Lakshmi Manchu: సాయం చేయాలంటూ మంచు లక్ష్మి విజ్ఞప్తి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌

వీసా విషయమై తనకు సాయం చేయాలంటూ మంచు లక్ష్మి సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు. అసలు ఏమైందంటే?

Published : 05 Jul 2024 00:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వీసా అప్రూవ్‌ అయినా దాన్ని ఇంకా తాను పొందలేదని, ఆ సమస్యకు పరిష్కారం చూపాలంటూ నటి, నిర్మాత మంచు లక్ష్మి (Lakshmi Manchu) సోషల్‌ మీడియా వేదికగా అభిమానులను కోరారు. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు రాయబారి ఎరిక్‌ గార్సెట్టి సామాజిక మాధ్యమాల ఖాతాలనూ ట్యాగ్‌ చేస్తూ తన పరిస్థితి వివరించారు. సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు.

‘‘అమెరికా సిటిజన్‌ అయిన నా కుమార్తె స్కూల్‌ హాలీడేస్‌ త్వరలోనే ముగియనున్నాయి. ఈ నెల 12న మేం అక్కడకు వెళ్లాల్సి ఉంది. ఎంబసీ (రాయబార కార్యాలయం) వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. వారిని సంప్రదించేందుకు నాకు మార్గం లేకుండా పోయింది. వీసా జారీ అయి నెలకుపైనే అయినా దాన్ని చేరవేయడంలో జాప్యం చోటుచేసుకుంది. ఎవరైనా హెల్ప్‌ చేయగలరా?’’ అని అభ్యర్థించారు. ఈ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ తమకు తెలిసిన సమాచారం ఇవ్వగా.. ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ తీసుకుని నేరుగా ఎంబసీకి వెళ్లండంటూ మరికొందరు సలహా ఇస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని