- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Kartik Aaryan: ఈ పాత్ర నా జీవితాన్నే మార్చేసింది
నాయకానాయికలు ఎన్ని సినిమాలు చేసినా.. వారి జీవితంలో కొన్ని చిత్రాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
నాయకానాయికలు ఎన్ని సినిమాలు చేసినా.. వారి జీవితంలో కొన్ని చిత్రాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలా తన సినీ ప్రయాణంలో ‘చందు ఛాంపియన్’ మరపురానిది అంటున్నాడు బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్. ఆయన ప్రధాన పాత్రలో ఒలింపియన్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా కబీర్ ఖాన్ తెరకెక్కించిన చిత్రమిది. గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. కార్తిక్ నటన అందర్నీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా పట్ల తన ఆనందాన్ని ఇన్స్టా వేదికగా కార్తిక్ తెలుపుతూ...‘మనం నటించిన కొన్ని పాత్రలు మనసును హత్తుకుంటాయి. జీవితాన్నే మార్చేస్తాయి. ఆ విధంగా ‘చందు ఛాంపియన్’లో నేను పోషించిన మురళీకాంత్ పేట్కర్ పాత్ర నా ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ పాత్ర విషయంలో నా చేయి పట్టుకొని నడిపించిన దర్శకుడు కబీర్ఖాన్ సర్కి కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చారు. ‘స్ఫూర్తిదాయక, అసమాన పోరాటతత్వం ఉన్న కథ ఇది. మానవ సంకల్ప బలానికి సంబంధించింది కాబట్టే అందరి మనసుల్ని కదిలిస్తోంది. ఎంతోమంది తమ కలల్ని సాకారం చేసుకునేందుకు స్ఫూర్తినిస్తోంది. నాలోని భావోద్వేగాలను తట్టి లేపిన చిత్రమిది’ అంటూ ముగించాడు. త్వరలో ‘భూల్ భులయ్యా 3’తో నవ్వించేందుకు రానున్నాడు కార్తిక్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభాస్ పెళ్లిపై స్పందించిన శ్యామలా దేవి.. సక్సెస్ రాదన్నారు వచ్చింది
ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి మరోసారి స్పందించారు. ఈసారి ఆమె ఏమన్నారంటే? -
కొత్త కెరటాలపై కెప్టెన్ల చూపు
కొత్తతరంతోనే ఓ కొత్త కథ చెప్పాలనే ప్రయత్నమో లేక... స్టార్ హీరోలతో సినిమా చేసే పరిస్థితులు లేకపోవడమో... కారణాలేమైనా పలువురు సీనియర్ దర్శకులు ఇప్పుడు నవతరం కథానాయకులతో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. -
నెమ్మదైనా.. ఈ ప్రయాణం సంతృప్తిగానే ఉంది!
బలమైన కథలకు.. శక్తిమంతమైన మహిళా పాత్రలకు చిరునామాగా నిలుస్తుంటాయి సుధా కొంగర చిత్రాలు. ఇప్పుడామె దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం ‘సర్ఫిరా’. ఇది సుధా - సూర్య కాంబోలో వచ్చిన విజయవంతమైన సినిమా ‘సూరారై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’)కు రీమేక్గా రూపొందింది. -
శరవేగంగా వరుణ్, జాన్వీల ప్రేమకథ
‘బవాల్’తో ప్రేక్షకుల్ని అలరించిన వరుణ్ ధావన్, జాన్వీ కపూర్.. ఇప్పుడు మరోసారి ప్రేమికులుగా తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతున్నారు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారి కీ తులసీ కుమారీ’. -
మా ‘డార్లింగ్’ అందర్నీ మెప్పిస్తుంది
‘‘వినోదం.. భావోద్వేగాలతో కుటుంబ సమేతంగా కనెక్ట్ అయ్యేలా తీసిన చిత్రం ‘డార్లింగ్’. తప్పకుండా ఇది అందర్నీ మెప్పిస్తుంది’’ అన్నారు నిర్మాత చైతన్య రెడ్డి. ‘హనుమాన్’ విజయం తర్వాత చైతన్య, కె.నిరంజన్ రెడ్డిల సంయుక్త నిర్మాణం నుంచి వస్తున్న చిత్రమే ‘డార్లింగ్’. -
రాజమౌళి జీవితంపై డాక్యుమెంటరీ
భారతీయ సినిమాను ఆస్కార్ వేదికపై సగర్వంగా నిలబెట్టిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రాలతో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించిన ఈయనపై ‘మోడ్రన్ మాస్టర్స్:ఎస్ ఎస్ రాజమౌళి’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది నెట్ఫ్లిక్స్ సంస్థ. -
రామ్చరణ్ ముగించారు
కథానాయకుడు రామ్చరణ్.. దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్రాజు నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. ఎస్.జె.సూర్య, అంజలి, శ్రీకాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
ఆలస్యంగా సబర్మతీ రిపోర్ట్
ఎంతో మంది జీవితాల్ని మార్చేసిన గోద్రా రైలు దహన కాండలోని రహస్యాలను ప్రపంచానికి చూపించడానికి వస్తోంది ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. -
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
సామాజిక మాధ్యమాల వేదికగా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర ఫొటోలు, విశేషాలు మీకోసం.. -
ఓటీటీలో ఫహద్ ఫాజిల్ ‘ధూమం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఫహాద్ ఫాజిల్ (Fahad Faasil) కీలక పాత్రలో నటించిన మలయాళ(Malayalam) మూవీ ధూమం. ఇప్పటికే ఓటీటీ వేదిక యాపిల్లో స్ట్రీమింగ్ అవుతుండగా, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?
-
ప్రభాస్ పెళ్లిపై స్పందించిన శ్యామలా దేవి.. సక్సెస్ రాదన్నారు వచ్చింది
-
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
-
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
-
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?