Pawan Kalyan-Chiranjeevi: ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి చిరంజీవిని కలిసిన పవన్‌కల్యాణ్‌

అగ్ర కథానాయకుడు, తన సోదరుడు చిరంజీవిని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురువారం కలిశారు

Updated : 06 Jun 2024 19:39 IST

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) తన సోదరుడు, అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)ని కలిశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలనూ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో దిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశాన్ని ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన పవన్‌కల్యాణ్‌ గురువారం మధ్యాహ్నం చిరంజీవి నివాసానికి వచ్చారు. మరోవైపు ఈ విజయోత్సవంలో భాగం అయ్యేందుకు మెగా కుటుంబ సభ్యులందరూ చిరు ఇంటికి చేరుకున్నారు.

చిరు నివాసానికి వచ్చిన పవన్‌కు ఘన స్వాగతం లభించింది. తల్లి అంజనాదేవి పవన్‌, అన్నాలెజినోవా, అకీరాలకు గుమ్మడికాయతో దిష్టి తీయగా, పవన్‌ వదినలు నీరాజనాలు ఇస్తూ లోపలికి ఆహ్వానించారు. చిరంజీవి రాగానే నేరుగా ఆయన కాళ్లకు నమస్కారం చేయగా, పవన్‌ పైకి లేపి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పైకి ఎగిరి మరీ చిరు పూలదండ వేయగా మెగా కుటుంబంలో సంతోషాలు వెల్లివెరిశాయి. ఈ సందర్భంగా ‘కల్యాణ్‌బాబు హ్యాట్సాఫ్‌’ అని రాసి ఉన్న కేక్‌ను కట్‌ చేసి పవన్‌ తన కుటుంబ సభ్యులకు తినిపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని