- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Samantha: డాక్టర్ వార్నింగ్పై స్పందించిన సమంత.. వాళ్ల కోసమే ఆలోచించానంటూ సుదీర్ఘ పోస్ట్
తనకు వార్నింగ్ ఇచ్చిన డాక్టర్పై సమంత పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అది చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: తనను జైల్లో పెట్టాలంటూ వార్నింగ్ ఇచ్చిన డాక్టర్ పోస్ట్పై సమంత స్పందించారు. తాను తీసుకుంటున్న వైద్యం ఎంతో ఖరీదైనదని.. డబ్బులు లేని వాళ్లు అలాంటి వైద్యం ఎలా తీసుకుంటారోనని ఎప్పుడూ ఆలోచిస్తుంటానని ఆమె (Samantha) తెలిపారు.
సమంత తాను తీసుకునే వైద్యాన్ని తెలియజేస్తూ ఎప్పటికప్పుడు పోస్ట్ పెడుతుంటారు. ఇటీవల కూడా అలానే నెబ్యులైజేషన్ గురించి పోస్ట్ పెట్టారు. ‘మాములుగా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రత్యామ్నాయ మందులు వాడండి అంటూ.. నెబ్యులైజేషన్లో ఉపయోగించాల్సిన కొన్ని ఔషధాలు సూచించారు. దీనిపై కొందరు డాక్టర్లు ఆమెను విమర్శించారు. ఆమె చెప్పిన హెల్త్ టిప్ పాటిస్తే ప్రాణానికే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వారిలో ఒక డాక్టర్ ఆమెను తీవ్రంగా విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. ‘సమంతకు హెల్త్, సైన్స్ గురించి ఏమీ తెలియకుండా మాట్లాడారు. ఎంతోమందిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆమెను జైల్లో వేయాలి. జరిమానా విధించాలి’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా దీనిపై సమంత స్పందించారు. తన సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్పై స్పందించిన నాగ్ అశ్విన్
‘కొన్నేళ్లుగా నేను అనేక రకాల మందులు వేసుకుంటున్నాను. ప్రతి దాన్ని డాక్టర్ల సలహా మేరకు ఉపయోగిస్తున్నా. ఇతరులకు ఇచ్చే టిప్స్ కూడా నేను పాటించి ఫలితం వచ్చిన తర్వాతనే చెప్పాను. నేను తీసుకుంటున్న వైద్యం చాలా ఖరీదైనది. నాకు ఆర్థికస్థోమత ఉంది కాబట్టి దాన్ని భరించగలను. కానీ, కొందరి పరిస్థితి వేరు. ఇంత ఖర్చుపెట్టి వైద్యం చేయించుకోలేరు. వాళ్ల గురించే నేను ఆలోచించి హెల్త్ టిప్స్ చెబుతుంటాను. దేని గురించైనా తెలుసుకోకుండా ఇతరులకు సలహా ఇచ్చేంత అమాయకురాలిని కాదు. నేను చికిత్స తీసుకుంటున్న డాక్టర్కు 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది’ అని తెలిపారు.
ఇక తనను విమర్శించిన డాక్టర్ను ఉద్దేశిస్తూ.. ‘ఒక పెద్దమనిషి నా పోస్ట్ను, నా సలహాలను ఉద్దేశపూర్వకంగా బలమైన పదాలతో దూషించారు. ఆయన కూడా డాక్టరే. నాకంటే ఆయనకు ఎన్నో విషయాలపై అవగాహన ఉంటుందనడంలో సందేహం లేదు. నన్ను నిందించడం కంటే నాకు చికిత్స చేసిన డాక్టర్తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేది. ఆయన నా గురించి మాట్లాడే సమయంలో అలాంటి పదాలు వాడకుండా ఉంటే ఆయన్ని గౌరవించేదాన్ని. నన్ను జైల్లో పెట్టాలని ఆయన విమర్శించినందుకు నాకు బాధలేదు. ఒక సెలబ్రిటీని కాబట్టి నన్ను అంత సులువుగా నిందించాడని అనుకుంటాను. కానీ, నేను సెలబ్రిటీగా ఆ హెల్త్ టిప్ ఇవ్వలేదు.. ఒక సామాన్యమైన వ్యక్తిగా పోస్ట్ చేశాను’ అని రాసుకొచ్చారు. దీనిపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్నారుల భద్రతపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సాయితేజ్ విజ్ఞప్తి.. ఎక్స్ వేదికగా పోస్ట్!
