- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Rakesh Sashii: కథ, దర్శకుడు... కుదిరితేనే..!
‘‘నేను తీసే సినిమా కుటుంబమంతా కలిసి చూసేలా ఉండాలనుకుంటా. ‘ఊర్వశివో రాక్షసివో’ అలాంటి చిత్రమే’’ అన్నారు యువ దర్శకుడు రాకేశ్ శశి.
‘‘నేను తీసే సినిమా కుటుంబమంతా కలిసి చూసేలా ఉండాలనుకుంటా. ‘ఊర్వశివో రాక్షసివో’ అలాంటి చిత్రమే’’ అన్నారు యువ దర్శకుడు రాకేశ్ శశి (Rakesh Sashii). ‘జతకలిసే’ సినిమాతో మెగాఫోన్ పట్టిన ఈయన.... ‘విజేత’తో మెప్పించారు. తన మూడో చిత్రంగా ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo) తెరకెక్కించారు. అల్లు శిరీష్ (Allu Sirish) కథానాయకుడిగా జీఏ2 పిక్చర్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రాకేశ్ శశి గురువారం ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించారు.
* ‘‘కథానాయకుడు అల్లు శిరీష్తో ఆరేళ్లుగా పరిచయం ఉంది. మేం కలిసి సినిమా చేయాలని రెండు మూడుసార్లు అనుకున్నాం. కానీ కుదరలేదు. అనుకోకుండా నిర్మాత అల్లు అరవింద్ నుంచి పిలుపు వచ్చింది. ఆయన నేను తీసిన ‘విజేత’ని చూసి అప్పట్లో మెచ్చుకున్నారు. ఆయనే ఓ మంచి కథతో సినిమా చేద్దామని ప్రోత్సహించారు. అలా కుదిరిందే ‘ఊర్వశివో రాక్షసివో’. ప్రేమ, జీవితం, వృత్తి తదితర విషయాల్లో యువతరం ఎదుర్కొంటున్న సంఘర్షణ చుట్టూ సాగే కథ ఇది. ఇవే విషయాల్ని యువతరం చూసే కోణం వేరు, పెద్దలు చూసే కోణం వేరుగా ఉంటుంది. ఈ అంశాన్ని భిన్న మనస్తత్వాలున్న ఓ జంటతో ముడిపెట్టి తీసిన సినిమానే ఇది. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా వినోదం మేళవించి చేసిన సినిమా ఇది. శ్రీకుమార్, సింధు పాత్రల్లో శిరీష్, అను ఇమ్మానుయేల్ కనిపిస్తారు. రొమాంటిక్ సన్నివేశాలైనా, కామెడీ అయినా... ప్రతిదీ కథలో భాగంగానే పుట్టింది. అదే ఈ సినిమా ప్రత్యేకత’’.
* ‘‘విభిన్నమైన కథలతో సినిమాలు చేయడమంటేనే ఇష్టం. నా దగ్గర రకరకాల కాన్సెప్ట్లు ఉన్నాయి. ‘ఊర్వశివో రాక్షసివో’ కంటే ముందు కూడా యుద్ధం నేపథ్యంలో ఓ పీరియాడికల్ కథని తెరకెక్కించాలనుకున్నా. కానీ ముందు ఇదే చేయాల్సి వచ్చింది. అన్నీ కుదిరితే తదుపరి పీరియాడికల్ కథతోనే సినిమా చేస్తానేమో. కథానాయకులు, నిర్మాతలు, వాళ్ల అభిరుచులు... ఇలా ఇక్కడ అన్నీ కుదరాలి. అప్పుడే అనుకున్న సినిమాల్ని చేయగలుగుతాం. కేవలం నా కథలతోనే సినిమాలు చేయాలనుకోవడం లేదు. మంచి కథ అనుకున్నప్పుడు బయట కథలతోనూ సినిమా చేస్తా. ఆ విషయంలో నిర్మాత అల్లు అరవింద్ చెప్పిన మాటలే స్ఫూర్తి. ‘ఒక మంచి కథని సరైన దర్శకుడు చేయకపోతే సమస్య అవుతుంది. ఎంత మంచి దర్శకుడైనా, సరైన కథ లేదంటే సమస్య అవుతుంది. కథ ఎంత ముఖ్యమో, దాన్ని డీల్ చేసే దర్శకుడు కూడా అంతే ముఖ్యం. కథల విషయంలో పరిమితులు పెట్టుకోవద్దు’ అని చెప్పారు ఒకసారి. ‘ఊర్వశివో రాక్షసివో’ విడుదల తర్వాత కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచించాలి. జీఏ2 సంస్థలో మరో సినిమా చేయాల్సి ఉంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రోబో’, ‘2.ఓ’ల్లో కమల్ హాసన్ అందుకే నటించలేదు.. కారణాలివే
‘భారతీయుడు 2’తో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కమల్ హాసన్. ఈ సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. ‘రోబో’, ‘2.ఓ’ల్లో తానెందుకు నటించలేదో వివరించారు. -
అల్లరి నరేశ్ మాస్: ఆసక్తికరంగా ‘బచ్చల మల్లి’ గ్లింప్స్
‘బచ్చల మల్లి’గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు అల్లరి నరేశ్. ఈ హీరో పుట్టిన రోజు సందర్భంగా టీమ్ గ్లింప్స్ విడుదల చేసింది.
-
టీమ్ఇండియా విజయం.. సినీ ప్రముఖుల ఆనందం.. ఎవరేమన్నారంటే?
టీమ్ఇండియా విజయంపై పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. -
‘కల్కి’తో నా కోరిక నెరవేరింది
‘‘దర్శకుడు నాగ్ అశ్విన్ ఊహాశక్తి... అగ్ర తారలు ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికలపై ఉన్న నమ్మకమే ‘కల్కి 2898 ఎ.డి’ చేయగలిగే ధైర్యాన్నిచ్చింది’’ అన్నారు సి.అశ్వనీదత్. -
ఇప్పటికీ వాళ్లే నాకు స్ఫూర్తి
‘‘కష్టనష్టాల్ని కూడా స్వీకరించినప్పుడే చిత్రపరిశ్రమలో నటిగా నిలదొక్కుకోగలం’’ అని అంటోంది కథానాయిక మృణాల్ ఠాకూర్. ఓ పక్క కథానాయికగా మంచి అవకాశాలు అందుకుంటూనే ఇటీవలే విడుదలైన ‘కల్కి2898 ఎ.డి’లో అతిథి పాత్రలో తళుక్కున మెరిసిందీమె. -
బాలీవుడ్ ప్రేమలు.. గెలిచేనా తారలు?
యాక్షన్, ఫ్యామిలీ డ్రామాలు, కామెడీ ఎంటర్టైన్లు.. ఇలా జానర్ ఏదైనా ప్రేమ కథలంటే సినీప్రియులకు ఇంకాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది. ఎన్ని భిన్నమైన కథలు, పాత్రలు వచ్చినా.. ప్రేమకథల్లో కొత్తదనాన్ని వెతుక్కొని మరీ సినిమాల్ని ఆస్వాదిస్తుంటారు అభిమానులు. -
జంటగా మురిపించేనా!
‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. ఇప్పుడామె సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రంతో తెలుగులోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. -
‘బెంజ్’లోకి ఈ ఇద్దరూ!
‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఇప్పుడాయన కథతో ‘రెమో’ ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బెంజ్’. -
కశ్మీర్కు వెల్కమ్
మరికొద్దిరోజుల్లో ‘సర్ఫిరా’తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న ఆయన.. ‘వెల్కమ్ టు ది జంగిల్’లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
స్టైలిష్ అనసూయ.. చీరకట్టులో విష్ణు ప్రియ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్లు, ఫొటోలు మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
ప్రశ్నించే విద్యార్థులు, నిరుద్యోగులపై కేసులా?: హరీశ్రావు
-
దేశ అత్యున్నత అధికారులుగా..చిన్ననాటి స్నేహితులు
-
తితిదే ఈవో ఆగ్రహం.. అందుబాటులోకి గత పాలకమండలి తీర్మానాలు
-
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
-
‘రోబో’, ‘2.ఓ’ల్లో కమల్ హాసన్ అందుకే నటించలేదు.. కారణాలివే
-
16ఏళ్లు ఎదురు చూశాం.. ప్రాణాల కోసం నిమిషాలు ఓపిక పట్టలేమా..పోస్ట్ వైరల్