- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Shivani Nagaram: హీరోయినంటే నమ్మలేకపోయా
‘‘భావోద్వేగాలు నిండిన కథతో రూపొందిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. సినిమాలో ప్రతి పాత్ర అందంగా ఉంటుంది. అందర్నీ అలరిస్తుంది’’ అంది శివాని నాగరం.
‘‘భావోద్వేగాలు నిండిన కథతో రూపొందిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. సినిమాలో ప్రతి పాత్ర అందంగా ఉంటుంది. అందర్నీ అలరిస్తుంది’’ అంది శివాని నాగరం (Shivani Nagaram). సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికినేని తెరకెక్కించిన చిత్రమే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band). ఈ సినిమాతోనే కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవుతోంది శివాని. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్లో సోమవారం విలేకర్లతో ముచ్చటించింది శివాని.
- ‘‘ఇంత మంచి కథా బలమున్న సినిమాతో కథానాయికగా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెడుతుండటం అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పటికే నేనీ చిత్రం చూశా కాబట్టి దీనిపై చాలా నమ్మకంగా ఉన్నా. ఈ చిత్రంలో అవకాశం నాకు ఆడిషన్ ద్వారానే వచ్చింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ పంపితే హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కోసం ఆడిషన్ ఇచ్చా. కానీ, ఆ తర్వాత నన్ను హీరోయిన్గా తీసుకుంటున్నట్లు చెప్పారు. తొలిరోజు షూట్లో పాల్గొనే వరకు నేనే కథానాయికని అనేది నమ్మలేకపోయా’’.
- ‘‘ఈ సినిమాలో నేను లక్ష్మి అనే పాత్రలో కనిపిస్తా. ఈ చిత్రం కోసం మేము నెల రోజుల పాటు బాగా సిద్ధమయ్యాం. స్క్రిప్ట్లోని ప్రతి డైలాగ్ను నేర్చుకున్నా. ఇలా ముందే సిద్ధమై వెళ్లడం వల్ల సెట్లో నటించడం పెద్దగా కష్టమనిపించలేదు. అయితే దీంట్లో కొన్ని భావోద్వేగభరిత సన్నివేశాలు చేయడం సవాల్గా అనిపించింది. సుహాస్ ‘కలర్ ఫొటో’ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. తనతో కలిసి పని చేయడం చాలా సౌకర్యంగా ఉండేది. సెట్లో తను నన్నెంతో ప్రోత్సహించేవారు’’.
- ‘‘ప్రతిభ గల తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్లందరికీ మంచి అవకాశాలు రావాలి. తెలుగు అమ్మాయి తెలుగు సినిమాల్లో నటిస్తే చాలా ఉపయోగాలుంటాయి. సెట్లో ఒక డైలాగ్ మార్చి ఇస్తే వెంటనే నేర్చుకొని చెప్పగలను. కానీ, మరో భాష నటి అయితే అర్థం చేసుకోవడానికే టైమ్ పడుతుంది. నేను కథానాయిక పాత్రలే చేయాలని నియమాలేం పెట్టుకోలేదు. కథలో కీలకంగా ఉండి నటిగా ప్రతిభ చూపించే అవకాశమున్న ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కల్కి’లాంటి సినిమాలు చాలా అరుదు.. ఆడియన్స్కు థ్యాంక్స్ చెప్పిన నాగ్ అశ్విన్
‘కల్కి’ని ఆదరించినందుకు అమెరికన్ ఆడియన్స్కు నాగ్ అశ్విన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయని చెప్పారు. -
కొత్త రూపు... తారల ముందు చూపు
ప్రతి సినిమాకీ కథ...ఆ కథకు తగ్గట్టుగా పాత్ర... పాత్రకు తగ్గట్టుగా రూపం మారుతూనే ఉంటాయి. అలా ప్రతి విషయంలోనూ కొత్తదనం చూపిస్తూ, తమని తాము తెరపై సరికొత్తగా ఆవిష్కరించుకోవడంపై నేటితరం కథానాయకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. -
ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి!
ఇటీవలే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అల్లరి నరేశ్. ఇప్పుడు ‘బచ్చల మల్లి’గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సుబ్బు మంగదేవి తెరకెక్కిస్తున్నారు. -
ఎన్టీఆర్ పురస్కారం ఓ ప్రత్యేక గౌరవం: మురళీమోహన్
ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని అందుకోవడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు ప్రముఖ నటుడు మురళీమోహన్. ‘అన్నదమ్ముల అనుబంధం’లో కలిసి నటించాక ఆయన కుటుంబంలో నేనూ ఓ భాగమైపోయానన్నారు. -
ఈటీవీలో రెండు సరికొత్త సీరియల్స్
ప్రతి మధ్యాహ్నాన్ని మరింత వినోదభరితంగా మార్చేందుకు మరో రెండు సరికొత్త సీరియల్స్ను తీసుకొచ్చింది మీ ఈటీవీ. మనసుకు హత్తుకునే విధంగా రూపొందిన ‘వసంతకోకిల’ మధ్యాహ్నాం 1.30గం.కు, ‘కాంతార’ మ.2గం.కు సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం కాబోతున్నాయి. -
సెట్లోకి వస్తే కెమెరానే మా లోకం
‘దృశ్యం’, ‘భోళా’, ‘దే దే ప్యార్ దే’ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి హిట్ జోడీ అనిపించుకున్నారు బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్, టబు. -
సుధా కొంగర దర్శకత్వంలో ధనుష్?
‘సర్ఫిరా’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు దర్శకురాలు సుధా కొంగర. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’కు రీమేక్గా రూపొందింది. -
నటికి ఇంతకన్నా ఏం కావాలి?
‘‘అభిమానులు నా పని గురించే మాట్లాడాలనేది నాకు ఎప్పట్నుంచో ఉన్న కోరిక’’ అని అంటోంది అందాల తార త్రిప్తి దిమ్రీ. ‘యానిమల్’తో హిట్ అందుకున్న ఈ భామ..త్వరలో ‘బ్యాడ్ న్యూజ్’ అనే కామెడీ ఎంటర్టైనర్తో రావడానికి ముస్తాబవుతోంది. -
‘మిస్టర్ ఎక్స్’ పూర్తి చేశాడు
తమిళ కథానాయకుడు ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఎక్స్’. మను ఆనంద్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో గౌతమ్ కార్తిక్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన మైథాలాజిక్, సైన్స్ ఫిక్షన్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. -
ఖుషీ స్వెట్టర్ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా
social look: సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
అర్జునుడిగా నేను.. ప్రభాస్ కర్ణుడు.. అలాగే చూడండి: విజయ్ దేవరకొండ
కల్కి మూవీలో తన పాత్ర గురించి నటుడు విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లాంటి సినిమాలు చాలా అరుదు.. ఆడియన్స్కు థ్యాంక్స్ చెప్పిన నాగ్ అశ్విన్
-
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా
-
కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురు
-
దిగొచ్చిన వాణిజ్య సిలిండర్ ధర.. రూ.32 తగ్గింపు
-
మొరాయించిన శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్.. నిలిచిన ఆన్లైన్ టికెట్ల జారీ
-
రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్