- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Rajinikanth: భాగ్యనగరంలో కూలీ
‘కూలీ’ కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు రజనీకాంత్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
‘కూలీ’ కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు రజనీకాంత్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈరోజు నుంచి హైదరాబాద్లో చిత్రీకరణ ప్రారంభించుకోనుందని సమాచారం. ఇందుకోసం రజనీ ఇప్పటికే భాగ్యనగరానికి చేరుకున్నారు. దాదాపు 35రోజుల పాటు ఈ షెడ్యూల్ ఇక్కడే కొనసాగనున్నట్లు తెలిసింది. బంగారం స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రం ఉండనున్నట్లు తెలిసింది. ఇందులో శ్రుతిహాసన్, సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు టాక్. అనిరుధ్ సంగీతమందిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కెరటాలపై కెప్టెన్ల చూపు
కొత్తతరంతోనే ఓ కొత్త కథ చెప్పాలనే ప్రయత్నమో లేక... స్టార్ హీరోలతో సినిమా చేసే పరిస్థితులు లేకపోవడమో... కారణాలేమైనా పలువురు సీనియర్ దర్శకులు ఇప్పుడు నవతరం కథానాయకులతో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. -
నెమ్మదైనా.. ఈ ప్రయాణం సంతృప్తిగానే ఉంది!
బలమైన కథలకు.. శక్తిమంతమైన మహిళా పాత్రలకు చిరునామాగా నిలుస్తుంటాయి సుధా కొంగర చిత్రాలు. ఇప్పుడామె దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం ‘సర్ఫిరా’. ఇది సుధా - సూర్య కాంబోలో వచ్చిన విజయవంతమైన సినిమా ‘సూరారై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’)కు రీమేక్గా రూపొందింది. -
శరవేగంగా వరుణ్, జాన్వీల ప్రేమకథ
‘బవాల్’తో ప్రేక్షకుల్ని అలరించిన వరుణ్ ధావన్, జాన్వీ కపూర్.. ఇప్పుడు మరోసారి ప్రేమికులుగా తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతున్నారు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారి కీ తులసీ కుమారీ’. -
మా ‘డార్లింగ్’ అందర్నీ మెప్పిస్తుంది
‘‘వినోదం.. భావోద్వేగాలతో కుటుంబ సమేతంగా కనెక్ట్ అయ్యేలా తీసిన చిత్రం ‘డార్లింగ్’. తప్పకుండా ఇది అందర్నీ మెప్పిస్తుంది’’ అన్నారు నిర్మాత చైతన్య రెడ్డి. ‘హనుమాన్’ విజయం తర్వాత చైతన్య, కె.నిరంజన్ రెడ్డిల సంయుక్త నిర్మాణం నుంచి వస్తున్న చిత్రమే ‘డార్లింగ్’. -
రాజమౌళి జీవితంపై డాక్యుమెంటరీ
భారతీయ సినిమాను ఆస్కార్ వేదికపై సగర్వంగా నిలబెట్టిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రాలతో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించిన ఈయనపై ‘మోడ్రన్ మాస్టర్స్:ఎస్ ఎస్ రాజమౌళి’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది నెట్ఫ్లిక్స్ సంస్థ. -
రామ్చరణ్ ముగించారు
కథానాయకుడు రామ్చరణ్.. దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్రాజు నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. ఎస్.జె.సూర్య, అంజలి, శ్రీకాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
ఆలస్యంగా సబర్మతీ రిపోర్ట్
ఎంతో మంది జీవితాల్ని మార్చేసిన గోద్రా రైలు దహన కాండలోని రహస్యాలను ప్రపంచానికి చూపించడానికి వస్తోంది ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. -
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
సామాజిక మాధ్యమాల వేదికగా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర ఫొటోలు, విశేషాలు మీకోసం.. -
ఓటీటీలో ఫహద్ ఫాజిల్ ‘ధూమం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఫహాద్ ఫాజిల్ (Fahad Faasil) కీలక పాత్రలో నటించిన మలయాళ(Malayalam) మూవీ ధూమం. ఇప్పటికే ఓటీటీ వేదిక యాపిల్లో స్ట్రీమింగ్ అవుతుండగా, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
వయసు 57.. సెంచరీలు 1000
-
ఏపీలోని ఆ ఐదు గ్రామాలు.. మళ్లీ భద్రాచలంలో కలిసేనా..?
-
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..
-
పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం
-
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర