pawan kalyan: పవన్‌ కల్యాణ్‌ ‘థ్యాంక్స్‌ పోస్ట్‌’.. చిత్తశుద్ధితో ముందడుగేస్తాం

తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతిఒక్కరికీ పవన్‌ కల్యాణ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Updated : 06 Jun 2024 20:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన గెలుపుపై స్పందించి, శుభాకాంక్షలు చెప్పిన ప్రతిఒక్కరికీ జనసేన అధినేత, నటుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కృతజ్ఞతలు తెలిపారు. తాము అందుకున్న విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు.

ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి చిరంజీవిని కలిసిన పవన్‌కల్యాణ్‌

‘‘సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సాధించిన అఖండ విజయాన్ని అభినందిస్తూ చాలామంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రైతులు, కార్మికులు, పారిశ్రామిక వేత్తలు, సామాజిక వేత్తలు, విద్యావంతులు, మేధావులు, మహిళలు, యువత.. ఇలా అందరూ ఈ విజయంపై సంతోషాన్ని వ్యక్తంచేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ కథానాయకులు, నటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు చెప్పారు. తెలుగుతోపాటు తమిళ్‌, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన శ్రేయోభిలాషులు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సాధించిన విజయాన్ని స్వాగతిస్తూ అభినందనలు తెలిపిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం మా అందరిపై బాధ్యతను మరింత పెంచింది. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తాం’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు