ఎస్పీబీ తాజా ఆరోగ్యంపై చరణ్ ఏమన్నారంటే?
కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్
చెన్నై: కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన తల్లి కూడా ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం ఇంట్లోనే మందులు వాడుతున్నారని తెలిపారు.
‘‘మా అమ్మ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఆమె ఇంటికి వచ్చారు. ప్రస్తుతం మందులు వాడుతున్నారు. నిన్నా ఈరోజూ,నేను ఆస్పత్రికి వెళ్లాను. నాన్న ఆరోగ్యం గురించి వైద్యులు నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు. ఆయన ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉందని తెలిపారు. కొన్ని రోజులుగా మంచానికే పరిమితం కావడంతో కండరాల పునరుత్తేజానికి ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఆయన ఊపిరి తీసుకోవడం కూడా మెరుగుపడింది. మీ ప్రార్థనలు, దీవెనల వల్ల ఆయన త్వరగా కోలుకుంటున్నారు. త్వరలోనే ఇంటికి వస్తారని ఆశిస్తున్నా. రేపటి నుంచి లాక్డౌన్ను మరింత సడలించనున్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. మాస్క్లు పెట్టుకొని, భౌతికదూరం పాటించండి. వైరస్ బారినపడిన ప్రతి ఒక్కరూ కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని ఎస్పీ చరణ్ అన్నారు.
మరోవైపు ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు కూడా ఎస్పీబీ ఆరోగ్యంపై హెల్త్బులిటెన్ విడుదల చేశాయి. ఇంకా ఆయన ఐసీయూలోనే ఉన్నారని, వెంటిలేటర్, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, వైద్యుల చికిత్సకు, ఫిజియోథెరపీకి ఆయన చురుగ్గా స్పందిస్తున్నారని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూపర్హిట్ యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్’.. ఓటీటీలో వచ్చేది అప్పుడేనా?
ఇటీవల విడుదలైన ‘కిల్’ (Kill) విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. -
అమృత్సర్లో కృతిశెట్టి.. ప్రమోషన్స్లో నభా నటేశ్.. చాక్లెట్లతో శ్రద్ధా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివే.. -
ఆ జంట హద్దు మీరింది.. బిగ్బాస్ షోను ఆపండి: పోలీసులకు ఫిర్యాదు
బిగ్బాస్ షోలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ మహారాష్ట్రలో ఓ ప్రజాప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వీటి ఆధారంగా ‘కల్కి’ రెండు భాగాలు: ఫొటో పంచుకున్న నాగ్ అశ్విన్
‘కల్కి 2898 ఏడీ’ సినిమాకి సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ ఫొటో పోస్ట్ చేశారు. -
వారి మాటలకు అప్పుడెంతో బాధపడ్డా..: కార్తిక్ ఆర్యన్
కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న అవమానాలపై బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ (karthik Aaryan) మాట్లాడారు. సూటిపోటి మాటల వల్ల కుంగుబాటుకు గురయ్యానని చెప్పారు. -
మల్టీస్టారర్ వెబ్సిరీస్.. ‘మనోరథంగళ్’ తెలుగు ట్రైలర్ చూశారా!
కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్లాల్ తదితర స్టార్ హీరోలు కలిసి నటించిన వెబ్సిరీస్ ‘మనోరథంగళ్’. తెలుగు ట్రైలర్ విడుదలైంది.
-
మా మనసులు ఎప్పుడో కలిశాయి: ప్రియుడి గురించి అవికా గోర్
తన తదుపరి ప్రాజెక్ట్ ‘బ్లడీ ఇష్క్’ ప్రమోషన్స్లో బిజీగా పాల్గొంటున్నారు నటి అవికాగోర్ (Avika Gor). ఇందులో భాగంగా తన లవ్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆర్ఆర్ఆర్ను బీట్ చేసిన కల్కి 2898 ఏడీ.. వసూళ్లు ఎంతంటే?