పిల్లలు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు అప్రమత్తంగా వ్యవహరించాలని పేరెంట్స్కు నటుడు సాయి తేజ్ విజ్ఞప్తి చేశారు. -
ప్రభాస్ పెళ్లిపై స్పందించిన శ్యామలా దేవి.. సక్సెస్ రాదన్నారు వచ్చింది
ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి మరోసారి స్పందించారు. ఈసారి ఆమె ఏమన్నారంటే? -
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
సామాజిక మాధ్యమాల వేదికగా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర ఫొటోలు, విశేషాలు మీకోసం.. -
సమంతకు క్షమాపణలు చెప్పిన డాక్టర్.. కానీ..
ఇటీవల సమంతను విమర్శించిన డాక్టర్ ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
నటుడు రాజ్ తరుణ్ వ్యవహారంలో మరో ట్విస్ట్
తనతో సహజీవనం సాగిస్తున్న సినీ నటుడు రాజ్తరుణ్ (Raj Tarun) మరో మహిళకు దగ్గరై తనను బెదిరిస్తున్నాడంటూ లావణ్య అనే యువతి శుక్రవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
ఇకపై హాస్పిటల్కు వెళ్లం: ప్రెగ్నెన్సీ రూమర్స్పై సోనాక్షి సిన్హా
ప్రెగ్నెన్సీ రూమర్స్పై సోనాక్షి స్పందించారు. పెళ్లి తర్వాత జీవితంపై ఆమె మాట్లాడారు. -
‘కల్కి’ చరిత్రలో నిలిచిపోతుంది: అమితాబ్ బచ్చన్
ప్రస్తుత పరిస్థితుల్లో ‘కల్కి’ని తెరకెక్కించడం పెద్ద సాహసమని అమితాబ్ బచ్చన్ అన్నారు. చిత్రబృందాన్ని ప్రశంసించారు. -
చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నటుడు రాజ్ తరుణ్పై యువతి ఫిర్యాదు
రాజ్ తరుణ్పై ఓ యువతి ఫిర్యాదు చేశారు. -
‘ఉస్తాద్ భగత్ సింగ్’పై రూమర్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీశ్ శంకర్
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆగిపోనుందని ఎక్స్లో వచ్చిన పోస్ట్కు హరీశ్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. -
రజనీకాంత్తో మోహన్బాబు.. వైరలవుతోన్న ఫొటో
రజనీకాంత్తో దిగిన ఫొటోను మోహన్బాబు షేర్ చేశారు. దానికి ఆయన పెట్టిన క్యాప్షన్ ఆకట్టుకుంటోంది. -
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
సాయం చేయాలంటూ మంచు లక్ష్మి విజ్ఞప్తి.. సోషల్ మీడియాలో పోస్ట్
వీసా విషయమై తనకు సాయం చేయాలంటూ మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అసలు ఏమైందంటే? -
సీఎం రేవంత్రెడ్డి సూచనపై స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్
సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ అవగాహన కల్పించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) సూచనలపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (TFCC) స్పందించింది. -
అమ్మాయిలను ఆ ఒక్క ప్రశ్న అడగొద్దు: శ్రుతి హాసన్
శ్రుతి హాసన్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఫన్నీ రిప్లై ఇచ్చారు. -
ఇంటర్నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న ధనుష్ చిత్రం
ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. -
జపాన్లో విడుదలకు సిద్ధమైన ఇండియన్ సినిమాలు.. ఏవంటే
ప్రభాస్, షారుక్ ఖాన్ల సినిమాలు జపాన్లో విడుదలకు సిద్ధమయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో సందడి నెలకొంది. -
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
నటి వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
హైదరాబాద్ను చుట్టేసిన నభా నటేశ్.. కృతి సనన్ స్టైలిష్ డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
సినిమాల్లో నటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్
సినిమాల్లో నటించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నా పరిస్థితే వేరు.. దేశవాళీలో ఆడమనడం సమంజసంగా అనిపించలేదు: ఇషాన్
-
మద్యం సేవించి.. దంపతులను కారుతో ఢీ కొట్టి!
-
ఎన్టీఆర్ జిల్లాలో బాయిలర్ పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా
-
జలపాతం చూసేందుకు వెళ్లి.. వరదలో చిక్కుకొని!
-
వైభవంగా పూరీ జగన్నాథుని రథయాత్ర.. హాజరైన రాష్ట్రపతి
-
నల్ల డైరీ చెప్పిన గోల్ ‘మాల్’ కథ.. రూ.కోట్లలోనే కస్టమర్లకు సున్నం!