Rajinikanth: భాగ్యనగరంలో కూలీ

‘కూలీ’ కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు రజనీకాంత్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Published : 05 Jul 2024 01:29 IST

‘కూలీ’ కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు రజనీకాంత్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈరోజు నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభించుకోనుందని సమాచారం. ఇందుకోసం రజనీ ఇప్పటికే భాగ్యనగరానికి చేరుకున్నారు. దాదాపు 35రోజుల పాటు ఈ షెడ్యూల్‌ ఇక్కడే కొనసాగనున్నట్లు తెలిసింది. బంగారం స్మగ్లింగ్‌ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండనున్నట్లు తెలిసింది. ఇందులో శ్రుతిహాసన్, సత్యరాజ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు టాక్‌. అనిరుధ్‌ సంగీతమందిస్తుండగా.. గిరీష్‌ గంగాధరన్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని