- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
renu desai: ఆ మాటలు విని విసిగిపోయా.. మీ మైండ్సెట్ మార్చుకోండి: రేణు దేశాయ్
పవన్కల్యాణ్తో విడాకుల విషయమై తనపై తరచూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లకు రేణు దేశాయ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.
హైదరాబాద్: తనని దురదృష్టవంతురాలని పిలుస్తుండటం చాలా బాధగా ఉందని, అలా పిలవొద్దని చెప్పి చెప్పి అలసిపోయానని సినీ నటి రేణు దేశాయ్ (Renu Desai) అన్నారు. పవన్కల్యాణ్ (Pawan Kalyan) నుంచి విడాకులు తీసుకున్న దగ్గరి నుంచి ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా ఏ పోస్ట్ పెట్టినా, కొందరు నెటిజన్లు విమర్శిస్తూ కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. ఓ దశలో ఈ వ్యవహారం తారస్థాయికి చేరడంతో ఆమె కామెంట్ సెక్షన్ కూడా హైడ్ చేశారు. అయినా.. పలువురు వ్యక్తులు రేణుదేశాయ్ హ్యాష్ట్యాగ్తో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్కల్యాణ్ జనసేన పార్టీ ఘన విజయాన్ని సాధించింది. అంతేకాదు, ఆయన ఏపీ ఉపముఖ్యమంత్రి పదవితో పాటు, పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో కొందరు రేణుదేశాయ్పై మళ్లీ కామెంట్లు చేయడం మొదలు పెట్టారు.
‘మీరు దురదృష్టవంతురాలు మేడమ్’ అంటూ వ్యంగ్యంగా ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి రేణు దేశాయ్ స్పందిస్తూ ‘నేను ఎలా దురదృష్టవంతురాలినో చెప్పగలరా. మీ సమాధానం కోసం వేచి చూస్తున్నా’అని రిప్లై ఇచ్చారు. తాజాగా ఆస్క్రీన్ షాట్లను పంచుకుంటూ.. ‘దురదృష్టవంతురాలు అనే మాట నన్ను ఎంతగానో బాధిస్తోంది. నా భర్త నన్ను వదిలేసి, వేరే పెళ్లి చేసుకుంటే, కొంతమంది వ్యక్తులు సంవత్సరాలుగా అలా కామెంట్ చేస్తుండటం బాధగా ఉంది. ఆ మాటలు విని విని విసిగొచ్చింది. నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో ఎందుకు మీరు ముడిపెడుతున్నారు. నా జీవితంలో ఇప్పటివరకూ నాకు దక్కిన ప్రతి విషయానికి నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నా. అలాగే, నాకు లేని వాటి గురించి నేనెప్పుడూ బాధపడలేదు. విడాకులు తీసుకున్నంత మాత్రాన స్త్రీ, పురుషులు దురదృష్టవంతులు కాదని తెలుసుకుంటే చాలు. కేవలం వాళ్ల వైవాహిక జీవితం మాత్రమే ముందుకు సాగలేదు’’ అని రేణూ దేశాయ్ పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్ కింద కామెంట్ పెడుతూ, ‘మనం 2024లో ఉన్నాం. ఒకరి అదృష్టాన్ని అతడు/ఆమె విడాకుల కారణంగానో లేదా చనిపోయిన భాగస్వామితో పోల్చి చెప్పడంతోనో ఇకనైనా ఆపండి. ఇప్పటికైనా సమాజం మారాలి. విడాకులు తీసుకున్న వ్యక్తిని ఓ మనిషిగా చూడండి. వారి ప్రతిభ, శ్రమ ఆధారంగా గుర్తింపునివ్వండి. పాతవాటిని తవ్వుకుంటూ చేసే ఆలోచనల్ని పక్కన పెట్టి మైండ్ సెట్ మార్చుకోండి’’ అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పవన్కల్యాణ్కు దూరంగా ఉంటున్న ఆమెపై ఇకనైనా విమర్శలు చేయడం ఆపాలంటూ పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీని పెళ్లికి ఆహ్వానించిన వరలక్ష్మీ శరత్ కుమార్.. థ్యాంక్స్ చెబుతూ పోస్ట్
వరలక్ష్మీ శరత్కుమార్ తన పెళ్లికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఆ ఫొటోలను ఎక్స్లో షేర్ చేశారు. -
‘కల్కి’.. రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: రజనీకాంత్
‘కల్కి’పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు. -
ఆ కథలేవీ నిజం కావు.. అందుకే సంతోషంగా ఉంది: కమల్ హాసన్
‘భారతీయుడు 2’ జులై 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా విశేషాలు పంచుకుంటోంది. -
రకుల్ప్రీత్ సింగ్ ‘వర్కౌట్స్’.. ఎడారిలో మాళవిక.. నభా ‘కాఫీ’ కబుర్లు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘కల్కి’ రికార్డుల గురించి అడగడం హాస్యాస్పదం: చిత్ర నిర్మాత
‘కల్కి’ రికార్డుల గురించి తనకు ఫోన్ చేసి అడగడం ఆశ్చర్యంగా ఉందని నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్ అన్నారు. -
ఇన్స్టా అకౌంట్ డిలీట్ చేసిన విశ్వక్ సేన్!