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్లను అధిగమించింది. -
ఆ సినిమా చూసి ఆయనకు వీరాభిమానినయ్యా: ఎస్.జె.సూర్య
‘రాయన్’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు ఎస్.జె.సూర్య. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్నా: బాలీవుడ్ నటి
సినిమాల్లో అవకాశాల కోసం తాను ఎదురుచూస్తున్నట్లు బాలీవుడ్ నటి నేహాధూపియా తెలిపారు. -
ఇసుక మాఫియా ముఠా నాపై దాడి చేయాలనుకుంది: విక్కీకౌశల్
‘బ్యాడ్న్యూస్’ (Bad Newz)తో విజయాన్ని అందుకున్నారు నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal). ఈ సినిమా సక్సెస్లో భాగంగా ఆయన వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. -
టాలీవుడ్ నుంచి హాలీవుడ్.. రాజమౌళి గురించి సినీ ప్రముఖులు ఏమన్నారంటే!
రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. -
ఆమిర్తో విడాకులు.. సంతోషంగా ఉన్నా: కిరణ్ రావు
ఆమిర్ ఖాన్తో వైవాహిక జీవితానికి స్వస్తి పలకడంపై ఆయన మాజీ సతీమణి, దర్శకురాలు కిరణ్రావు స్పందించారు. తాను సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. -
సోషల్మీడియా ట్రోల్స్పై జాన్వీకపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సోషల్మీడియా వేదికగా స్టార్ కిడ్స్ ఎదుర్కొంటున్న ట్రోల్స్ను ఉద్దేశించి నటి జాన్వీకపూర్ (Janhvi kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
రెండు సినిమాల అప్డేట్స్ చెప్పిన రజనీకాంత్.. ‘ఇండియన్ 2’ గురించి ఏమన్నారంటే!
తన అప్కమింగ్ సినిమాల అప్డేట్లను రజనీకాంత్ పంచుకున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. -
ఈ వారం థియేటర్లో వినోదాల విందు.. మరి ఓటీటీలో..!
‘కల్కి’ తర్వాత వచ్చిన చిత్రాలేవీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. జులై చివరిలో మరికొన్ని చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మరి థియేటర్తో పాటు ఓటీటీలో వస్తున్న ఆ చిత్రాలేంటో చూసేయండి. -
మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్.. అల్లు అర్జున్, రామ్చరణ్లు ఏ స్థానంలో ఉన్నారంటే!
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా మోస్ట్ పాపులర్ హీరోల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్లో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు. -
రాయన్ అందర్నీ మెప్పిస్తుంది : ధనుష్
‘రాయన్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు ధనుష్. ఆయన హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మించారు. సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, అపర్ణ బాలమురళి, ప్రకాశ్రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. -
ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్
‘మిస్టర్ బచ్చన్’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని హరీశ్ శంకర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. -
ఏ దివిలో విరిసిన పారిజాతమో!
1925 జులై 22న వరంగల్ గడ్డపై పుట్టిన ఈ అభ్యుదయ కవి వెండితెర సాహితీ ప్రయాణం చిరకాలం గుర్తుండిపోయే పలు మధురమైన గీతాలతో మనోహరంగా సాగింది. ‘కన్నెవయసు’ (1973) చిత్రం కోసం రాసిన ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో!’ పాట ఆయనకు చిరకీర్తిని తెచ్చిపెట్టింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రమాదానికి, షార్ట్సర్క్యూట్కి సంబంధం లేదు.. మదనపల్లె ఘటనపై ప్రాథమిక నివేదిక!
-
ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం వివాదాస్పదం.. రూ.500 చొప్పున జరిమానా!
-
సీఎం చంద్రబాబును కలిసిన హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ
-
అరంగేట్ర మ్యాచ్లోనే ప్రపంచ రికార్డు సృష్టించిన స్కాట్లాండ్ పేసర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పారిస్ ఒలింపిక్స్: భారత అథ్లెట్లకు శిక్షణ.. ఎవరికి ఎంత ఖర్చు?