Akira nandhan: మోదీతో అకీరా.. ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టిన రేణూదేశాయ్‌

మోదీతో అకీరా ఉన్న ఫొటోను రేణూ దేశాయ్‌ షేర్‌ చేశారు. ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Updated : 07 Jun 2024 13:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆంధ్ర ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ అఖండ విజయం సాధించినప్పటి నుంచి అకీరా తండ్రితోనే ఉంటున్నారు. అతడిని రాజకీయ ప్రముఖులకు పరిచయం చేస్తున్నారు పవన్‌. తాజాగా ప్రధాని మోదీని వీరు కలిసిన విషయం తెలిసిందే. దీనిపై రేణు దేశాయ్‌ (Renu Desai) ఓ ఎమోషనల్ పోస్ట్‌ పెట్టారు.

‘నాకు మొదటి నుంచి భాజపా అంటే అభిమానం. మోదీ (Narendra Modi) పక్కన నా కుమారుడిని చూస్తుంటే ఎంతో ఆనందంగా, ఎమోషనల్‌గా ఉంది. దానిని మాటల్లో వర్ణించలేను. మోదీ గారిని కలిశాక అకీరా (Akira Nandan) నాకు ఫోన్‌ చేసి తన అనుభూతిని పంచుకున్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని. తన చుట్టూ ఓ పాజిటివ్ వైబ్‌ ఉందని చెప్పాడు’ అని రాసుకొచ్చారు.

పవన్‌ కల్యాణ్‌ ‘థ్యాంక్స్‌ పోస్ట్‌’.. చిత్తశుద్ధితో ముందడుగేస్తాం

తాజాగా జరిగిన ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి పవన్‌ (Pawan Kalyan) తన కుటుంబంతో సహా హాజరయ్యారు. తన కుమారుడు అకీరాను సైతం దిల్లీకి తీసుకెళ్లారు. కూటమి నేతల భేటీ ముగిసిన అనంతరం మోదీకి తన కుటుంబాన్ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా అకీరా ప్రధాని మోదీకి నమస్కరిస్తుండగా అతడి భుజంపై చేయి వేసి మోదీ (PM Modi) మాట్లాడుతున్న ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. వీటినే ఇన్‌స్టాలో రేణూ దేశాయ్‌ పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని