- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Balakrishna: బాలయ్యబాబు కూర్చొన్న దగ్గర ఏ బాటిల్ లేదు.. అదంతా సీజీ: నాగవంశీ
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్లో బాలకృష్ణ కూర్చొన్న కుర్చీ దగ్గర మందుబాటిల్ ఉందంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వీడియోను వైరల్ చేశారు. దీనిపై నిర్మాత నాగవంశీ స్పష్టత ఇచ్చారు.
హైదరాబాద్: విశ్వక్సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari). ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ వేడుకకు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ (Balakrishna) విచ్చేసి సందడి చేశారు. ఈ మూవీ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. అయితే, ఈవెంట్లో బాలకృష్ణ కూర్చొన్న కుర్చీ దగ్గర మందుబాటిల్ ఉందంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వీడియోను వైరల్ చేశారు. దీనిపై చిత్ర నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్)లో క్రియేట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. ఈవెంట్ నిర్వహించడంతో పాటు, ఆసాంతం తాను అక్కడే ఉన్నానని అసలు అలాంటి బాటిల్ ఏదీ లేదని తెలిపారు. కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్మీడియాలో అనవసర చర్చ తప్ప ఏమీ లేదన్నారు. దీనిపై కథానాయకుడు విశ్వక్సేన్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ఆ వీడియోను సీజీలో క్రియేట్ చేసిన వ్యక్తి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి-2’ కోసం పని చేయబోతున్నారని చురకలు అంటించారు.
ఇక వేదికపై నటి అంజలిని బాలకృష్ణ చేతితో నెట్టడంపైనా నాగవంశీ స్పందించారు. కార్యక్రమంలో పెద్ద శబ్దాల వల్ల సరిగా వినిపించకపోవడంతో ఫొటోకు పోజు ఇచ్చేందుకు వెనక్కి జరగాలని బాలయ్య చనువుకొద్దీ అలా చేశారని అన్నారు. నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు తమకున్న పరిచయం, చనువును బట్టి అలా ఎవరైనా చేస్తారని అన్నారు. ఆ చర్యకు ముందూ, వెనక ఉన్న పూర్తి వీడియోను చూడకుండా ఇలాంటి వాటిని ప్రచారం చేయడం తగదని అన్నారు. ఆ తర్వాత బాలకృష్ణ, అంజలి హై ఫై అంటూ చేతులతో చప్పట్లు చరుచుకున్న సీన్ ఎవరూ చూపించలేదన్నారు.
ఎందుకు స్పెషల్ షోలు..?
మీడియా కోసం ప్రత్యేకంగా షోలు వేయాల్సిన అవసరం లేదని, రివ్యూ కోసం సినిమా చూడాలనుకుంటే టికెట్ కొనుక్కొని చూసి, రాయొచ్చని నిర్మాత నాగవంశీ అన్నారు. మీడియా వాళ్లు కూడా తమ కుటుంబాలతో కలిసి సినిమా చూడాలనే ఉద్దేశంతో స్పెషల్ షో వేయడం లేదన్నారు. కావాలనుకుంటే సినిమా విడుదలైన రెండోరోజు స్పెషల్ షో వేస్తామన్నారు. మరోవైపు విశ్వక్సేన్ కూడా ఈ విషయమై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కేవలం మీడియా మాత్రమే స్పెషల్ షో చూస్తే, ఎలాంటి స్పందన లేకుండా మౌనంగా ఉండటం వల్ల తాము ఏదైనా తప్పు చేశామా? అన్న భావన కలుగుతోందన్నారు. అదే ప్రేక్షకుల మధ్య మూవీ చూస్తే వాళ్ల పల్స్ తెలుస్తుందన్నారు. అందుకే ప్రీమియర్ చూడాలనుకునే మీడియా మిత్రులు సగం మంది ఒక స్క్రీన్లో, మిగిలిన సగం మరొక స్క్రీన్లో ప్రేక్షకుల మధ్య చూస్తే, వాళ్లు ఎలా స్పందిస్తున్నారో తెలుస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
సాయం చేయాలంటూ మంచు లక్ష్మి విజ్ఞప్తి.. సోషల్ మీడియాలో పోస్ట్
వీసా విషయమై తనకు సాయం చేయాలంటూ మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అసలు ఏమైందంటే? -
సీఎం రేవంత్రెడ్డి సూచనపై స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్
సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ అవగాహన కల్పించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) సూచనలపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (TFCC) స్పందించింది. -
అమ్మాయిలను ఆ ఒక్క ప్రశ్న అడగొద్దు: శ్రుతి హాసన్
శ్రుతి హాసన్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఫన్నీ రిప్లై ఇచ్చారు. -
ఇంటర్నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న ధనుష్ చిత్రం
ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. -
జపాన్లో విడుదలకు సిద్ధమైన ఇండియన్ సినిమాలు.. ఏవంటే
ప్రభాస్, షారుక్ ఖాన్ల సినిమాలు జపాన్లో విడుదలకు సిద్ధమయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో సందడి నెలకొంది. -
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
నటి వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
హైదరాబాద్ను చుట్టేసిన నభా నటేశ్.. కృతి సనన్ స్టైలిష్ డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
సినిమాల్లో నటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్
సినిమాల్లో నటించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. -
ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవాలి?: నెటిజన్కు రకుల్ప్రీత్ రిప్లై
తన పెళ్లి గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా రకుల్ప్రీత్ సింగ్ తనదైన శైలిలో స్పందించారు. -
రామ్ చరణ్ దంపతుల మాటతో నా సంతోషం వెయ్యి రెట్లు పెరిగింది: జానీ మాస్టర్
రామ్ చరణ్ దంపతులు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. డ్యాన్స్ర్స్ యూనియన్లోని కుటుంబాలకు సాయం చేయనున్నారు. -
రజనీకాంత్, విజయ్ల రికార్డులు బ్రేక్ చేసిన ప్రభాస్.. ‘కల్కి’ వసూళ్లు ఎంతంటే!
ప్రభాస్ ‘కల్కి’ రజనీకాంత్, విజయ్ చిత్రాల రికార్డులను బ్రేక్ చేసింది. ఆరు రోజుల్లోనే ఈ చిత్రాల వసూళ్లను అధిగమించడం విశేషం. -
పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించారు: పరుచూరి గోపాలకృష్ణ
పవన్ కల్యాణ్కు తాను వీరాభిమానినని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. -
టాటూ రూమర్స్పై దిశా పటానీ అలా.. వెంకటేశ్ సినిమాలో ఐశ్వర్య ఇలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టాలీవుడ్కు సీఎం రేవంత్ సూచన.. స్పందించిన మోహన్ బాబు
టాలీవుడ్కు సీఎం రేవంత్ ఇచ్చిన కీలక సూచనపై నటుడు మోహన్ స్పందించారు. ఏమన్నారంటే? -
షారుక్ ఖాన్కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్కు అరుదైన గౌరవం దక్కింది. -
ఆ సాంగ్ వచ్చే టైమ్కు థియేటర్కు పంపాడు.. ప్రభాస్పై హంస నందిని కామెంట్స్
ప్రభాస్కు బిడియం ఎక్కువని హంసనందిని అన్నారు. ‘మిర్చి’ రోజులను గుర్తుచేసుకున్నారు. -
హీనా ఖాన్ నువ్వు వారియర్వి.. నటికి ధైర్యాన్నిచ్చిన సమంత
హీనా ఖాన్కు ధైర్యాన్నిస్తూ సమంత పోస్ట్ పెట్టారు. ఆమెను వారియర్గా పేర్కొన్నారు. -
‘రాజాసాబ్’ స్టోరీ లైన్ వైరల్.. ఫన్నీ రిప్లై ఇచ్చిన నిర్మాత
‘రాజా సాబ్’ స్టోరీ లైన్ను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ పోస్ట్ చేసింది. దీనిపై టాలీవుడ్ నిర్మాత ఫన్నీగా స్పందించారు. -
మా ఇద్దరి మధ్య అసూయ లేదు: రజనీకాంత్తో స్నేహంపై కమల్ హాసన్ కామెంట్స్
రజనీకాంత్తో స్నేహం 20ఏళ్ల నుంచి కొనసాగుతోందని కమల్హాసన్ అన్నారు. వారి అనుబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
రకుల్ప్రీత్ మోటివేషన్.. నభా ప్రమోషన్.. రుహానీ శర్మ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘మీర్జాపూర్’ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.. వాటిని పట్టించుకోవద్దు: విజయ్ వర్మ
-
అమరావతి నిర్మాణానికి తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విరాళం
-
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
-
పెద్ద అంబర్పేట సమీపంలో పోలీసుల కాల్పులు
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ
-
క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్