- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Chiranjeevi: రొటీన్ చిత్రమే కానీ గొప్ప ఎమోషన్ ఉంది
‘‘ప్రతి ఒక్కరూ ప్రేమను పంచి.. ప్రేమను పొంది చేసిన చిత్రమే ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా గురించి మీరు ఎంతైనా ఊహించుకోండి.. కచ్చితంగా దాన్ని మించేలాగే ఉంటుంది. ’’ అన్నారు చిరంజీవి.
‘‘ప్రతి ఒక్కరూ ప్రేమను పంచి.. ప్రేమను పొంది చేసిన చిత్రమే ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా గురించి మీరు ఎంతైనా ఊహించుకోండి.. కచ్చితంగా దాన్ని మించేలాగే ఉంటుంది. ’’ అన్నారు చిరంజీవి. ఆయన కథానాయకుడిగా బాబీ (కె.ఎస్.రవీంద్ర) తెరకెక్కించిన చిత్రమే ‘వాల్తేరు వీరయ్య’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. శ్రుతిహాసన్ కథానాయిక. రవితేజ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘బాబీ కథ చెప్పినప్పుడే ఇందులో ఏదో విషయం ఉందనిపించింది. కచ్చితంగా బ్లాక్బస్టర్ హిట్టవుతుంది అనిపించింది. ఇది రొటీన్ యాక్షన్ ఎంటర్టైనరే.. కానీ, లోపల మీరు షాక్ తినేంత వైవిధ్యమైన ఎమోషన్ దాగి ఉంది. అలాగే ఇందులో నా కామెడీ చాలా బాగా పండింది. ఈ సినిమాకి క్లాస్కు క్లాస్.. మాస్కు మాస్ చాలా అద్భుతమైన పాటలిచ్చారు దేవిశ్రీ ప్రసాద్. రామ్ - లక్ష్మణ్, పీటర్ హెయిన్స్ పోరాటాలు, ప్రకాష్ ఆర్ట్ వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ నా శైలిని చక్కగా పట్టేశారు. చాలా తక్కువ రోజుల్లో పాటలన్నీ పూర్తి చేశారు. శ్రుతిహాసన్ గడ్డ కట్టించే చలిలో ఎంతో అద్భుతంగా నటించింది. ఆ పాట చాలా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు. ‘‘సినిమా చూసి చెబుతున్నా.. రాబోయే రోజుల్లో చాలా వేడుకలు ఉండబోతున్నాయి. ఈ చిత్రం ఇంత అద్భుతంగా వచ్చిందంటే దానికి చిరంజీవి, రవితేజ అందించిన ప్రోత్సాహమే కారణం’’ అన్నారు దర్శకుడు బాబీ. నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘ఈ కథ విన్నప్పుడే మళ్లీ ఓ మెగా హిట్ తప్పదనిపించింది. ఈ సంక్రాంతికి నిజమైన పండగ ‘వాల్తేరు వీరయ్య’’ అన్నారు. ‘‘ఇది మాకు చాలా పెద్ద సినిమా. బాబీ అద్భుతమైన కథ సిద్ధం చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి, రవితేజ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. 13నే ఈ చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేయనున్నాం’’ అన్నారు నిర్మాత రవిశంకర్. ఈ కార్యక్రమంలో రవితేజ, ఊర్వశీ రౌతేలా, చెర్రీ, రామ్ - లక్ష్మణ్, ప్రకాష్, దేవిశ్రీ ప్రసాద్, చంద్రబోస్, శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ‘గురువాయూర్ అంబలనాదయిల్’.. మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
Guruvayoor Ambalanadayil Review: పృథ్వీరాజ్ సుకుమార్, బసిల్ జోసెఫ్ కీలక పాత్రల్లో విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ‘గురువాయూర్ అంబలనాదయిల్’ ఎలా ఉందంటే? -
రెండు కొత్త చిత్రాల షూటింగ్ షురూ.. అవేంటంటే!
‘యుఫోరియా’ (Euphoria) షూటింగ్ను గుణశేఖర్ ప్రారంభించారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మరో చిత్రాన్ని మొదలుపెట్టారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’లాంటి సినిమాలు చాలా అరుదు.. ఆడియన్స్కు థ్యాంక్స్ చెప్పిన నాగ్ అశ్విన్
‘కల్కి’ని ఆదరించినందుకు అమెరికన్ ఆడియన్స్కు నాగ్ అశ్విన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయని చెప్పారు. -
కొత్త రూపు... తారల ముందు చూపు
ప్రతి సినిమాకీ కథ...ఆ కథకు తగ్గట్టుగా పాత్ర... పాత్రకు తగ్గట్టుగా రూపం మారుతూనే ఉంటాయి. అలా ప్రతి విషయంలోనూ కొత్తదనం చూపిస్తూ, తమని తాము తెరపై సరికొత్తగా ఆవిష్కరించుకోవడంపై నేటితరం కథానాయకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. -
ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి!
ఇటీవలే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అల్లరి నరేశ్. ఇప్పుడు ‘బచ్చల మల్లి’గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సుబ్బు మంగదేవి తెరకెక్కిస్తున్నారు. -
ఎన్టీఆర్ పురస్కారం ఓ ప్రత్యేక గౌరవం: మురళీమోహన్
ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని అందుకోవడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు ప్రముఖ నటుడు మురళీమోహన్. ‘అన్నదమ్ముల అనుబంధం’లో కలిసి నటించాక ఆయన కుటుంబంలో నేనూ ఓ భాగమైపోయానన్నారు. -
ఈటీవీలో రెండు సరికొత్త సీరియల్స్
ప్రతి మధ్యాహ్నాన్ని మరింత వినోదభరితంగా మార్చేందుకు మరో రెండు సరికొత్త సీరియల్స్ను తీసుకొచ్చింది మీ ఈటీవీ. మనసుకు హత్తుకునే విధంగా రూపొందిన ‘వసంతకోకిల’ మధ్యాహ్నాం 1.30గం.కు, ‘కాంతార’ మ.2గం.కు సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం కాబోతున్నాయి. -
సెట్లోకి వస్తే కెమెరానే మా లోకం
‘దృశ్యం’, ‘భోళా’, ‘దే దే ప్యార్ దే’ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి హిట్ జోడీ అనిపించుకున్నారు బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్, టబు. -
సుధా కొంగర దర్శకత్వంలో ధనుష్?
‘సర్ఫిరా’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు దర్శకురాలు సుధా కొంగర. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’కు రీమేక్గా రూపొందింది. -
నటికి ఇంతకన్నా ఏం కావాలి?
‘‘అభిమానులు నా పని గురించే మాట్లాడాలనేది నాకు ఎప్పట్నుంచో ఉన్న కోరిక’’ అని అంటోంది అందాల తార త్రిప్తి దిమ్రీ. ‘యానిమల్’తో హిట్ అందుకున్న ఈ భామ..త్వరలో ‘బ్యాడ్ న్యూజ్’ అనే కామెడీ ఎంటర్టైనర్తో రావడానికి ముస్తాబవుతోంది. -
‘మిస్టర్ ఎక్స్’ పూర్తి చేశాడు
తమిళ కథానాయకుడు ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఎక్స్’. మను ఆనంద్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో గౌతమ్ కార్తిక్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన మైథాలాజిక్, సైన్స్ ఫిక్షన్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. -
ఖుషీ స్వెట్టర్ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా
social look: సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
అర్జునుడిగా నేను.. ప్రభాస్ కర్ణుడు.. అలాగే చూడండి: విజయ్ దేవరకొండ
కల్కి మూవీలో తన పాత్ర గురించి నటుడు విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో ఉన్న ఇంజినీర్ రషీద్ ప్రమాణ స్వీకారానికి ఎన్ఐఏ అనుమతి
-
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్రెడ్డి భేటీ
-
ఎన్టీఆర్ భవన్పై దాడి ఘటన.. విచారణ చేపట్టిన పోలీసులు
-
రివ్యూ: ‘గురువాయూర్ అంబలనాదయిల్’.. మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
-
యుద్ధం చేస్తామంటే విడుదల చేస్తాం.. ఖైదీలకు ఆఫర్
-
ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!