitaramasastri) దగ్గరకు వెళ్లి నాన్న కోసం ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..’ పాట రాసిమ్మన్ని అడిగాను. అది చదివాక మా నాన్నలో చాలా ధైర్యం వచ్చింది. ఆ పాట నాలోనూ పలు సందర్భాల్లో స్ఫూర్తి నింపింది’.
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
‘నేను ఒక సినిమా తీస్తునాన్నంటే దాని వెనక చాలా మంది ఉంటారు. నన్ను నమ్మి నిర్మాతలు డబ్బులు పెడతారు. దాని ఫలితం సినిమా కోసం పనిచేసిన అందరిపై ఉంటుంది. ‘బాహుబలి’ తీసేముందు సీతారామశాస్త్రి గారిని కలిసి ఇలా సినిమా తీయాలనుకుంటున్నా కరెక్టా కాదా.. అని అడిగి సలహా తీసుకున్నా. ‘ఆర్ఆర్ఆర్’లో దోస్తి పాట రాశారు. చాలా సార్లు ఆయన పాటల్లో భావానికి ప్రాధాన్యతనిస్తారు. ఒక్కోసారి పాటలో ప్రాస రావడం కోసం పదాలకు ప్రాధాన్యమిస్తారు. అలాంటి పాటే ‘దోస్తి’. ఇదే సినిమాలో ‘నెత్తురు మరిగితే ఎత్తర కొండ’ పాట మొత్తం రాయాలని చాలా ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఆరోగ్యం సహరించకపోవడంతో కొన్ని పదాలను రాసిచ్చి.. వాటిని పాటలో వాడుకోమన్నారు’ అని రాజమౌళి గుర్తుచేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉస్తాద్ భగత్ సింగ్’పై రూమర్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీశ్ శంకర్
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆగిపోనుందని ఎక్స్లో వచ్చిన పోస్ట్కు హరీశ్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. -
రజనీకాంత్తో మోహన్బాబు.. వైరలవుతోన్న ఫొటో
రజనీకాంత్తో దిగిన ఫొటోను మోహన్బాబు షేర్ చేశారు. దానికి ఆయన పెట్టిన క్యాప్షన్ ఆకట్టుకుంటోంది. -
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
సాయం చేయాలంటూ మంచు లక్ష్మి విజ్ఞప్తి.. సోషల్ మీడియాలో పోస్ట్
వీసా విషయమై తనకు సాయం చేయాలంటూ మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అసలు ఏమైందంటే? -
సీఎం రేవంత్రెడ్డి సూచనపై స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్
సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ అవగాహన కల్పించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) సూచనలపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (TFCC) స్పందించింది. -
అమ్మాయిలను ఆ ఒక్క ప్రశ్న అడగొద్దు: శ్రుతి హాసన్
శ్రుతి హాసన్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఫన్నీ రిప్లై ఇచ్చారు. -
ఇంటర్నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న ధనుష్ చిత్రం
ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. -
జపాన్లో విడుదలకు సిద్ధమైన ఇండియన్ సినిమాలు.. ఏవంటే
ప్రభాస్, షారుక్ ఖాన్ల సినిమాలు జపాన్లో విడుదలకు సిద్ధమయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో సందడి నెలకొంది. -
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
నటి వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
హైదరాబాద్ను చుట్టేసిన నభా నటేశ్.. కృతి సనన్ స్టైలిష్ డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
సినిమాల్లో నటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్
సినిమాల్లో నటించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. -
ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవాలి?: నెటిజన్కు రకుల్ప్రీత్ రిప్లై
తన పెళ్లి గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా రకుల్ప్రీత్ సింగ్ తనదైన శైలిలో స్పందించారు. -
రామ్ చరణ్ దంపతుల మాటతో నా సంతోషం వెయ్యి రెట్లు పెరిగింది: జానీ మాస్టర్
రామ్ చరణ్ దంపతులు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. డ్యాన్స్ర్స్ యూనియన్లోని కుటుంబాలకు సాయం చేయనున్నారు. -
రజనీకాంత్, విజయ్ల రికార్డులు బ్రేక్ చేసిన ప్రభాస్.. ‘కల్కి’ వసూళ్లు ఎంతంటే!
ప్రభాస్ ‘కల్కి’ రజనీకాంత్, విజయ్ చిత్రాల రికార్డులను బ్రేక్ చేసింది. ఆరు రోజుల్లోనే ఈ చిత్రాల వసూళ్లను అధిగమించడం విశేషం. -
పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించారు: పరుచూరి గోపాలకృష్ణ
పవన్ కల్యాణ్కు తాను వీరాభిమానినని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. -
టాటూ రూమర్స్పై దిశా పటానీ అలా.. వెంకటేశ్ సినిమాలో ఐశ్వర్య ఇలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టాలీవుడ్కు సీఎం రేవంత్ సూచన.. స్పందించిన మోహన్ బాబు
టాలీవుడ్కు సీఎం రేవంత్ ఇచ్చిన కీలక సూచనపై నటుడు మోహన్ స్పందించారు. ఏమన్నారంటే? -
షారుక్ ఖాన్కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్కు అరుదైన గౌరవం దక్కింది. -
ఆ సాంగ్ వచ్చే టైమ్కు థియేటర్కు పంపాడు.. ప్రభాస్పై హంస నందిని కామెంట్స్
ప్రభాస్కు బిడియం ఎక్కువని హంసనందిని అన్నారు. ‘మిర్చి’ రోజులను గుర్తుచేసుకున్నారు. -
హీనా ఖాన్ నువ్వు వారియర్వి.. నటికి ధైర్యాన్నిచ్చిన సమంత
హీనా ఖాన్కు ధైర్యాన్నిస్తూ సమంత పోస్ట్ పెట్టారు. ఆమెను వారియర్గా పేర్కొన్నారు. -
‘రాజాసాబ్’ స్టోరీ లైన్ వైరల్.. ఫన్నీ రిప్లై ఇచ్చిన నిర్మాత
‘రాజా సాబ్’ స్టోరీ లైన్ను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ పోస్ట్ చేసింది. దీనిపై టాలీవుడ్ నిర్మాత ఫన్నీగా స్పందించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ట్రయంఫ్ స్పీడ్, స్క్రాంబ్లర్ మోటార్ సైకిళ్లపై డిస్కౌంట్
-
‘ఉస్తాద్ భగత్ సింగ్’పై రూమర్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీశ్ శంకర్
-
కేసీఆర్పై విశ్వాసం లేకే కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హార్దిక్కు మహిళా అభిమాని బహిరంగ క్షమాపణ.. ఎందుకంటే?
-
24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు.. భోలే బాబాకు ₹100 కోట్ల ఆస్తులు!