విశ్వక్సేన్ చివరిగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో కనిపించారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం ‘నెట్ఫ్లిక్స్’ (Netflix)లో ప్రసారమవుతోంది. -
ప్రభాస్తో ఫరియా అబ్దుల్లా.. పారిస్లో మృణాళిని రవి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘కల్కి’ విడుదల.. ఆ విషయంపై పోస్ట్ పెట్టిన నిర్మాణ సంస్థ
‘కల్కి’ విడుదల నేపథ్యంలో నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. సినిమా సన్నివేశాలను పంచుకోవద్దని తెలిపింది. -
కృతిశెట్టి ‘పాజిటివ్ వైబ్స్’.. అనన్యా పాండే సెల్ఫీ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ అభిమానిని కలిసిన నాగార్జున.. ప్రశంసిస్తోన్న నెటిజన్లు
ఇటీవల నాగార్జునను కలిసేందుకు వచ్చిన అభిమానిని ఆయన భద్రతా సిబ్బంది లాగేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ అభిమానిని నాగార్జున కలిశారు. -
ఈరోజుల్లో ఎంతమంది హీరోయిన్లు దీనికి సిద్ధంగా ఉన్నారు?: పరిణీతి చోప్రా
సవాళ్లతో కూడిన పాత్రలు చేస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారని బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా అన్నారు. ‘అమర్ సింగ్ చంకీల’ కోసం తాను 16 కిలోల బరువు పెరిగినట్లు చెప్పారు. -
రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..
రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం అందుకున్నారు. -
జాన్వీ ‘ఫ్యాషన్’ హొయలు.. సెల్ఫీతో వర్ష.. శివాని ‘బ్లాక్ అండ్ వైట్’!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన టీమ్
కత్రినా కైఫ్ ప్రెగ్రెంట్ అంటూ వస్తోన్న వార్తలపై ఆమె టీమ్ స్పందించింది. ఊహాగానాలు ఆపేయాలని తెలిపింది. -
ఫ్రెండ్ పెళ్లిలో రష్మిక సందడి.. కృతిశెట్టి ‘ఇన్స్టా’ ఆనందం!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
షారుక్ సినిమాలో సమంత.. దర్శకుడి టీమ్ క్లారిటీ!
షారుక్ సరసన సమంత నటించనుందంటూ వస్తోన్న వార్తలపై రాజ్కుమార్ హిరాణీ సన్నిహితులు స్పందించారు. అవి నిరాధారమని పేర్కొన్నారు. -
తొలి సినిమా హీరోయిన్తో పవన్ కల్యాణ్.. ఫొటో వైరల్
పవన్ కల్యాణ్, సుప్రియ యార్లగడ్డ కలిసి దిగిన ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అదేంటో చూసేయండి.. -
అందుకే నా కుమారుడు వివాహం చేసుకోలేదు: సల్మాన్ తండ్రి
సల్మాన్ ఖాన్ పెళ్లిపై అతడి తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో సల్మాన్ కోరుకునే లక్షణాలున్న అమ్మాయి దొరకడం కష్టమన్నారు. -
ప్రభాస్ ‘కల్కి’ టికెట్లు బుక్ చేస్తే, రాజశేఖర్ ‘కల్కి’ టికెట్లు బుక్ అయ్యాయి!
ప్రభాస్ ‘కల్కి’ మూవీ టికెట్లు బుక్ చేసుకుందామనుకున్న ప్రేక్షకులకు రాజశేఖర్ ‘కల్కి’ మూవీ టికెట్లు బుక్ అవడంతో కంగుతిన్నారు. -
శేష్- అకీరా ఫొటో షేర్ చేసిన రేణూ దేశాయ్.. బికినీలో మానుషి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీ అనారోగ్యానికి కారణం తెలుసుకోవచ్చా?: నెటిజన్కు అనసూయ కౌంటర్
తనపై కామెంట్ చేసిన ఓ నెటిజన్కు అనసూయ కౌంటర్ వేశారు. ఏం జరిగిందంటే?
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. బార్బడోస్లో వాతావరణం ఎలా ఉందంటే?
-
అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ
-
పోర్టింగ్కు కొత్త రూల్.. సిమ్ మార్చాక 7 రోజులు ఆగాల్సిందే..!
-
ఆ క్యాంపెయిన్ సరైంది కాదు.. జట్టు వాతావరణం దెబ్బతినే అవకాశం: అశ్విన్
-
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM