SSMB29: హీరో - విలన్‌?

అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తన తదుపరి సినిమా పనుల్ని ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియని పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు.

Published : 03 Jul 2024 01:32 IST

గ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తన తదుపరి సినిమా పనుల్ని ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియని పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కనున్న ఆ చిత్రంలో ఆయన్ని ఢీ కొట్టే ప్రతినాయక పాత్ర కోసం మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఎంపిక దాదాపు ఖాయమైనట్టు సమాచారం. ఇప్పటివరకూ చేసిన చిత్రాలకంటే భారీగా, అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు రాజమౌళి. అందుకు తగ్గట్టే నటీనటులు, సాంకేతిక బృందం ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవుతున్నారు.

ఈ ఏడాదిలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. విజయేంద్రప్రసాద్‌ అందించిన ఈ సినిమా కథపై పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. దర్శకుడు రాజమౌళి మాత్రం తన సినిమాల్లోని కథలు, పాత్రలకు సంబంధించిన విషయాల్ని ఎంతో రహస్యంగా ఉంచుతూ... సరైన సందర్భాన్ని చూసుకుని బయట పెడుతుంటారు. ప్రపంచాన్ని చుట్టే ఓ సాహస ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందనే విషయం మాత్రమే ఇప్పటివరకూ బయటికొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని